Ravela Kishore Babu: వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా.. చంద్రబాబుపై ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravela Kishore Babu: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని ముఠగట్టుకుంది.. అయితే, ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున పని చేసిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు.. ఆ పార్టీకి గుడ్బై చెప్పారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. ఇక, పనిలో పనిగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు రావెల కిషోర్బాబు..
తాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు కట్టుబడి పనిచేసాను అన్నారు రావెల.. 2014లో నాకు చంద్రబాబు నాయుడు రాజకీయంగా అవకాశం ఇచ్చి ప్రోత్సహించారని గుర్తుచేసుకున్నారు.. 2014 ఏపీలో తొలి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసేందుకు అవకాశం కల్పించిన చంద్రబాబుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అయితే, వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారం తెస్తానన్న మాటలు నమ్మి తాను వైసీపీలో చేరాను అన్నారు. కానీ, ఈ ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు వైఎస్ జగన్ ని తిరస్కరించారని తెలిపారు.. ఈ రాష్ట్రం అభివృద్ది చెందాలంటే నారా చంద్రబాబు వల్లనే సాధ్యమవుతుందన్నారు. ఇక, తెలుగు దేశం, జనసేన, బీజేపీ కూటమికి ప్రజలు అఖండ విజయం ఇచ్చారని ప్రశంసించారు.
Also Read
- Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- 150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
మరోవైపు, మందా క్రిష్ణ మాదిగ నలబై ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఆ అంశం ముగింపు కు వచ్చిందని భావిస్తున్నాను అన్నారు రావెల… ప్రధాని నరేంద్ర మోడీ, చంద్రబాబు ఇద్దరూ వర్గీకరణకు మద్దత్తు తెలిపారు. అందుకే నేను వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని స్పష్టం చేశారు. నా ఉద్యమాన్ని సామాజిక సేవను ముందుకు తీసుకెళ్లానని ప్రకటించారు.. వర్గీకరణ అంశం నెరవేరే దాకా పనిచేస్తూ.. దానికి అనుకూలంగా ఉన్న పార్టీలో చేరే విషయాన్ని ఆలోచిస్తానని తెలిపారు మాజీ మంత్రి, వైసీపీ నేత రావెల కిషోర్బాబు.
కాగా, 2014 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన.. చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు.. అయితే, 2019 ఎన్నికల ముందు జనసేనలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన బీజేపీలో చేరారు.. ఆ తర్వాత ఆ పార్టీకి కూడా రాజీనామా చేసిన ఆయన.. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.. కొంత కాలం తర్వాత బీఆర్ఎస్కు బైబై చెప్పి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. ఇప్పుడు వైసీపీ గుడ్బై చెప్పేశారు రావెల కిషోర్బాబు.
తాజావార్తలు
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Protein Food : అమ్మ జ్ఞాపకం.. కేవలం 5 నిమిషాల్లో తయారయ్యే రుచికరమైన లావోటియన్ ‘ఎగ్ హాష్’!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
ట్రెండింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!