S Jaishankar: యూఏఈ చేరుకున్న విదేశాంగ మంత్రి..హిందూ ఆలయంలో పూజలు
- యూఏఈ అధ్యక్షుడు అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో సమావేశం
- ద్వైపాక్షిక సంబంధాలు.. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటు గాజాలో మొత్తం పరిస్థితిపై చర్చ
- అబుదాబిలో జరిగిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో విదేశాంగ మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) కి చేరుకున్నారు. యూఏఈ అధ్యక్షుడు అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలు, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటు గాజాలో మొత్తం పరిస్థితిపై చర్చిస్తారని భావిస్తున్నారు. నహ్యాన్తో సమావేశానికి ముందు, జైశంకర్ ప్రతిష్టాత్మకమైన BAPS హిందూ దేవాలయాన్ని సందర్శించారు. ఈ ఆలయాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 14న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఆలయ సందర్శన తర్వాత, జైశంకర్ అబుదాబిలోని బీఏపీఎస్ హిందూ దేవాలయాన్ని సందర్శించి ఆశీర్వాదం పొందినట్లు జైశంకర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. భారతదేశం-యూఏఈ స్నేహానికి కనిపించే ఈ చిహ్నం ఈ మందిరమని.. రెండు దేశాల మధ్య నిజమైన సాంస్కృతిక వారధని రాసుకొచ్చారు. జైశంకర్ యూఏఈ పర్యటన ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటు ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలను సమీక్షించేందుకు అవకాశం కల్పిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అంతకుముందు పేర్కొంది. ఆదివారం అబుదాబిలో జరిగిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు. యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్తో కలిసి లౌవ్రే అబుదాబిలో జరిగిన యోగా దినోత్సవ వేడుకలకు జైశంకర్ నాయకత్వం వహించారు. ఈ అంశాన్ని తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ ద్వారా తెలిపారు. యోగా ప్రత్యేకతను గురించి రాసుకొచ్చారు.
READ MORE: Arunachal Pradesh : అరుణాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్.. అస్సాంలో 1.17లక్షల మంది బాధితులు
Also Read
- Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
- Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
- Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
- Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
అనంతరం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం మాట్లాడుతూ.. 1985లో కనిష్క విమానంపై జరిగిన దాడి చరిత్రలో అత్యంత దారుణమైన ఉగ్రవాద చర్య అని అన్నారు. బాంబు పేలుడు ఘటన జరిగి 39 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కెనడియన్ నేల నుంచి ఖలిస్తాన్ మద్దతుదారుల కార్యకలాపాలు పెరుగుతున్న కారణంగా భారత్, కెనడా మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. జైశంకర్ ఇంటర్నెట్ మీడియా ప్లాట్ఫామ్ “ఎక్స్” వేదికగా.. “చరిత్రలో అత్యంత దారుణమైన ఉగ్రవాద చర్య జరిగి 39 సంవత్సరాలు అవుతోంది. ఉగ్రవాదాన్ని ఎప్పటికీ సహించబోమని ఈ ఘటన గుర్తు చేస్తోంది.” అని రాసుకొచ్చారు.”
తాజావార్తలు
-
Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
-
Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
-
Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
-
Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
-
North Korea: కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ? రెండు నెలలుగా కనిపించని ఉత్తర కొరియా అధినేత
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!