Srinivas Goud : హైడ్రా బాధితులకు భరోసా.. భద్రత కల్పించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైడ్రా విషయంలో పేదలకు భరోసా, భద్రత ఇస్తే సమస్య ఉండదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైడ్రా పేదల విషయంలో పునరావాసం కల్పించాలని, కూల్చివేతలు తప్పు అనడం లేదన్నారు శ్రీనివాస్ గౌడ్. అందరి పట్ల హైడ్రా సమానంగా వ్యవహరించాలని, అధికారులు తొందర పడొద్దన్నారు. వచ్చేది మా ప్రభుత్వమని, ఏ ప్రభుత్వం భవనాలకు అనుమతి ఇచ్చిన తప్పే అని ఆయన అన్నారు. మాపై కోపం పేదలపై చూపొద్దని, పేదలకు భరోసా కల్పించాలన్నారు. ప్రజలు వ్యతిరేకం అయితే అనుకున్న ఆశయం లక్షలు ఎలా నెరవేరతాయని, అర్బన్ లో ఉండే చెరువుల్లో ఉండేది డ్రెయిన్ వాటర్ అని, నిజంగా చెరువుకు హాని కలిగితే కూల్చివేతలపై నిర్ణయాలు తీసుకోవాలన్నారు. చెరువులు ఏవిధంగా ఉపయోగపడుతున్నాయో కూడా ఆలోచించాలన్నారు శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ నగరంలో ఉన్న చెరువులు పంటకు తాగునీటికి వాడటం లేదని, అక్రమ నిర్మాణాలకు అన్ని ప్రభుత్వాలది బాధ్యత అని ఆయన అన్నారు. అధికారులు తొందర పడొద్దని, పరిహారం అదింకగా ఇచ్చయినా పేదలకు ఇల్లు కోల్పోతున్న వారికి సాయం చేయండన్నారు శ్రీనివాస్ గౌడ్.
అంతేకాకుండా..’గొడవలు లేకుండా 10 ఏళ్లుగా తెలంగాణ ను పరిపాలించాం. హైదరాబాద్ ను ఎవరు ఉహించనంతగా ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న 33 పార్టీలను ఒప్పించి అందరి సహకారం తో రాష్ట్రాన్ని సాధించాం. 10 ఏళ్ళు పూర్తయినా విభజన హామీలు అమలుకావడం లేదు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ఇచ్చిన హామీ నెరవేర్చాలి. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇంకెంత కాలం తెలంగాణ నలిగిపోవాలి. బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు జరగలేదు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పూర్తికాలేదు. బిబి నగర్ ఎయిమ్స్ నామమాత్రంగా ఉంది. అందరూ ఐక్యంగా ఒత్తిడి తెస్తేనే విభజన హామీలు అమలవుతాయి. ఖమ్మంలో 7 మండలాలు ఆంధ్రలో కలిపారు.. భద్రాచలం లో డంపింగ్ యార్డ్ పెట్టడానికి స్థలం లేదు. 7 గ్రామలిస్తే డంపింగ్ యార్డ్ పార్కింగ్ లాట్ పెట్టె అవకాశం ఉంటుంది. భద్రాచలం ఆలయం ఎలా అభివృద్ధి చెందుతుంది.. 7 మండలాలు,7 గ్రామాల వారు తెలంగాణ లో ఉంటామంటున్నారు..
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
Air India flight: ఆమ్లెట్లో బొద్దింక ప్రత్యక్షం.. ప్రయాణికుడికి అస్వస్థత
హిందూత్వం గురించి చెప్పుకునే బిజెపి 7 మండలాలను తెలంగాణ లోకలపాలి. షెడ్యూల్ 9,10 అంశాలు ఆస్తుల పంపకాలు పూర్తి చేయాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో రైతులకు రైతు బంధు ఎప్పుడు ఇస్తుంది. రుణమాఫీకాలేదు. రైతు బంధు తో రైతులకు ఆసరా ఉండేది. భారత దేశంలో అత్యధిక పంట పండించిన రాష్ట్రం తెలంగాణ. విభజన హామీల పై రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషించాలి. అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు తెచ్చి విభజన హామీలు అమలయ్యేలా చూడాలి. విభజన హామీలు అమలు,కాంగ్రెస్ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అమలయ్యేలా చూడాలి. రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలంటే విభజన హామీలు అమలు కావాలి. పార్లమెంట్ సభ్యులు విభజన హామీలపై దృష్టి పెట్టాలి. కేసీఆర్ కాలు బయటపెడితే ప్రళయం వస్తుంది. సమయం సందర్భం బట్టి కేసీఆర్ బయటకు వస్తారు. కేసీఆర్ ఖాళీగా లేరు.. కేసీఆర్ ఒక ప్రళయం.. కేసీఆర్ మౌనానికి ఒక అర్ధం ఉంటుంది.. ఇద్దరు ఎంపిలను గెలిపిస్తే రాష్ట్రాన్ని తెచ్చిన ఘనత కిసీఆర్ ది.. ఏపీకి ఎం కావాలంటే అది సాధించే స్థాయిలో చంద్రబాబు ఉన్నారు.. తెలంగాణ లో 9-10 స్థానాలు బీఆర్ఎస్ గెలిచి ఉంటే రాష్ట్రంలో పరిస్థితి మరోలా ఉండేది.. ప్రజలు మమ్మల్ని విశ్వసించలేదు ..మోసపోయారు.. గతంలో బీఆర్ఎస్ అధికారం లో ఉన్నపుడు రాష్ట్రానికి కావాల్సినవి సాధించాం. పార్లమెంట్ లో మాకు కొట్లాడే అవకాశం లేదు.. విభజన హామీల విషయంలో రాష్ట్ర పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలి’ అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
Relationship Tips: ఇలాంటి వాళ్లు చాలా డేంజర్.. అమ్మాయిలూ.. మీ లవర్లో ఈ లక్షణాలు ఉన్నాయా?
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!