Farmers Protest: రైతుల ఆందోళన.. ఢిల్లీలో మార్చి 12 వరకు 144 సెక్షన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
144 Section in Delhi ahead of Farmers Protest: తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం ‘ఢిల్లీ చలో’ పేరుతో రైతులు ఆందోళన చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. రైతుల మెగా మార్చ్ నేపథ్యంలో ఢిల్లీలో నెల రోజుల పాటు (మార్చి 12 వరకు) 144 సెక్షన్ విధిస్తూ సోమవారం ఢిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అశాంతి మరియు భద్రతా సమస్యల ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఢిల్లీ సరిహద్దులు సింగు, ఘాజీపూర్, టిక్రి వద్ద భద్రతా చర్యలు మరియు ట్రాఫిక్ ఆంక్షలు తీవ్రమయ్యాయి. 5,000 కంటే ఎక్కువ మంది భద్రతా సిబ్బందిని మోహరించారు.
ఢిల్లీ నగరంలో రైతుల ట్రాక్టర్ల ప్రవేశానికి అనుమతి ఉండదని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. తుపాకులు, మండే స్వభావం ఉన్న పదార్థాలు, ఇటుకలు, రాళ్లు, పెట్రోల్, సోడా బాటిళ్ల వంటి వాటిని వెంట తీసుకురావడాన్ని కూడా నిషేధించారు. లౌడ్ స్పీకర్ల వాడకంపై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ భద్రతా చర్యల అమలు ఇప్పటికే సరిహద్దు ప్రాంతాలలో ట్రాఫిక్ను ప్రభావితం చేసింది. సోమవారం ఉదయం ప్రయాణికులకు తీవ్ర ఆటంకం కలిగింది. దేశ రాజధానిలోకి రైతులు రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు.
Also Read
Also Read: AUS vs WI: అంతర్జాతీయ క్రికెట్లో విచిత్రకర సంఘటన.. అప్పీల్ చేయలేదని..! వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్ర రైతు సంఘాలు మంగళవారం ‘మెగా మార్చ్’ నిర్వహించనున్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు తమ ఇతర డిమాండ్లు పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు దాదాపు 200కు పైగా రైతు సంఘాలు మంగళవారం ‘ఢిల్లీ చలో’ మార్చ్ నిర్వహించతలపెట్టాయి. 2021లో రైతులు తమ ఆందోళనను విరమించుకున్నప్పుడు పెట్టిన షరతుల్లో ఈ డిమాండ్ ఒకటి.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!