Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Jayashankar Bhupalpally Flood Effect At Morancha Vagu

Rain Effect : ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న మోరంచపల్లి

Published Date :July 29, 2023 , 7:29 pm
By Gogikar Sai Krishna
Rain Effect : ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న మోరంచపల్లి
  • Follow Us :
  • google news
  • dailyhunt

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామంలో మోరంచవాగు పొంగడంతో ఆ ఊరు మొత్తం వరదలో మునిగిపోయింది. వరద గుప్పిట్లో భయంతో బతికిన మోరంచ పల్లి గ్రామం ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. బురదమయమైనటువంటి ఇళ్లలో శుభ్రం చేసుకుంటున్నారు. వండుకునే స్థితి లేకపోవడంతో బంధువులు తీసుకొచ్చిన భోజనం తినడము లేక అధికారులు ఏర్పాటు చేసిన భోజనం తినే స్థితిలోనే ఇంకా మొరంచపల్లి ఉంది. నలుగురు గల్లంతయితే ఇద్దరి మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మరో ఇద్దరి మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Also Read : Bhola shankar : మెగాస్టార్ క్రేజ్ మాములుగా లేదుగా.. ఏకంగా భారీ కటౌట్ ఏర్పాటు..

మూరంచవాగు పొంగి పొరడం వల్ల మోరంచవాగు అనుకొని ఉన్న మోరంచ పల్లి గ్రామం మొత్తం అతలాకుతలమైంది. మొత్తం 285 ఇళ్లు ఉన్న గ్రామంలో నాలుగు పూర్తిగా ధ్వంసమయ్యాయి.. మిగతావి పాక్షికంగా దెబ్బతిన్నాయి.. ఏ ఇంట్లో చూసినా పేరుకుపోయిన ఒండ్రుమట్టి.. చెల్లాచెదురుగా ఉన్న సామగ్రి.. బైక్‌లు, ఇతర వాహనాలు ఎక్కడున్నాయో తెలియదు.. తినటానికి తిండి లేదు.. తాగేందుకు నీరు లేదు.. కోళ్లు, పశువులు కొట్టుకుపోయాయి.. సర్వం కోల్పోయిన స్థితిలో జయశంకర్‌ జిల్లా మొరంచపల్లి గ్రామం బోరుమంటోంది.

మోరంచ వాగు పొంగి వరద గుప్పిట్లో ఉన్న మొరంచపల్లి గ్రామం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. తెల్లవారుజామున ఒక్కసారిగా వచ్చిన వరద ఉధృతితో భయం గుప్పిట బతికిన మొరంచపల్లివాసులు ఆ విషాద ఘటన నుంచి ఇప్పుడిప్పుడే తెరుకుంటున్నారు.. వరద బీభత్సం జరిగి 48 గంటలైనా ఇంకా ఆ షాక్ నుంచి కొందరు కోలుకోలేదు మరికొందరు మాత్రం ఇప్పుడిప్పుడే తెరుకుంటున్నారు .. బరుదమయం అయిన ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు సర్వం కోల్పోయిన గ్రామస్తులందరూ సాధారణ జీవన సాగించేందుకు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు

మరోవైపు గల్లంతైన నలుగురిలో ఇద్దరు మృతదేహాలు దొరికాయి.. మొరంచ వాగు వరదలో మొన్న కొట్టుకపోయిన వారిలో గొర్రె ఓదిరెడ్డి,గొంగిడి సరోజనమ్మ మృతదేహలు లభ్యమయ్యాయి. చిట్యాల మండలంలోని పాచిగడ్డ తండా శివారు పొలాలలో ఓదిరెడ్డి మృతదేహం,సోలిపేట తాళ్ల వద్ద పంట పొలాలలో సరోజనమ్మ మృదేహలను స్థానికుల సమాచారంతో గుర్తించారు. మరోవైపు పోలీసులు వరదలో గల్లంతైన వారికోసం గాలింపు ముమ్మరం చేశారు.బృందాలుగా విడిపోయి వాగు పరిసర ప్రాంతాలలో వెతుకుతున్నారు.

మోరంచవాగు దిగువ ప్రాంతాలలో డ్రోన్ కెమెరాల సహాయంతో జల్లెడ పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలలోని గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు,రైతులు, యువకులు,మత్స్యకారులు తమ తమ ప్రాంతాలలో పరిశీలించి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. మోరంచ పల్లి గ్రామం వద్ద ఎన్జీవోల తాకిడి వివిధ సంస్థలకు చెందిన వారు చీరలు తినేందుకు అన్నం ప్యాకెట్లు మంచినీళ్ల క్యాన్లు ఇస్తారా సరుకులు పంపిణీ చేసారు.

సిరికొండ ప్రశాంత్ నిత్యావసర సరుకులు పంపిణీ చేయగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీన్మార్ మల్లన్న టీం బీజేపీ చందుపట్ల కీర్తి రెడ్డి తదితరులు గ్రామాన్ని సందర్శించారు.. ఆహారప్రదార్థాలు అందిస్తున్నారు. పారిశుద్ధ్య పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. వరద ప్రభావంతో ఊర్లో పేరుకుపోయిన చెత్తాచెదారం తో పాటు బురదను తొలగిస్తున్నారు. పారిశుద్ధ్య పనులను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి,కలెక్టర్ భవేశ్ మిశ్రా లు పరిశీలించారు. దగ్గరుండి సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడు తగు సలహాలు సూచనలు చేస్తూ పర్యవేక్షిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big news
  • breaking news
  • flood effect
  • latest news
  • Telangana Floods

తాజావార్తలు

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • TheRajaSaab Premieres: రాజాసాబ్ గందరగోళం బయటపెట్టిన మైత్రీ శశి

  • Aditya Dhar: ధురంధర్ 3 కాదు.. డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఇదే!

  • RK Roja: కుటుంబ సమేతంగా ఉగాది వేడుకలు ఎందుకు జరుపుకోలేదు..? గాడిదలు కాస్తున్నారా? రోజా ఫైర్‌..

  • Lexus ES 500e: లెక్సస్ ES 500e లాంచ్.. 580KM రేంజ్, 10 ఎయిర్‌బ్యాగ్స్.. భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ లగ్జరీ కొత్త ఎరా

ట్రెండింగ్‌

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • Gym Tips : జిమ్ మధ్యలో మానేస్తే మీ బాడీకి ఇదే జరుగుతుంది.! ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.!

  • Butter Curd Rice : హెల్తీ, రుచికరమైన బటర్ కర్డ్ రైస్.. ఇలా సింపుల్ గా తయారు చేసుకోండి..!

  • IPL 2026 Injury List: గాయాల దెబ్బ, స్టార్ ప్లేయర్స్ ఔట్.. ఐపీఎల్ జట్లకు భారీ షాక్!

  • Summer Super Drinks : బాదం షర్బత్ ట్రై చేశారా..? ఎండలో కూల్‌గా ఉండే సూపర్ డ్రింక్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions