S Jaishankar: యూఏఈ చేరుకున్న విదేశాంగ మంత్రి..హిందూ ఆలయంలో పూజలు
- యూఏఈ అధ్యక్షుడు అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో సమావేశం
- ద్వైపాక్షిక సంబంధాలు.. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటు గాజాలో మొత్తం పరిస్థితిపై చర్చ
- అబుదాబిలో జరిగిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో విదేశాంగ మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) కి చేరుకున్నారు. యూఏఈ అధ్యక్షుడు అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలు, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటు గాజాలో మొత్తం పరిస్థితిపై చర్చిస్తారని భావిస్తున్నారు. నహ్యాన్తో సమావేశానికి ముందు, జైశంకర్ ప్రతిష్టాత్మకమైన BAPS హిందూ దేవాలయాన్ని సందర్శించారు. ఈ ఆలయాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 14న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఆలయ సందర్శన తర్వాత, జైశంకర్ అబుదాబిలోని బీఏపీఎస్ హిందూ దేవాలయాన్ని సందర్శించి ఆశీర్వాదం పొందినట్లు జైశంకర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. భారతదేశం-యూఏఈ స్నేహానికి కనిపించే ఈ చిహ్నం ఈ మందిరమని.. రెండు దేశాల మధ్య నిజమైన సాంస్కృతిక వారధని రాసుకొచ్చారు. జైశంకర్ యూఏఈ పర్యటన ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటు ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలను సమీక్షించేందుకు అవకాశం కల్పిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అంతకుముందు పేర్కొంది. ఆదివారం అబుదాబిలో జరిగిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు. యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్తో కలిసి లౌవ్రే అబుదాబిలో జరిగిన యోగా దినోత్సవ వేడుకలకు జైశంకర్ నాయకత్వం వహించారు. ఈ అంశాన్ని తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ ద్వారా తెలిపారు. యోగా ప్రత్యేకతను గురించి రాసుకొచ్చారు.
READ MORE: Arunachal Pradesh : అరుణాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్.. అస్సాంలో 1.17లక్షల మంది బాధితులు
Also Read
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
- Nepal Floods: నేపాల్లో భారీ వరదలు.. 16 మంది హైదరాబాద్ ఎన్ఆర్ఐలు గల్లంతు..!
- 50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
అనంతరం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం మాట్లాడుతూ.. 1985లో కనిష్క విమానంపై జరిగిన దాడి చరిత్రలో అత్యంత దారుణమైన ఉగ్రవాద చర్య అని అన్నారు. బాంబు పేలుడు ఘటన జరిగి 39 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కెనడియన్ నేల నుంచి ఖలిస్తాన్ మద్దతుదారుల కార్యకలాపాలు పెరుగుతున్న కారణంగా భారత్, కెనడా మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. జైశంకర్ ఇంటర్నెట్ మీడియా ప్లాట్ఫామ్ “ఎక్స్” వేదికగా.. “చరిత్రలో అత్యంత దారుణమైన ఉగ్రవాద చర్య జరిగి 39 సంవత్సరాలు అవుతోంది. ఉగ్రవాదాన్ని ఎప్పటికీ సహించబోమని ఈ ఘటన గుర్తు చేస్తోంది.” అని రాసుకొచ్చారు.”
తాజావార్తలు
-
Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
-
Range Rover Sport Twenty Edition: రేంజ్ రోవర్ స్పోర్ట్ ట్వంటీ లిమిటెడ్ ఎడిషన్ విడుదల.. 537HP పవర్, కొత్త ఆరెంజ్ కలర్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
ISI Spy Trap: పాక్ ISI స్పై ట్రాప్.. ‘నగ్న ఫొటోలు’ ఎరగా వేసి భారత రక్షణ అధికారులను టార్గెట్ చేస్తున్న పాక్ ISI?
-
Hrehaan Roshan: హృతిక్ రోషన్ కొడుకు సింగర్గా ఎంట్రీ.. తొలి పాటతోనే అదరగొట్టిన హృహాన్!
ట్రెండింగ్
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!