Hyderabad: దేశ వ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు ఆనందోత్సవాలతో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ భవన్లో కూడా ఘనంగా రిపబ్లిక్ వేడుకలు నిర్వహించేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. కాగా, జెండా ఆవిష్కరణకు మాజీ హోంమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహమూద్ అలీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే ఆయన ఉన్నట్టుండి ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు.
Read Also: KTR Tweet: కేటీఆర్ సంచలన ట్వీట్.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్ట్..
దీంతో అప్రమత్తమైన బీఆర్ఎస్ పార్టీ నేతలు, శ్రేణులు వెంటనే మహమూద్ అలీని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ అంతలోనే ఆయన తిరిగి సాధారణ స్థితిలోకి వచ్చారు. దీంతో పార్టీ శ్రేణులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పడిపోవడంతోనే స్పృహ కోల్పోయినట్లుగా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు, శ్రేణులు అన్ని జిల్లాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
#WATCH | Hyderabad: Former Telangana Deputy CM Mahmood Ali faints during #RepublicDay2024 celebrations at Telangana Bhawan. pic.twitter.com/GCzoMb9l8U
— ANI (@ANI) January 26, 2024