తల్లిదండ్రులు తమ పిల్లలు ఎదిగాక వారికి పెళ్లిళ్లు చేసి ఓ ఇంటి వాళ్లను చేయాలని భావిస్తుంటారు. తమ బాధ్యతగా కొడుకులు, కూతుర్లకు వివాహాలు జరిపిస్తుంటారు. ఇదే విధంగా ఓ తండ్రి తన కుమారుడి పెళ్లిని ఘనంగా చేయాలనుకున్నాడు. తగిన వధువును చూసి పెళ్లి జరిపించాలని కలలు కన్నాడు. కానీ, అతని కల కలగానే మిగిలిపోయింది. మరో రెండు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా వధువు ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో కుమారుడి పెళ్లి ఆగిపోయింది. అవమాన భారంగా భావించిన తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన నారాయణ పేట జిల్లాలో చోటుచేసుకుంది.
Also Read:Spirit : స్పిరిట్ షూటింగ్ ఎప్పుడో క్లారిటీ ఇచ్చిన నిర్మాత భూషణ్ కుమార్
గోవిందరావు ( 54) తన కొడుకు అభిషేక్ కు బంధువుల అమ్మాయి శ్వేతతో పెళ్లి కుదుర్చుకున్నారు. ఇటీవల హంగు ఆర్భాటాలతో నిశ్చితార్థం జరిపించారు. ఇరు కుటుంబాలు ఎంతో సంతోషించాయి. పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఈ నెల 9న వివాహం జరాగాల్సి ఉంది. మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులకు పెళ్లి పత్రికలు పంచాడు గోవిందరావు. పెళ్లి పనులన్నీ పూర్తయ్యాయి. ఇక జరగాల్సింది వివాహమే. ఇంతలోనే వధువు శ్వేత ఊహించని షాకిచ్చింది.
Also Read:Vikram Misri: పాక్ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది
ఈ పెళ్లి ఇష్టం లేని శ్వేత తన ప్రియుడితో వెళ్లిపోయింది. శ్వేత చేసిన ఈ పనికి ఇరు కుటుంబాల్లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. తమ కుటుంబం పరువు పోయిందని భావించిన వరుడు తండ్రి గోవింద రావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గోవింద రావు మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పెళ్లి డప్పులు మోగాల్సిన ఇంట్లో చావు డప్పులు మోగడంతో ప్రతి ఒక్కరిని కలిచివేసింది.