Shocking : ఇదేందయ్యా ఇది.. ఎద్దు మూత్రం పోసినందుకు వంద రూపాయలు ఫైన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన ఎద్దు మూత్రం పోసినందుకు వంద రూపాయలు ఫైన్ చెల్లించిన వింత అనుభవం ఓ నిరుపేద రైతుకు ఎదురయింది. ఈ సంఘటన ఇల్లందు పట్టణంలో చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని నెంబర్ టు బస్తీలో నివసించే సుందర్ లాల్ స్థానికంగా ఉంటూ ఎద్దుల బండిలో బాడుగలు తోలుకుంటూ జీవనం కొనసాగిస్తుంటాడు. ఎద్దుల బండితో పరిసర ప్రాంతాల్లోని మట్టి ఇసుక తోలుకుంటూ నాలుగు పైసలు సంపాదిస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాల నుండి ఇదే వృత్తిగా భావిస్తూ ఎద్దుల పోషణ చూసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో స్థానిక సింగరేణి జీఎం కార్యాలయం ముందు నుండి మట్టి తీసుకొని వచ్చేందుకు వెళుతున్న క్రమంలో జీఎం కార్యాలయం ముందు ఎద్దు ఆగి మూత్రం పోసిందని జీఎం కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read : Bomb Blast: పశ్చిమ బెంగాల్లో ఘోరం.. టీఎంసీ నేత ఇంట్లో బాంబు పేలుడు
పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో కంగుతున్న సుందర్ లాల్ ఆశ్చర్యానికి గురయ్యాడు. బాడుగలు తోలుకొని జీవించే ఎద్దుల బండిని పోషించే కష్టమవుతున్న తరుణంలో ఎద్దు మూత్రం పోసినందుకు ఫైన్ కట్టడం ఏంటని సుందర్లాల్, బాధపడుతూ స్థానిక ఇల్లందు మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టులో 100 రూపాయలు ఫైన్ చెల్లించి రసీదు తీసుకున్నాడు. సింగరేణి అధికారులు కేసు పెట్టి ఆందోళన గురి చేశారని సుందర్ లాల్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా తన 40 ఎకరాల భూమిని సింగరేణి ఓసి కింద కోల్పోయానని తనకు నష్టపరిహారం చెల్లించాలని ఆందోళన చేస్తున్నాడు.
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
- Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
- Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
- Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
ఇటీవల ముఖ్యమంత్రిని కలవడానికి ఇల్లందు నుండే హైదరాబాదుకు పాదయాత్ర నిర్వహించాడు. పోలీసులు అడ్డుకోవడంతో కలవలేకపోయాడు. తన కొడుకు టూ వీలర్ మీద ఢిల్లీ వరకు వెళ్లి ప్రధానమంత్రిని కలిసి వచ్చాడు. అయినా సుందర్లాల్కు నష్టపరిహారం సింగరేణి యజమానం ఇవ్వడం లేదు. వాళ్ళ కుటుంబంలో ఆ భూమికి సంబంధించిన నష్ట పరిహారం చెల్లించామని చెప్తుంది సింగరేణి యాజమాన్యం. చెల్లించలేదని సుందర్లాల్ ఆందోళన కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సుందర్లాల్పై ఎద్దు మూత్రం పోసినందుకు కేసు పెట్టి ఫైన్ విధించడం చర్చనీయాంశమైంది.
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
-
Drishyam 4: జార్జ్కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
-
Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
-
Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!