భారీ వర్షాలు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వరదతో తెలుగు రాష్ట్రాల్లో రిజర్వాయర్లు అన్నీ నిండుకుండలా మారాయి. తాజాగా గోదావరికి ప్రవాహం భారీగా పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి 43 అడుగులకు చేరింది … మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. జిల్లా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేశారు కలెక్టర్ అనుదీప్. ఇటు కృష్ణా పరివాహక ప్రాంతంలోనూ వరద ప్రవాహం పెరగడంతో అధికారులు లోతట్టుప్రాంతాల వారిని ఖాళీచేయిస్తున్నారు.