Naresh Gujral: మాజీ ప్రధాని కుమారుడికి రూ.7.8 కోట్ల సైబర్ మోసం.. వాట్సాప్ మెసేజ్ తో కొల్లకొగొట్టేసారు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naresh Gujral: దేశ రాజధాని ఢిల్లీలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. మాజీ ప్రధాని ఇందర్ కుమార్ గుజ్రాల్ కుమారుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు నరేష్ కుమార్ గుజ్రాల్ రూ.7.80 కోట్ల సైబర్ మోసానికి గురైనట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.
పోలీసుల సమాచారం ప్రకారం.. సైబర్ నేరస్థులు అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేశారని తెలిపారు. ప్రస్తుతం మోసపోయిన మొత్తంలో దాదాపు రూ.4 కోట్లను అధికారులు ఫ్రీజ్ చేయడంలో విజయవంతమయ్యారు. దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. నరేష్ గుజ్రాల్ ఫోటోను ఉపయోగించి నిందితులు వాట్సాప్లో నకిలీ ఖాతాను సృష్టించారు. అనంతరం ఆయన సిబ్బందిలో ఒకరిని సంప్రదించి తామే నరేష్ గుజ్రాల్ అని నమ్మించారు.
Also Read
- Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
- Jofra Archer: "ఇది ఐపీఎల్ కాదు".. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
- Fake Condoms: "కండోమ్"లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
- Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
తాను ఒక ముఖ్యమైన సమావేశంలో ఉన్నానని, అత్యవసరంగా నిర్దిష్ట బ్యాంకు ఖాతాకు ఆర్టీజీఎస్ (RTGS) ద్వారా డబ్బులు బదిలీ చేయాలని సూచించినట్లు పోలీసులు తెలిపారు. నమ్మకంతో సిబ్బంది ఆదేశాలను అమలు చేయడంతో కోట్ల రూపాయలు మోసగాళ్ల ఖాతాల్లోకి వెళ్లాయి. ఈ మోసం జరిగిన విషయం నరేష్ గుజ్రాల్ కుమార్తె దీక్షా గుజ్రాల్ అప్రమత్తతతో బయటపడింది. అనుమానాస్పద ఆర్థిక లావాదేవీ జరిగినట్లు ఒక ఉద్యోగి ఆమెకు సమాచారం ఇచ్చాడు.
దీంతో వెంటనే ఆమె తన తండ్రిని సంప్రదించి నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. తాను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని నరేష్ గుజ్రాల్ చెప్పడంతో కుటుంబ సభ్యులు సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించారు. ఘటన తెలుసుకున్న వెంటనే దీక్షా గుజ్రాల్ జాతీయ సైబర్ మోసాల హెల్ప్లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఈ-ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. సమాచారం అందుకున్న సైబర్ క్రైమ్ అధికారులు వేగంగా స్పందించి బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా డబ్బుల బదిలీని ట్రాక్ చేశారు. ఈ చర్యల ఫలితంగా మోసపోయిన మొత్తంలో దాదాపు 70% నిధులను ఫ్రీజ్ చేయగలిగారు.
ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల సైబర్ సెల్ కేసును లోతుగా దర్యాప్తు చేస్తోంది. డబ్బు ఏ ఖాతాలకు వెళ్లింది.? ఈ మోసంలో ఎవరెవరు పాల్గొన్నారు.? నకిలీ వాట్సాప్ ఖాతాను ఎక్కడి నుంచి నిర్వహించారు వంటి అంశాలపై విచారణ కొనసాగుతోంది. మోసగాళ్లను గుర్తించి నిధులను పూర్తిగా తిరిగి పొందేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నరేష్ గుజ్రాల్ వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్. ఆయన శిరోమణి అకాలీ దళ్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు. 2007 నుంచి 2022 వరకు పంజాబ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. 2004 లోక్సభ ఎన్నికల్లో జలంధర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. నరేష్ గుజ్రాల్ భారత మాజీ ప్రధాని ఇందర్ కుమార్ గుజ్రాల్ కుమారుడు. ఇందర్ కుమార్ గుజ్రాల్ 1997 నుంచి 1998 వరకు దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
తాజావార్తలు
-
Rajesh Sharma : ఫౌజీ షూటింగ్లో రాజేష్ శర్మకు విషపురుగు కాటు?.. అసలు నిజం బయటపెట్టిన పీఏ!
-
Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
-
Jofra Archer: “ఇది ఐపీఎల్ కాదు”.. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
-
Fake Condoms: “కండోమ్”లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
-
Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..