Job Cheating: ఉద్యోగ ప్రయత్నం చేసి.. అలసిపోయిన అమాయకులే వాళ్ల టార్గెట్..
- అమాయకులైన నిరుద్యోగులకు వల
- కలెక్టరేట్లో ఉద్యోగాలిప్పిస్తానని బురిడీ
- ఒక్కొక్కరి వద్ద రూ. 4 లక్షల వరకు వసూలు
- జాయింట్ కలెక్టర్ సంతకం ఫోర్జరీ
- నకిలీ అపాయింట్మెంట్స్ ఇచ్చిన నాగార్జున
ఉద్యోగం ఇప్పిస్తామంటే ఎవరికి మాత్రం ఆశ ఉండదు. అది కూడా గవర్నమెంట్ ఆఫీసులో కొలవు అంటే ఎగిరి గంతేస్తారు. సరిగ్గా దీన్నే కొంత మంది కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. నిజానికి అలాంటి వాడికే ఉద్యోగానికి టికానా ఉండదు. కానీ ఉద్యోగాలిప్పిస్తామని బురిడీ కొట్టి అమాయకుల దగ్గర డబ్బులు కాజేస్తున్నారు. అలాంటి ఉదంతమే గుంటూరు జిల్లాలో బయటపడింది. ఉద్యోగ ప్రయత్నం చేసి.. చేసి అలసిపోయిన అమాయకులే వాళ్ల టార్గెట్..
Also Read:Hyd Sarogacy: అడ్డదారుల్లో వెళ్తుంటే అడ్డుకోవాల్సిన తల్లే.. కొడుకు, కూతురుతో అక్రమ దందా చేయిస్తూ..
Also Read
- BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
- Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
- Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్లైన్స్ హెచ్చరిక..
- Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
గవర్నమెంట్ ఉద్యోగం, ఔట్ సోర్సింగ్ జాబ్ అంటూ ఎర.. పాపం.. ఆ అమాయకులు వారిని గుడ్డిగా నమ్మేసి.. వారు అడిగినంతా సమర్పించుకుంటారు. ఇక అప్పటి నుంచి అసలు కథ షురూ అవుతుంది. నిజానికి డబ్బు చేతికి వచ్చే వరకు.. ఒక్క రింగ్కే ఫోన్ లిఫ్ట్ చేసే కేటుగాళ్లు.. డబ్బులు అందిన తర్వాత మాత్రం.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఫోన్కు ఆన్సర్ చేసినా.. ఇదిగో అదిగో అంటూ తిప్పంచుకుంటారు..
Also Read:Coolie : ఈ కూలీ కూలి ఎక్కువే.. మాస్ రాంపేజ్.. ఎన్ని వందల కోట్లంటే?
గుంటూరు జిల్లాలోనూ సరిగ్గా ఇలాంటి కేటుగాడే తయారయ్యాడు. అమాయకులైన నిరుద్యోగులను వలలో వేసుకున్నాడు నాగార్జున అనే బ్రోకర్. కలెక్టరేట్లో ఉద్యోగాలిప్పిస్తానని బురిడీ కొట్టించాడు. ఒక్కొక్కరి వద్ద దాదాపు రూ. 4 లక్షల వరకు వసూలు చేశాడు. చాలా రోజులు తన చుట్టూ తిప్పించుకుని.. బాధితులు గట్టిగా అడిగే సరికి మరో మోసానికి తెరతీశాడు. ఏకంగా జాయింట్ కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ అపాయింట్మెంట్స్ ఇచ్చి చేతులు దులుపుకున్నాడు.
Also Read:Coolie : ఈ కూలీ కూలి ఎక్కువే.. మాస్ రాంపేజ్.. ఎన్ని వందల కోట్లంటే?
ఈ క్రమంలో నర్సీపట్నంకు చెందిన చింరజీవి, పూర్ణ.. నాగార్జున చేతిలో మోసపోయారు. ఇప్పుడు గుంటూరు జిల్లా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. బాధిత యువకులు గ్రీవెన్స్లోఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు చెప్పడంతో మళ్లీ పోలీసులను ఆశ్రయించే పనిలో పడ్డారు. గవర్నమెంట్ ఉద్యోగాల పేరుతో ఎవరు డబ్బులు అడిగినా నమ్మవద్దని పోలీసులు చెబుతున్నారు. అలా డబ్బులు అడుగుతున్నారంటే కచ్చితంగా మోసగాళ్లే అయి ఉంటారంటున్నారు. కాబట్టి వారి వలలో చిక్కుకుని డబ్బులు పోగొట్టుకోవద్దని వార్నింగ్ ఇస్తున్నారు.
- Tags
- fraud
- Guntur District
- Jobs
తాజావార్తలు
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
-
Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
-
Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్లైన్స్ హెచ్చరిక..
-
Bellamkonda Srinivas: రేపు పెళ్లి.. ఆ రోజు గ్రాండ్ రిసెప్షన్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో