Farzi : మోస్ట్ వాంటెడ్ వెబ్ సిరీస్ గా నిలిచిన ఫర్జి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటీటీ అందుబాటులోకి రావడంతో ప్రేక్షకులు వెబ్ సిరీస్ లను ఎంతగానో ఇష్టపడుతున్నారు… సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ లు ఇండియాలో అడుగుపెట్టి పదేళ్లు కూడా కాలేదు.ఇంగ్లిష్ వెబ్ సిరీస్ లు ఎన్నో దశాబ్దాలుగా వస్తున్నా కానీ హిందీ, తెలుగుతోపాటు ఇతర భారతీయ భాషల్లో ఇవి రావడం కొన్నేళ్ల కిందటే మొదలైంది.అయితే ఇండియన్ ప్రేక్షకులు చాలా త్వరగానే ఈ వెబ్ సిరీస్ లకు అలవాటు పడ్డారు. వాటిని ఎంతగానో ఆదరించారు. మరి ఈ దశాబ్ద కాలంలో రిలీజైన వెబ్ సిరీస్ లలో ఇండియాలో ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఏదనేది ఆర్మాక్స్ మీడియా సమాధానమిచ్చింది. ఈ సంస్థ రిపోర్టు ప్రకారం ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఫర్జీ..ఫర్జీ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల అయింది… బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి మరియు రాశీ ఖన్నా వంటి స్టార్స్ నటించిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఈ వెబ్ సిరీస్ ను ఇప్పటి వరకూ ఏకంగా 3.71 కోట్ల మంది చూసినట్లు ఆర్మాక్స్ మీడియా రిపోర్టు వెల్లడించింది.
గతేడాది జనవరి నుంచి వెబ్ సిరీస్ డేటాను ఈ సంస్థ విశ్లేషిస్తోంది. ఫర్జీ వెబ్ సిరీస్ తర్వాత రెండవ స్థానం లో డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో వచ్చిన రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్ నిలిచింది.. ఈ సిరీస్ ను ఇప్పటి వరకూ 3.52 కోట్ల మంది చూశారు. మూడో స్థానంలో హాట్స్టార్ లోనే వచ్చిన ది నైట్ మేనేజర్ ఉంది. ఈ సిరీస్ ఇప్పటి వరకూ 2.86 కోట్ల వ్యూస్ సంపాదించిందిఫర్జీ వెబ్ సిరీస్ దొంగ నోట్ల చుట్టూ తిరిగే కథ. ప్రముఖ తెలుగు డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 8 ఎపిసోడ్ల గా తెరకెక్కిన ఈ సిరీస్ ప్రేక్షకులను బాగా మెప్పించింది.. ఓ ఆర్టిస్ట్ డబ్బులు సంపాదించడానికి తన కళనే ఉపయోగించి దొంగ నోట్ల బిజినెస్ లోకి ఎలా వస్తాడు అనేది ఈ ఫర్జీ స్టోరీ. ఈ వెబ్ సిరీస్ కు ఐఎండీబీ ఏకంగా 8.4 రేటింగ్ ను ఇచ్చింది.
Also Read
- Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
తాజావార్తలు
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..