Delhi: పదో తరగతి బాలుడిపై నలుగురు టీచర్లు దాడి.. తీవ్ర గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యా బుద్ధులు నేర్పించాల్సిన టీచర్లు పదవ తరగతి బాలుడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఒక్కరు కాదు ఏకంగా నలుగురు కలిసి ఆ మైనర్ బాలుడిని తీవ్రంగా కొట్టారు. దీంతో అతడు ఆసుపత్రి పాలు కావాల్సి వచ్చింది. ఈ ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగింది. చాలా రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
Also Read: Red Rice Benefits: రెడ్ రైస్ ను రోజూ ఒక కప్పు తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో.. ఆ సమస్యలకు చెక్..
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
వివరాల ప్రకారం ఢిల్లీలోని యమునా విహార్ ప్రాంతంలో 10వ తరగతి చదువుతున్న బాలుడు తరగతి టీచర్ పాఠాలు చెబుతుండగా తరగతి గది కిటికీలోంచి బయటకు చూశాడు. దీంతో టీచర్ వచ్చి తనని చెంప దెబ్బ కొట్టాడు. నొప్పిగా ఉంది అంటే మరో మూడు నాలుగు చెంప దెబ్బలు వరుసగా కొట్టాడు. తరువాత తానే వెళ్లి ఉపాధ్యాయుడికి సారీ చెప్పానని ఆ విద్యార్ధి తెలిపాడు. తనని కొట్టాడమే కాకుండా తరగతి గది నుంచి గంటేశారని ఆ విద్యార్థి తెలిపాడు. తర్వాత తనను ఎన్సీసీ గదికి తీసుకెళ్లాడనీ, అదే పాఠశాలలో పని చేస్తున్న అతని ముగ్గురు స్నేహితులతో కలిసి తీవ్రంగా కొట్టారని విద్యార్థి తెలిపాడు. అయితే తనని ఎందుకు కొట్టారో తెలియదని అతను పేర్కొంటున్నాడు.
ఈ దాడిలో తన నడుము, ఛాతీలో గాయాలు అయ్యాయనీ, ముఖం ఉబ్బిందని చెప్పుకొచ్చాడు ఆ విద్యార్థి. తనని కొట్టడమే కాకుండా ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారని విద్యార్థి వాపోయాడు. అయితే తాను జరిగిన విషయాన్నంత తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించాడు. ఈ దాడికి సంబంధించి ఈశాన్య ఢిల్లీలోని భజన్ పురా పోలీస్ స్టేషన్ లో నలుగురు ఉపాధ్యాయులపై ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. అసలేం జరిగిందో కనుక్కొని చర్యలు తీసుకుంటామని పోలీసుల తెలుపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు నలుగురు ఇలా చేయడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పేద విద్యార్థులను స్కూల్ కు పంపిస్తే వారిని ఇలా హింసిస్తారా అంటూ మండిపడుతున్నారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?