Ganja Smuggling : నలుగురు అంతరాష్ట్ర గంజాయి ముఠా సభ్యులు అరెస్ట్
- 1.5 కేజీ ల గంజాయి.. ఒక వ్యాన్.. మూడు సెల్ ఫోన్లు స్వాధీనం
- ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి చాకచక్యంగా పట్టుకున్న జిల్లా పోలీసులు
- పత్రికా సమావేశంలో వివరాలను వెల్లడించిన ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదిలాబాద్ రూరల్ సర్కిల్ పరిధిలో నలుగురు అంతర్రాష్ట్ర గంజాయి ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి మీడియా సమావేశం లో ఏర్పాటుచేసి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల లో తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో మహారాష్ట్రతో అనుసంధానంగా ఉన్న లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ వద్ద భారీ ఎత్తున గంజాయి పట్టుబడిన సందర్భంలో ఈ నిందితులు ఆ కేసులో మిగిలినవారుగా ఉండడం, అదేవిధంగా ఆ గంజాయి తరలించే క్రమం లో వాహనానికి ముందు ఒక వాహనంలో ఉంటూ గంజాయి పోలీసులకు లభ్యం కాకుండా ఫోన్ ద్వారా సంభాషిస్తూ ఉండడం జరిగిందని తెలిపారు.
ప్రస్తుతం పట్టుకున్న నిందితుల వివరాలు.
1) గోతిరాం గురుదయాల్ సాబ్లే బుల్దన జిల్లా మహారాష్ట్ర.
2) శుభం గోతిరాం సబ్లే s/o గోతిరాం సబ్లె, బుల్దాన జిల్లా, మహారాష్ట్ర.
3) అమర్ సింగ్ నారాయణ గోతి s/o నారాయణ గోతి, బుల్దాన మహారాష్ట్ర.
4) సోమనాథ్ బికా సాబ్లె s/o బికా, జెల్గాన్ జిల్లా, మహారాష్ట్ర.
Also Read
- ఎలాన్ మస్క్ పై ‘Musk’ డాక్యుమెంటరీ.. ట్రైలర్లో సంచలన వ్యాఖ్యలు..!
- Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ సమయంలో మెదడులో ఏం జరుగుతుంది? ప్రతి సెకను ఎందుకు కీలకం?
- Heart Attack: షాకింగ్.. 13 ఏళ్లకే గుండెపోటు.. స్కూల్ వాష్రూమ్లో ఏడో తరగతి బాలుడి మృతి..
- India vs Pakistan: ఆసియా కప్లో మరోసారి భారత్-పాక్ పోరు సాధ్యమే.. కానీ, ఓ ట్విస్ట్!
లను ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నట్టు తెలియజేసారు. వీరి వద్ద ఒకటిన్నర కిలోల గంజాయి, మూడు సెల్ ఫోన్లు, గత నెలలో గంజాయి కేసులో వాహనానికి ముందుండి నడిపిన వ్యానును స్వాధీనం తీసుకున్నట్లు తెలిపారు. ఆ కేసు నందు ప్రధాన సూతధారిగా ఉన్న మిగిలిన వారిని కూడా అరెస్టు చేయడానికి ఈ బృందం కార్యచరణను కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కేసులో ముగ్గురు వాహనంలో ఉండగా, ఒకరు గంజాయిని వ్యాపారంగా చేసుకునే వ్యక్తి గా డిఎస్పి గారు తెలిపారు. అరెస్టు నందు ఎంతగానో కృషి చేసిన జైనథ్ సిఐ డి సాయినాథ్, రూరల్ సీఐ కె ఫనిధర్, ఎస్సై ముజాహిద్, సిబ్బంది రుక్మారెడ్డి, గంగాధర్ రెడ్డి, శ్రీనివాస్, సిబ్బంది తదితరులను జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించడం జరిగిందని తెలిపారు.
తాజావార్తలు
-
OTT Releases: ఓటీటీలో హాలీవుడ్ హవా.. ఈ వీకెండ్ వీటిని అస్సలు మిస్ చేయొద్దు
-
ShubmanGill vs Abhishek Sharma: అభిషేక్ శర్మ రివెంజ్.. శుభ్మన్ గిల్ షాక్.. వైరల్ వీడియో!
-
Mamitha Baiju : హ్యట్రిక్ రూ. 200 క్రోర్ క్లబ్.. మమితా బైజు రేర్ రికార్డ్
-
ఎలాన్ మస్క్ పై ‘Musk’ డాక్యుమెంటరీ.. ట్రైలర్లో సంచలన వ్యాఖ్యలు..!
-
Postpone Trend : పెద్ద సినిమా అంటే పోస్ట్పోన్ వార్త వైరల్ కావాల్సిందే
ట్రెండింగ్
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!