Bhadrachalam: భద్రాద్రి రాముడి అన్నదాన సత్రంలోకి వరద నీరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhadrachalam: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మరోసారి గోదావరి నదిలో వరద పోటెత్తుతోంది.. గత నెల 20వ తేదీ నుంచి గోదావరి దోబూచులాట ఆడుతోంది.. గోదావరిలో నీటిమట్టం భద్రాచలం వద్ద 44 అడుగులకు చేరుకుంది. దీంతో అప్పుడే భద్రాచలం రామాలయం చుట్టూ నీళ్లు చేరుతున్నాయి. స్లోయిస్ నుంచి నీళ్లు గోదావరిలోకి పోకపోవటంతో రామాలయం పడమర వైపు నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఇవన్నీ అన్నదాన సత్రంలోకి ప్రవేశించాయి. అదేవిధంగా పడమర వైపు ఉన్న దుకాణాలు కూడా నీళ్లు వచ్చి చేరుకున్నాయి. నిన్నటి నుంచి భద్రాచలం పట్టణంలో భారీగా వర్షం కురుస్తుంది.. ఆ వర్షపు నీళ్లని గోదావరి కరకట్ట పక్కనే ఉన్న దగ్గరికి చేరుకుంటున్నాయి.
అయితే గోదావరికి 44 అడుగులు చేరుకోవడంతో స్లోయిస్ లన్ని కూడా మూసుకుంటున్నాయి.. దీంతో స్లోయిస్ నుంచి గోదావరిలకి నీళ్లు పోయే దారి లేకపోవడంతో రామాలయం వరద నీరు పేరుకొని పోతుంది. ఇక, ఈ నీటిని మోటార్లతో గోదావరి నదిలోకి చేరవేయడం నిరంతర ప్రక్రియ.. కానీ, ఇక్కడ ఉన్న ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడం, అధికారులు నిర్లక్ష్యం వల్ల మోటార్లు పూర్తిస్థాయిలో పనిచేయకపోవడంతో వరద నీరంతా సత్రం వద్ద పేరుకుని పోయింది. ఇలా వరద నీరు పేర్కొనటంతో అన్నదాన సత్రంలోకి నీళ్లు రావడంతో ఆ సత్రాన్ని మూసివేయాల్సి వచ్చింది. అదేవిధంగా దుకాణ సముదాయంలోకి నీళ్లు రావడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఇక, అశ్వాపురం మండలంలో పొంగి ప్రవహిస్తున్నాయి లోతు వాగు, ఇసుక వాగు.. దీంతో.. గిరిజన గ్రామాలకు రాకపోకలకు బంద్ అయ్యాయి. మరోవైపు.. కిన్నెరసాని ప్రాజెక్ట్కు వరద పోటెత్తింది.. దీంతో 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.. డ్యాం పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 402.80 అడుగులుగా ఉంది.. ఇన్ ఫ్లో 25,000 క్యూసెక్కులుగా ఉంటే.. 4 గేట్ల ద్వారా 25,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.. కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!