Hyderabad: పల్సర్ బైక్పై ఐదుగురు యువకుల నిర్లక్ష్య ప్రయాణం.. ఇన్ స్టాలో వైరల్.. చివరకు
- పల్సర్ బైక్పై ఐదుగురు యువకుల నిర్లక్ష్య ప్రయాణం
- ఐదుగురు యువకులను సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు
- BNS సెక్షన్ 281, 125తో పాటు మోటార్ వాహన చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరిలో మార్పు రావడం లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. తాజాగా ఓ ఐదుగురు యువకులు పల్సర్ బైక్ పై నిర్లక్ష్యంగా ప్రయాణించారు. అటుగా వెళ్తున్న ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఐదుగురు యువకులను సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సైఫాబాద్ సిఐ ఎ. సీతయ్య తెలిపారు.
Also Read:US-Iran War: మీది 250 ఏళ్ల దేశం, మాది 6000 ఏళ్ల నాగరికత.. హాలీవుడ్ భ్రమల్లో ట్రంప్..
Also Read
- Electric Vehicle: EV యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్..
- SRH: టాప్ 4లో ఏ ఒక్క టీం సేఫ్ కాదు.. సన్ రైజర్స్ ప్లే ఆఫ్ చేరడం ఖాయమన్న మాజీ క్రికెటర్..
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు, ఒక్క రోజులోనే తొలగింపు.. విమర్శలకు తలొగ్గిన సీఎం విజయ్..
గత నెల మార్చి 29 అర్ధరాత్రి సుమారు 1 గంట సమయంలో తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ జంక్షన్ నుంచి సెక్రటేరియట్ వైపు వెళ్తున్న పల్సర్ బైక్పై ఐదుగురు యువకులు అత్యంత నిర్లక్ష్యంగా ప్రయాణించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇన్స్టాగ్రామ్ లో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో వడ్డీ అర్జున్ (22) బైక్ నడుపుతున్నట్లు గుర్తించారు. అతనితో పాటు అరుపు రోహిత్ (19), చింతకుంట అంజ కుమార్ (19), సిద్ధం కౌశిక్ (18), వల్లపు మురళి (18) ఒకే బైక్పై ప్రయాణించినట్లు తేలింది.
Also Read:US-Iran War: మీది 250 ఏళ్ల దేశం, మాది 6000 ఏళ్ల నాగరికత.. హాలీవుడ్ భ్రమల్లో ట్రంప్..
హెల్మెట్ ధరించకుండా, బైక్ సామర్థ్యానికి మించి ఐదుగురు ప్రయాణించడం వల్ల తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు కలిగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై BNS సెక్షన్ 281, 125తో పాటు మోటార్ వాహన చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సిఐ ఎ. సీతయ్య వెల్లడించారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. యువత సరదా కోసం ప్రాణాలను ప్రమాదంలో పెట్టవద్దని, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని పోలీసులు సూచించారు.
తాజావార్తలు
-
SuperShe Island: పురుషులు లేని ప్రపంచం.. మహిళలకు మాత్రమే ఎంట్రీ! సూపర్ షీ ఐలాండ్ విశేషాలు ఇవే..
-
Electric Vehicle: EV యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్..
-
SRH: టాప్ 4లో ఏ ఒక్క టీం సేఫ్ కాదు.. సన్ రైజర్స్ ప్లే ఆఫ్ చేరడం ఖాయమన్న మాజీ క్రికెటర్..
-
Tollywood: ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కలకలం..జాయింట్ సెక్రటరీ పదవికి నట్టి కుమార్ రాజీనామా!
-
IPL 2026 Tickets Scam: ఫ్రీ ఐపీఎల్ టికెట్లు అంటూ భారీ మోసం.. 600కు పైగా ఫేక్ వెబ్సైట్లు గుర్తింపు, తస్మాత్ జాగ్రత్త!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!