Jangaon District: ఆస్తి కోసం ఇద్దరు కుమారులను లేపేయడానికి తండ్రి మాస్టర్ ప్లాన్.. కట్చేస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jangaon: సాధారణంగా ఆస్తి కోసం తల్లిదండ్రులు కుమారులు చంపేసే ఘటనలు ఎన్నో చూసి ఉంటాం. కానీ.. ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఆస్తి కోసం ఓ తండ్రి కన్న కొడుకులను లేపేయడానికి మాస్టార్ ప్లాన్ చేశాడు. ఈ ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. కన్న కొడుకులకు బిస్కట్లో విషం ఇచ్చి చంపాలని సుపారీ ఇచ్చాడు తండ్రి. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం పొట్టి గుబ్బడి తండాలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. 2016 సంవత్సరంలో బానోతు శ్రీనివాస్ అనే వ్యక్తి అనితను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. కుటుంబ కలహాల నేపథ్యంలో వేరే గ్రామానికి చెందిన మూడవత్ మమతను రెండోవ వివాహం చేసుకున్నాడు శ్రీనివాస్. కుమారుల పేరిట 20 గుంటల భూమి ఉంది. ఈ భూమిని ఎలాగైన కాజేయాలని ప్లాన్ చేశాడు. పిల్లలు తినే బిస్కట్లో విషం పెట్టి చంపాలని రెండవ భార్యతో కలిసి పన్నాగం పన్నాడు. ఈ సుపారీని అదే గ్రామానికి చెందిన మరొక వ్యక్తికి అప్పగించాడు కిరాతక తండ్రి. ఈ విషయం కాస్త బయటకు వచ్చింది. పిల్లలు భయంతో గ్రామంలో ప్రజలకు సమాచారం ఇవ్వడంతో ఈ తతంగం బయట పడింది. ఇక గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
READ MORE: TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ కేసులో కొత్త కోణం.. ఇది కూడా ఉందా..?
Also Read
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
Warren Buffett: ‘అమ్మా.. నీ కోపమే నన్ను ప్రపంచ విజేతను చేసింది’.. వారెన్ బఫెట్
-
S Keerthana: 29 ఏళ్లకే మంత్రి.. 5 భాషల్లో ప్రావీణ్యం.. విజయ్ కేబినెట్లో స్పెషల్గా కీర్తన..
-
LSG vs CSK : లక్నో భారీ స్కోరు.. ఇంగ్లిస్ శివతాండవం.. షాబాజ్ మెరుపు ముగింపు.!
-
Tamil Nadu Election Twist: తమిళ రాజకీయాల్లో మళ్లీ ట్విస్ట్.. మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కిన మాజీ మంత్రి!
-
PM Modi Telangana Visit: తెలంగాణపై మోడీ వరాల జల్లు.. రూ.9,377 కోట్లతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం