Jangaon: సాధారణంగా ఆస్తి కోసం తల్లిదండ్రులు కుమారులు చంపేసే ఘటనలు ఎన్నో చూసి ఉంటాం. కానీ.. ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఆస్తి కోసం ఓ తండ్రి కన్న కొడుకులను లేపేయడానికి మాస్టార్ ప్లాన్ చేశాడు. ఈ ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. కన్న కొడుకులకు బిస్కట్లో విషం ఇచ్చి చంపాలని సుపారీ ఇచ్చాడు తండ్రి. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం పొట్టి గుబ్బడి తండాలో ఈ ఘటన జరిగింది.