TSPSC : వార్డు ఆఫీసర్లను నియమించనున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గ్రూప్ IV నోటిఫికేషన్ను జారీ చేయడంతో, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ విభాగం రాష్ట్రంలోని మొత్తం 141 మునిసిపాలిటీలలో వార్డు ఆఫీసర్లను నియమించడానికి సన్నద్ధమవుతోంది. దేశంలోనే మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లను నియమించనున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ అవతరించనుంది. తెలంగాణ మినిస్టీరియల్ సర్వీసెస్లో వార్డు స్థాయిలో వివిధ పాత్రలు, బాధ్యతలతో వార్డ్ ఆఫీసర్ పోస్ట్ కొత్తగా చేర్చబడింది. పట్టణ స్థానిక సంస్థల (ULBలు)లో హరితహారం, పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, సామాజిక భద్రతా పథకాలు మరియు ఇతర మున్సిపల్ సేవలను మెరుగైన పర్యవేక్షణ, సమర్థవంతంగా అమలు చేయడంలో వార్డు అధికారుల నియామకం సహాయపడుతుందని భావిస్తుస్తోంది అధికార యంత్రాంగం.
Also Read : Mass Killings: సామూహిక హత్యలు జరిగే దేశాల జాబితాలో పాకిస్థాన్దే అగ్రస్థానం!
ఇంటి పన్ను, ఇతర పన్నుల సేకరణ, రుసుములు, ఛార్జీలు, మదింపు చేయని, తక్కువ అంచనా వేయబడిన ఆస్తుల నెలవారీ జాబితాను తయారు చేయడం కూడా వారికి అప్పగించబడుతుంది. అలాగే, గ్రామీణ సంస్థలలో పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులు స్థానిక కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్ల సమన్వయంతో వివిధ అభివృద్ధి పనులను పర్యవేక్షి అమలు చేస్తారు. 50 వేల జనాభా దాటిన వార్డుకు ఒక వార్డు అధికారిని, 50 వేల లోపు జనాభా ఉన్న రెండు వార్డులకు ఒక అధికారిని నియమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మేరకు 2,242 మంది వార్డు అధికారులను నియమించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
Also Read : Ex-Boyfriend Hacked Young Woman : కొచ్చిలో యువతిపై కత్తితో దాడి చేసిన మాజీ ప్రియుడు
Also Read
9168 గ్రూప్ IV ఖాళీల భర్తీకి ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు కృతజ్ఞతలు తెలుపుతూ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇలా ట్వీట్ చేశారు. “TSPSC ద్వారా గ్రూప్-4 నోటిఫికేషన్ జారీ చేయబడింది. ఒక మార్గదర్శక చొరవలో, తెలంగాణ ప్రభుత్వం మొత్తం 141 మున్సిపాలిటీలలో వార్డు అధికారులను నియమిస్తుంది అని మంత్రి కేటీఆర్ ఓ ట్విట్ లో తెలిపారు.
ఇది పౌర సమస్యలపై హైపర్ లోకల్ ఫోకస్ని తెస్తుంది మరియు వార్డు కౌన్సిలర్లతో సమన్వయం చేసుకోవడానికి సహాయపడుతుంద మంత్రి కేటీఆర్ ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూలైలో జిఓ ఎంఎస్ నెం.109 జారీ చేసి 2,242 వార్డు ఆఫీసర్ పోస్టులను మంజూరు చేసింది. 2,242 పోస్టుల్లో 380 పోస్టులను యూఎల్బీల్లో వీఆర్వోల ద్వారా భర్తీ చేశారు. ఇప్పుడు, TSPSC 9,168 గ్రూప్ IV ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడంతో, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ విభాగం మిగిలిన 1,862 వార్డు ఆఫీసర్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడానికి ప్రతిపాదిస్తోంది.
తాజావార్తలు
-
Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
-
Rahul Dravid: “హీరోలు లేకుండా క్రీడ ఉండదు”.. గంభీర్ వ్యాఖ్యలకు ద్రావిడ్ కౌంటర్..
-
Tandoori Roti Recipe: తందూర్ లేకుండానే ధాబా స్టైల్ తందూరీ రోటీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసే చిట్కా!
-
Sing Geetham: సింగీతం – నాగ్ అశ్విన్ కాంబో మూవీపై భారీ క్యూరియాసిటీ
-
DRAGON : ఎన్టీఆర్ – నీల్ టాలీవుడ్ చరిత్రలో ఫస్ట్ టైమ్.. 4 నిమిషాల 35 సెకన్ల ఊచకోత
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..