Hospital Fraud: వైద్యం కోసం వెళ్తే.. వివరాలు సేకరించి లోన్ తీసుకున్న కేటుగాళ్లు
- కూకట్పల్లిలోని అమోర్ హాస్పిటల్లో ఘరానా మోసం.
- వైద్యం కోసం వెళ్తే.. వివరాలు సేకరించి లోన్ తీసుకున్న కేటుగాళ్లు
- కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hospital Fraud: కూకట్పల్లిలోని అమోర్ హాస్పిటల్లో వైద్యం కోసం వచ్చిన పేషెంట్లను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 2022లో వైద్యం నిమిత్తం హాస్పిటల్ను ఆశ్రయించిన ఓ బాధితురాలి పేరుపై రహస్యంగా ప్రైవేట్ లోన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ మోసపూరిత చర్యలకు పాల్పడిన హాస్పిటల్ యాజమాన్యం, థర్డ్ పార్టీ బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకుని బాధితులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Read Also: Irregular Menstrual Cycle: మహిళలకి ఎందుకు ఋతు చక్రం సమస్యలు వస్తాయంటే?
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఈ విషయమై బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మీకు ఇన్సూరెన్స్ రెడీ చేస్తున్నామని హాస్పిటల్ సిబ్బంది చెప్పి, వారికి తెలియకుండానే బాధితురాలి బావ పేరుపై లోన్ తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత బాధితులు హాస్పిటల్ యాజమాన్యాన్ని సంప్రదించగా.. వారు సమస్యను పరిష్కరించడానికి బదులు మాపై దుష్ప్రచారం చేస్తున్నారు, ఎవరితో చెప్పుకుంటారు చెప్పుకోండి అంటూ బాధితులను హాస్పిటల్ నుంచి బయటకు నెట్టివేశారు. ఈ ఘటన బాధితులను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది.
Betting App Promotions: చిక్కుల్లో మరో హీరోయిన్?
ఈ మోసంలో భాగంగా బాధితుల పేరుపై రూ. 1,14,539 బ్యాంక్ లోన్ ఉన్నట్లు వెల్లడైంది. థర్డ్ పార్టీ బ్యాంక్ సిబ్బంది బాధితులకు ఫోన్ చేసి, మీరు లోన్ కట్టాల్సిందే, లేకపోతే సిబిల్ స్కోర్లో సమస్యలు వస్తాయి అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాట్లు బాధితులు తెలిపారు. ఈ బెదిరింపులు బాధిత కుటుంబాన్ని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ దుర్మార్గపు చర్యలకు వ్యతిరేకంగా బాధితులు కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అమోర్ హాస్పిటల్ యాజమాన్యం చేసిన మోసంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!