Maharashtra: దారుణం.. ఆ కారణంతో నలుగురు దళితులను చెట్టుకు వేలాడదీసి కొట్టారు
Maharashtra: ఆ మధ్యకాలంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్ లో దళితుడిపై మూత్రం పోసి హింసించారు. తరువాత దళితుడిని ఫ్రీగా చికెన్ ఇవ్వలేదని చితకబాదారు. ఇక ఓ ప్రభుత్వ ఉద్యోగి దళిత యువకుడిని కొట్టి అతనితో చెప్పులు నాకించాడు. ఇలాంటి ఘటనలు అని కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలాంటి చర్యలను అరికట్టడానికి పోలీసులు ఎంత ప్రయత్నిస్తున్నా దేశంలో ఏదో ఒక చోట దళితులపై జరుగుతున్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. తమ మేకలను దొంగలించారనే కారణంతో నలుగురు దళిత యువకులను చెట్టుకు కట్టేసి కొట్టి హింసించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా శ్రీరామ్పుర్ తాలుక పరిధి హరేగాన్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Also Read: Rahul Gandhi : చిన్నారిని ఆటోగ్రాఫ్ ఇస్తావా అని అడిగిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్
Also Read
- PM Modi: మే 4న స్వీట్లు, బాణాసంచా సిద్ధం చేసుకోండి.. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మోడీ పిలుపు
- SRH Players Dance: గ్రౌండ్లో బ్యాట్తోనే కాదు.. ఫ్లోర్పై డాన్స్తో కూడా అదరగొడుతున్న SRH ఆటగాళ్లు.. వీడియో వైరల్!
- Shivathmika: నెపోటిజంపై శివాత్మిక రాజశేఖర్ బోల్డ్ కామెంట్స్..
- Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
వివరాల్లోకి వెళ్తే.. తమ మేకలు, పావురాలు కనపించక పోవడంతో తమ ఇంటి పక్కన ఉన్న దళిత యువకులపై ఒకరికి అనుమానం వచ్చింది. దీంతో కొంతమందితో కలిసి ఆగస్టు 25న హరేగాన్లో ఆరుగురు వ్యక్తులు దళిత కుటుంబాలకు చెందిన 20 ఏళ్ల వయసున్న నలుగురి ఇళ్లకు వెళ్లి తమవెంట రావాలని అడిగారు. వారు రావడానికి అంగీకరించకపోవడంతో వారిని బలవంతంగా తీసుకెళ్లారు. అనంతరం వారిని చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి కర్రలతో దారుణంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. యువరాజ్ గలాండే, మనోజ్ బోడకే, పప్పు పార్కే, దీపక్ గైక్వాడ్, దుర్గేష్ వైద్య, రాజు బొరాగేలు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రితో చేర్పించారు పోలీసులు. బాధితుల్లో ఒకరైన శుభం మగడే దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక నిందితులపై హత్యాయత్నం, కిడ్నాప్, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
PM Modi: మే 4న స్వీట్లు, బాణాసంచా సిద్ధం చేసుకోండి.. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మోడీ పిలుపు
-
SRH Players Dance: గ్రౌండ్లో బ్యాట్తోనే కాదు.. ఫ్లోర్పై డాన్స్తో కూడా అదరగొడుతున్న SRH ఆటగాళ్లు.. వీడియో వైరల్!
-
Shivathmika: నెపోటిజంపై శివాత్మిక రాజశేఖర్ బోల్డ్ కామెంట్స్..
-
Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
-
Petrol, Diesel Price Hike: ఎలక్షన్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ.. పాత రికార్డులు గుర్తు చేస్తూ..
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?