Ketu Viswanatha Reddy is no more: ప్రముఖ కవి, కేతు విశ్వనాథ్ రెడ్డి కన్నుమూత.. సీఎం సంతాపం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ketu Viswanatha Reddy is no more: ప్రముఖకవి, రచయిత, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత ఆచార్య కేతు విశ్వనాథ్ రెడ్డి ఈ రోజు ఉదయం కన్నుమూశారు.. ఆయన వయస్సు 88 ఏళ్లు.. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సంఘమిత్ర హాస్పిట్లో చికిత్స పొందుతూ ఉదయం 5 గంటల సమయంలో కార్డియాక్ అరెస్టుతో ప్రాణాలు విడిచారు విశ్వనాథ్ రెడ్డి.. రచయితలు, సాహితీవేత్తలు, కవుల సందర్శనార్థం ఈరోజు ఆయన భౌతికకాయాన్ని ఉంచనున్నారు.. అమెరికాలో ఉన్న తన కుమారుడు ఈ రోజు ఒంగోలుకు చేరుకొని తండ్రి పార్థీవ దేహాన్ని కడపకు తీసుకెళ్తారని తెలుస్తోంది.. ఆయన అంత్యక్రియలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.. కాగా, విశ్వనాథ్ రెడ్డి 2 రోజుల క్రితం ఒంగోలులోని తన కుమార్తె ఇంటికి వెళ్లారు.. అక్కడ అస్వస్థతకు గురికాగా.. వెంటనే కుటుంబసభ్యులు ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఇక, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు విశ్వనాథ్ రెడ్డి..
మరోవైపు.. ప్రముఖ కథా రచయిత కేతు విశ్వనాథ్ రెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. ఆధునిక తెలుగు సాహితీ రంగానికి విశ్వనాథ్ రెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్న ఆయన.. సామాజిక సంస్కరణలను అవశ్యకతను చెబుతూ విశ్వనాథ్ రెడ్డి రాసిన కథలు పలువురికి స్ఫూర్తిగా నిలిచాయన్నారు.. ఆయన సేవలను గుర్తించి 2021లో వైయస్సార్ లైఫ్టైం అచీవ్మెంట్ అవార్డుతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని సత్కరించిందనే విషయాన్ని గుర్తుచేసుకున్న సీఎం వైఎస్ జగన్.. విశ్వనాథ్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
కాగా, విశ్వనాథ్ రెడ్డికి ఆయన రచనలు ఎన్నో అవార్డులు, రివార్డులు తెచ్చిపెట్టాయి.. కడప జిల్లా గ్రామనామాలు అనే అంశంపై ఆయన చేసిన పరిశోధనకుగాను డాక్టరేట్ పొందారు. పాత్రికేయుడుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి కడప, తిరుపతి, హైదరాబాద్ లాంటి చోట్ల అధ్యాపకుడుగా పనిచేసి ఆయన.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డైరెక్టర్గా పదవీ విరమణ చేశారు. ఇక, విశ్వనాథ్ రెడ్డి తొలి కథ అనాదివాళ్ళు 1963లో సవ్యసాచిలో ప్రచురితమైంది. కొడవటిగంటి కుటుంబరావు సాహిత్య సంకలనాలకు సంపాదకత్వం వహించారు. విశాలాంధ్ర తెలుగు కథ సంపాదక మండలికి అధ్యక్షుడుగా ఉన్నారు. ఆయన కథలు.. హిందీ, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, ఆంగ్లం, రష్యన్ భాషల్లోకి అనువదించడబ్బాయి.. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు (న్యూ ఢిల్లీ), భారతీయ భాషా పరిషత్తు (కలకత్తా), తెలుగు విశ్వవిద్యాలయం (హైదరాబాద్), రావిశాస్త్రి అవార్డు, రితంబరీ అవార్డు.. సహా ఎన్నో అవార్డులను అందుకున్నారు కేతు విశ్వనాథ్ రెడ్డి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!