Tamilnadu: రచ్చకెక్కిన మాజీ డీజీపీ దంపతుల పంచాయితీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు మాజీ డీజీపీ రాజేశ్ దాస్-మాజీ భార్య బీలా వెంకటేశన్ ఇంటిపోరు రచ్చకెక్కింది. రాజేశ్ దాస్ నివాసం ఉంటున్న ఇంటికి కరెంట్ కనెక్షన్ను బీలా తొలగించేశారు. విడాకులకు ముందు జాయింట్ లోన్తో ఇల్లు కొన్నారు. కరెంట్ కనెక్షన్ మాత్రం తన పేరిట ఉందని ఆమె తెలిపారు. అందుకే తొలగించినట్లు ఆమె చెప్పారు. కానీ తనను వేధించేందుకే బీలా విద్యుత్ శాఖ సెక్రటరీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని దాస్ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Tollywood Heroes : హైయేస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న యంగ్ హీరోలు వీరే..
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
2023లో విల్లుపురంలోని ట్రయల్ కోర్టు రాజేష్ దాస్ తన కింద పనిచేస్తున్న మహిళా ఐపీఎస్ అధికారిని లైంగికంగా వేధించిన కేసులో దోషిగా తేల్చింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేష్ దాస్ తమిళనాడులోని చెన్నైలో తన ఇంటికి సోమవారం (మే 20న) విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో చీకటిలో ఉండిపోయారు. ఆయన మాజీ భార్య బీలా వెంకటేశన్పై ఆయన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ఇంధన కార్యదర్శిగా ఉన్న ఆమె.. తాను నివాసం ఉంటున్న ఇంటికి విద్యుత్ను డిస్కనెక్ట్ చేసి ఆమెకు ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Jayam Sada Sister: జయం మూవీలో సదా చెల్లెలి లేటెస్ట్ లుక్.. పెళ్లి చేసుకుని పిల్లలు కూడా?
తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ అధికారులు మే 19, ఆదివారం విద్యుత్ సరఫరాను డిస్కనెక్ట్ చేయడానికి రాజేష్ దాస్ ఇంటికి వెళ్లారు. అయితే వారి ప్రయత్నాలను దాస్ ప్రతిఘటించడంతో వారు వెళ్లిపోయారు. రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి లేఖతో అధికారులు సోమవారం తిరిగి వచ్చి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలపై బీలా స్పందిస్తూ.. గత మూడు నెలలుగా ఇల్లు ఖాళీగా ఉందని, కనెక్షన్, భూమి తన పేరు మీద ఉన్నందున అనవసరంగా కరెంటు బిల్లుల కోసం డబ్బు ఖర్చు చేయకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అధికారులు వారి బాధ్యతను నెరవేర్చారని తెలిపారు.
2023లో విల్లుపురంలోని ట్రయల్ కోర్టు రాజేష్ దాస్ తన కింద పనిచేస్తున్న మహిళా ఐపీఎస్ అధికారిని లైంగికంగా వేధించిన కేసులో దోషిగా నిర్ధారించింది. ఈ ఏడాది ఏప్రిల్లో అతను రెండు పిటిషన్లతో మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఒకటి శిక్షను నిలిపివేయాలని, మరొకటి ట్రయల్ కోర్టు ముందు లొంగిపోకుండా మినహాయింపు కోరుతూ పిటిషన్ వేశారు. కానీ రెండు పిటిషన్లు కొట్టేసింది. ఈ రెండు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసినందుకు వ్యతిరేకంగా దాఖలైన అప్పీల్పై విచారణ సందర్భంగా మే 17న ఆయన అరెస్టుపై మధ్యంతర స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: Alcohol Withdrawal: ఒక్కసారిగా మద్యం మానేస్తే ఏమౌతుందో తెలుసా?
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!