Delhi: పదో తరగతి బాలుడిపై నలుగురు టీచర్లు దాడి.. తీవ్ర గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యా బుద్ధులు నేర్పించాల్సిన టీచర్లు పదవ తరగతి బాలుడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఒక్కరు కాదు ఏకంగా నలుగురు కలిసి ఆ మైనర్ బాలుడిని తీవ్రంగా కొట్టారు. దీంతో అతడు ఆసుపత్రి పాలు కావాల్సి వచ్చింది. ఈ ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగింది. చాలా రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
Also Read: Red Rice Benefits: రెడ్ రైస్ ను రోజూ ఒక కప్పు తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో.. ఆ సమస్యలకు చెక్..
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
వివరాల ప్రకారం ఢిల్లీలోని యమునా విహార్ ప్రాంతంలో 10వ తరగతి చదువుతున్న బాలుడు తరగతి టీచర్ పాఠాలు చెబుతుండగా తరగతి గది కిటికీలోంచి బయటకు చూశాడు. దీంతో టీచర్ వచ్చి తనని చెంప దెబ్బ కొట్టాడు. నొప్పిగా ఉంది అంటే మరో మూడు నాలుగు చెంప దెబ్బలు వరుసగా కొట్టాడు. తరువాత తానే వెళ్లి ఉపాధ్యాయుడికి సారీ చెప్పానని ఆ విద్యార్ధి తెలిపాడు. తనని కొట్టాడమే కాకుండా తరగతి గది నుంచి గంటేశారని ఆ విద్యార్థి తెలిపాడు. తర్వాత తనను ఎన్సీసీ గదికి తీసుకెళ్లాడనీ, అదే పాఠశాలలో పని చేస్తున్న అతని ముగ్గురు స్నేహితులతో కలిసి తీవ్రంగా కొట్టారని విద్యార్థి తెలిపాడు. అయితే తనని ఎందుకు కొట్టారో తెలియదని అతను పేర్కొంటున్నాడు.
ఈ దాడిలో తన నడుము, ఛాతీలో గాయాలు అయ్యాయనీ, ముఖం ఉబ్బిందని చెప్పుకొచ్చాడు ఆ విద్యార్థి. తనని కొట్టడమే కాకుండా ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారని విద్యార్థి వాపోయాడు. అయితే తాను జరిగిన విషయాన్నంత తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించాడు. ఈ దాడికి సంబంధించి ఈశాన్య ఢిల్లీలోని భజన్ పురా పోలీస్ స్టేషన్ లో నలుగురు ఉపాధ్యాయులపై ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. అసలేం జరిగిందో కనుక్కొని చర్యలు తీసుకుంటామని పోలీసుల తెలుపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు నలుగురు ఇలా చేయడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పేద విద్యార్థులను స్కూల్ కు పంపిస్తే వారిని ఇలా హింసిస్తారా అంటూ మండిపడుతున్నారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!