Job Cheating: ఉద్యోగ ప్రయత్నం చేసి.. అలసిపోయిన అమాయకులే వాళ్ల టార్గెట్..
- అమాయకులైన నిరుద్యోగులకు వల
- కలెక్టరేట్లో ఉద్యోగాలిప్పిస్తానని బురిడీ
- ఒక్కొక్కరి వద్ద రూ. 4 లక్షల వరకు వసూలు
- జాయింట్ కలెక్టర్ సంతకం ఫోర్జరీ
- నకిలీ అపాయింట్మెంట్స్ ఇచ్చిన నాగార్జున
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యోగం ఇప్పిస్తామంటే ఎవరికి మాత్రం ఆశ ఉండదు. అది కూడా గవర్నమెంట్ ఆఫీసులో కొలవు అంటే ఎగిరి గంతేస్తారు. సరిగ్గా దీన్నే కొంత మంది కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. నిజానికి అలాంటి వాడికే ఉద్యోగానికి టికానా ఉండదు. కానీ ఉద్యోగాలిప్పిస్తామని బురిడీ కొట్టి అమాయకుల దగ్గర డబ్బులు కాజేస్తున్నారు. అలాంటి ఉదంతమే గుంటూరు జిల్లాలో బయటపడింది. ఉద్యోగ ప్రయత్నం చేసి.. చేసి అలసిపోయిన అమాయకులే వాళ్ల టార్గెట్..
Also Read:Hyd Sarogacy: అడ్డదారుల్లో వెళ్తుంటే అడ్డుకోవాల్సిన తల్లే.. కొడుకు, కూతురుతో అక్రమ దందా చేయిస్తూ..
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
గవర్నమెంట్ ఉద్యోగం, ఔట్ సోర్సింగ్ జాబ్ అంటూ ఎర.. పాపం.. ఆ అమాయకులు వారిని గుడ్డిగా నమ్మేసి.. వారు అడిగినంతా సమర్పించుకుంటారు. ఇక అప్పటి నుంచి అసలు కథ షురూ అవుతుంది. నిజానికి డబ్బు చేతికి వచ్చే వరకు.. ఒక్క రింగ్కే ఫోన్ లిఫ్ట్ చేసే కేటుగాళ్లు.. డబ్బులు అందిన తర్వాత మాత్రం.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఫోన్కు ఆన్సర్ చేసినా.. ఇదిగో అదిగో అంటూ తిప్పంచుకుంటారు..
Also Read:Coolie : ఈ కూలీ కూలి ఎక్కువే.. మాస్ రాంపేజ్.. ఎన్ని వందల కోట్లంటే?
గుంటూరు జిల్లాలోనూ సరిగ్గా ఇలాంటి కేటుగాడే తయారయ్యాడు. అమాయకులైన నిరుద్యోగులను వలలో వేసుకున్నాడు నాగార్జున అనే బ్రోకర్. కలెక్టరేట్లో ఉద్యోగాలిప్పిస్తానని బురిడీ కొట్టించాడు. ఒక్కొక్కరి వద్ద దాదాపు రూ. 4 లక్షల వరకు వసూలు చేశాడు. చాలా రోజులు తన చుట్టూ తిప్పించుకుని.. బాధితులు గట్టిగా అడిగే సరికి మరో మోసానికి తెరతీశాడు. ఏకంగా జాయింట్ కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ అపాయింట్మెంట్స్ ఇచ్చి చేతులు దులుపుకున్నాడు.
Also Read:Coolie : ఈ కూలీ కూలి ఎక్కువే.. మాస్ రాంపేజ్.. ఎన్ని వందల కోట్లంటే?
ఈ క్రమంలో నర్సీపట్నంకు చెందిన చింరజీవి, పూర్ణ.. నాగార్జున చేతిలో మోసపోయారు. ఇప్పుడు గుంటూరు జిల్లా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. బాధిత యువకులు గ్రీవెన్స్లోఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు చెప్పడంతో మళ్లీ పోలీసులను ఆశ్రయించే పనిలో పడ్డారు. గవర్నమెంట్ ఉద్యోగాల పేరుతో ఎవరు డబ్బులు అడిగినా నమ్మవద్దని పోలీసులు చెబుతున్నారు. అలా డబ్బులు అడుగుతున్నారంటే కచ్చితంగా మోసగాళ్లే అయి ఉంటారంటున్నారు. కాబట్టి వారి వలలో చిక్కుకుని డబ్బులు పోగొట్టుకోవద్దని వార్నింగ్ ఇస్తున్నారు.
- Tags
- fraud
- Guntur District
- Jobs
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!