Vellampalli Srinivas: బోండా ఉమాపై మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోండా ఉమాపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. బోండా ఉమా అఫిడవిట్ తప్పుల తడక అని ఆరోపించారు. బోండాపై మూడు ఫిర్యాదులు చేశాం.. సింగ్ నగర్ పార్టీ ఆఫీస్ లో ఓట్లు నమోదయ్యాయి.. ఎన్నికల నియమావళి ప్రకారం రెసిడెన్షియల్ లోనే ఓట్లు ఉండాలన్నారు. తమ ఫిర్యాదు పై సరైన చర్యలు తీసుకోలేదని తెలిపారు. 2014 లో అఫిడవిట్ లో తూర్పు నియోజకవర్గంలో ఇంటి అడ్రస్ పెట్టారని.. 2019 అఫిడవిట్ లోనూ తూర్పు నియోజకవర్గంలో ఇంటి అడ్రస్ నే పెట్టినట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ లో సింగ్ నగర్ పార్టీ ఆఫీస్ ను ఇల్లుగా చూపించారని.. ఆ భవనం ప్లాన్ అప్లై చేసినప్పుడే టీడీపీ పార్టీ ఆఫీస్ పేరుతో అనుమతులు తీసుకున్నారన్నారు.
READ MORE: KCR: తొలి ట్వీట్ చేసిన కేసీఆర్..
Also Read
- Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ 'చికెన్ పచ్చడి'.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
- CNG Price Hike: సామాన్యుడిపై ఇంధన భారం.. మరోసారి సీఎన్జీ ధరల పెంపు..
- US-Iran War: పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు.. ఇరాన్పై అమెరికా ‘ఆత్మరక్షణ’ దాడులు!
- Harmanpreet Kaur: రాష్ట్రపతి చేతుల మీదుగా 'పద్మశ్రీ' అందుకున్న టీమిండియా కెప్టెన్.!
పార్టీ ఆఫీస్ లో ఆయన ఎలా నివాసముంటున్నారని ప్రశ్నించారు. పార్టీ ఆఫీస్ లో ఓట్లు ఎలా నమోదు చేస్తారని అడిగారు. గతంలో వైసీపీ నేతల ఓట్లను బోండా బలవంతంగా రద్దు చేయించారని ఆరోపించారు. అదే రూల్ ఇప్పుడు బోండాకు ఎందుకు వర్తించదని ప్రశ్నించారు. టీడీపీ పార్టీ ఆఫీస్ లోనే బోండా కుటుంబానికి చెందిన ఐదు ఓట్లు ఉన్నాయన్నారు. బోండా ఉమా అభ్యర్ధిగా పోటీచేసేందుకు అనర్హుడని.. తమ దగ్గర అన్ని ఆధారాలున్నాయని తెలిపారు. బోండా పై చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. బోండా తన కుమారుడితో సంబంధం లేదని చెప్పి ఓటు ఇక్కడే చూపించారన్నారు. ఒక కుమారుడు ఇతర దేశంలో ఉంటారని చెప్పి.. ఓటు ఇక్కడే చూపించాడన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా బోండా తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపడ్డారు. బోండా ఉమా ఓటు రద్దుచేయించే వరకూ పోరాడుతానన్నారు. నేను పక్క నియోజకవర్గం నుంచి వచ్చానంటున్నాడు.. బోండా పక్క నియోజకవర్గం నుంచి రాలేదా అని ప్రశ్నించారు. బోండా ఉమా…అతని సతీమణి…ఇద్దరు కుమారులు..కోడలు ఓట్లు చెల్లవన్నారు. బీజేపీతో పొత్తులో ఉన్నామని అధికారులను బెదిరిస్తున్నారన్నారు. 2 కోట్ల54 లక్షల 97వేల రూపాయలు ఇన్ కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టారని ఆరోపించారు.
తాజావార్తలు
-
Karuppu Success Meet: ‘కరుప్పు 2’పై సూర్య బిగ్ హింట్..
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
RCB vs GT Qualifier 1: బెంగళూరు vs గుజరాత్ మెగా సమరం.. పిచ్, లైవ్ స్ట్రీమింగ్, హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!
-
Suriya 50: ‘కరుప్పు’ హిట్ జోష్లో సూర్య.. 50వ సినిమాకు భారీ ప్లాన్!
-
Ananya Panday: అనన్య పాండేపై నెటిజన్ల ఫైర్!
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?