Fake Doctorate Scam: డాక్టరేట్ కావాలా..? పదో తరగతి ఫెయిల్ ఐనా పర్వాలేదు.. డబ్బులిస్తే చాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Doctorate Scam: డాక్టరేట్ కావాలా..? పదో తరగతి ఫెయిల్ ఐనా పర్వాలేదు.. డబ్బులిస్తే చాలు !! సమాజంలో మీకంటూ గుర్తింపు కావాలని ఆశపడుతున్నారా ? ఇంకెందుకు ఆలస్యం.. అడిగినంత ఇచ్చేయండి.. డాక్టరేట్ పొందేయండి !! ప్రతిష్టాత్మక డాక్టరేట్లను అంగట్లో సరుకులా అమ్ముతున్నాడు ఓ మేధావి. డాక్టరేట్…!! పేరుకు ముందు ఈ పదం జోడించుకోవాలి అంటే ఎంతో ఘనత సాధించి ఉండాలి. లేదా పీహెచ్డీ చేసి ఉండాలి. సమాజంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని వివిధ రంగాల్లో వాళ్లు చేస్తున్న కృషికి ఫలితంగా కొన్ని యూనివర్సిటీలు డాక్టరేట్లను ప్రదానం చేస్తుంటాయి. ప్రదానం చేసే యూనివర్సిటీలు కూడా చాలా ప్రాధాన్యత కలిగి ఉంటాయి. కానీ.. ఓ కేటుగాడు డాక్టరేట్లను అంగట్లో సరుకులా అమ్ముకుంటున్నాడు. డబ్బులిస్తే చాలు.. డాక్టరేట్లను చాక్లెట్లు పంచినట్లు పంచుతున్నాడు.
READ MORE: Fake Liquor: ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో ట్విస్ట్..
Also Read
- Anaya Bangar: ‘వ్యతిరేకించే ముందు తెలుసుకోండి’.. సౌతాఫ్రికా ఆల్రౌండర్కు ఘాటుగా బదులిచ్చిన అనయా బంగర్.!
- Gold and Silver Today: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- Suryakumar Yadav: కెప్టెన్గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
- Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
రవీంద్ర భారతి వేదికగా జరుగుతున్న డాక్టరేట్ల ప్రదానం కార్యక్రమంలోకి సడెన్గా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. డాక్టరేట్లను అందజేస్తున్న పెద్దమనిషి పెద్ది యోహానును అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు కానీ అసలు విషయం బయటపడలేదు. గుర్రం జాషవా స్మారక కళా పరిషత్ పేరుతో ఫేక్ డాక్టరేట్లను ప్రదానం చేస్తున్నాడు పెద్దిటి యోహాను. డాక్టరేట్ కావాలనుకునేవాళ్లు.. పేరుకు ముందు డాక్టరేట్ అని జోడించుకోవాలని తహతహలాడుతున్న వాళ్లను టార్గెట్ చేశాడు యోహాను. డబ్బులిస్తే.. డాక్టరేట్ ఇప్పిస్తానని నమ్మించాడు. డబ్బులు తీసుకుని.. డాక్టరేట్లను ప్రదానం చేస్తున్నాడు. ఏకంగా గుర్రం జాషవా పేరును వాడేసుకున్నాడు. తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ, అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ… అని ఇలా పెద్ద పెద్ద పేర్లు పెట్టుకుని.. కలరింగ్ ఇస్తూ… ఫేక్ డాక్టరేట్లను ప్రదానం చేస్తున్నారు.. పెద్ది యోహాను గురించి తెలియక కొంతమంది అమాయకులు ట్రాప్లో పడిపోతుండగా.. మరికొందరు కావాలనే డబ్బులిచ్చి మరీ డాక్టరేట్లను కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇప్పటివరకు ఎన్నిచోట్ల కార్యక్రమాలు నిర్వహించారు. ఎంతమందికి డాక్టరేట్లను ప్రదానం చేశారు..? ఒక్కొక్కరి దగ్గర ఎంతమొత్తంలో వసూలు చేశారు..? అనే వివరాలు కూపీ లాగుతున్నారు పోలీసులు. ప్రతిష్టాత్మకంగా భావించే డాక్టరేట్లను అవమానపర్చడమే కాకుండా.. చాక్లెట్లు, బిస్కెట్లు పంచినంత ఈజీగా డాక్టరేట్లు ప్రదానం చేయడంపై పలువురు సాహితీవేత్తలూ మండిపడుతున్నారు..
తాజావార్తలు
-
Anaya Bangar: ‘వ్యతిరేకించే ముందు తెలుసుకోండి’.. సౌతాఫ్రికా ఆల్రౌండర్కు ఘాటుగా బదులిచ్చిన అనయా బంగర్.!
-
Saif Ali Khan Attack: సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసులో కీలక మలుపు.. క్షమాభిక్ష కోరిన నిందితుడు
-
Gold and Silver Today: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
-
HMD 105 4G School Edition: పిల్లల కోసం కొత్త ఫోన్.. HMD 105 4G School Edition లాంచ్.. ఇవే స్పెషల్ ఫీచర్లు
-
CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!