Tamilnadu: రచ్చకెక్కిన మాజీ డీజీపీ దంపతుల పంచాయితీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు మాజీ డీజీపీ రాజేశ్ దాస్-మాజీ భార్య బీలా వెంకటేశన్ ఇంటిపోరు రచ్చకెక్కింది. రాజేశ్ దాస్ నివాసం ఉంటున్న ఇంటికి కరెంట్ కనెక్షన్ను బీలా తొలగించేశారు. విడాకులకు ముందు జాయింట్ లోన్తో ఇల్లు కొన్నారు. కరెంట్ కనెక్షన్ మాత్రం తన పేరిట ఉందని ఆమె తెలిపారు. అందుకే తొలగించినట్లు ఆమె చెప్పారు. కానీ తనను వేధించేందుకే బీలా విద్యుత్ శాఖ సెక్రటరీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని దాస్ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Tollywood Heroes : హైయేస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న యంగ్ హీరోలు వీరే..
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
2023లో విల్లుపురంలోని ట్రయల్ కోర్టు రాజేష్ దాస్ తన కింద పనిచేస్తున్న మహిళా ఐపీఎస్ అధికారిని లైంగికంగా వేధించిన కేసులో దోషిగా తేల్చింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేష్ దాస్ తమిళనాడులోని చెన్నైలో తన ఇంటికి సోమవారం (మే 20న) విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో చీకటిలో ఉండిపోయారు. ఆయన మాజీ భార్య బీలా వెంకటేశన్పై ఆయన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ఇంధన కార్యదర్శిగా ఉన్న ఆమె.. తాను నివాసం ఉంటున్న ఇంటికి విద్యుత్ను డిస్కనెక్ట్ చేసి ఆమెకు ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Jayam Sada Sister: జయం మూవీలో సదా చెల్లెలి లేటెస్ట్ లుక్.. పెళ్లి చేసుకుని పిల్లలు కూడా?
తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ అధికారులు మే 19, ఆదివారం విద్యుత్ సరఫరాను డిస్కనెక్ట్ చేయడానికి రాజేష్ దాస్ ఇంటికి వెళ్లారు. అయితే వారి ప్రయత్నాలను దాస్ ప్రతిఘటించడంతో వారు వెళ్లిపోయారు. రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి లేఖతో అధికారులు సోమవారం తిరిగి వచ్చి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలపై బీలా స్పందిస్తూ.. గత మూడు నెలలుగా ఇల్లు ఖాళీగా ఉందని, కనెక్షన్, భూమి తన పేరు మీద ఉన్నందున అనవసరంగా కరెంటు బిల్లుల కోసం డబ్బు ఖర్చు చేయకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అధికారులు వారి బాధ్యతను నెరవేర్చారని తెలిపారు.
2023లో విల్లుపురంలోని ట్రయల్ కోర్టు రాజేష్ దాస్ తన కింద పనిచేస్తున్న మహిళా ఐపీఎస్ అధికారిని లైంగికంగా వేధించిన కేసులో దోషిగా నిర్ధారించింది. ఈ ఏడాది ఏప్రిల్లో అతను రెండు పిటిషన్లతో మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఒకటి శిక్షను నిలిపివేయాలని, మరొకటి ట్రయల్ కోర్టు ముందు లొంగిపోకుండా మినహాయింపు కోరుతూ పిటిషన్ వేశారు. కానీ రెండు పిటిషన్లు కొట్టేసింది. ఈ రెండు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసినందుకు వ్యతిరేకంగా దాఖలైన అప్పీల్పై విచారణ సందర్భంగా మే 17న ఆయన అరెస్టుపై మధ్యంతర స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: Alcohol Withdrawal: ఒక్కసారిగా మద్యం మానేస్తే ఏమౌతుందో తెలుసా?
తాజావార్తలు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!