NTV Telugu Site icon

Kidnap Case: సీఐడీ అధికారులమంటూ ఐటీ కంపెనీ యజమాని కిడ్నాప్.. అడ్డంగా బుక్కైన కేటుగాళ్లు

Rayadurgam

Rayadurgam

జేఏ యాడ్స్ అనే అమెరికన్ బేస్డ్ ఐటీ కంపెనీలో ఏపీ సీఐడీ అధికారులమంటూ కంపెనీలోకి పది మంది వెళ్లినట్లు మాదాపూర్ డీసీపీ తెలిపారు. ఐటీ కంపెనీ యజమాని దగ్గర నుంచి దాదాపు 10 కోట్ల రూపాయలను నకిలీ ఏపీ సిఐడి అధికారులు డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. రంజీత్‌ మాజీ ఉద్యోగితో కలిసి ఏపీ సీఐడీ అధికారులుగా వచ్చినట్లు చెప్పారు. అయితే, కర్నూల్ డీఐజీ ఆఫీసులో ఎస్సైగా పని చేస్తున్న సుజన్ తో కలిసి రంజీత్ ఈ కుట్ర చేశాడు. మీరు చాలా మందిని మోసం చేశారంటూ ఐడీ కార్డులను ఐటీ కంపెనీ యజమానికి నకిలీ సీఐడీ టీమ్ చూపించింది.

Read Also: Raashi khanna : ట్రెండి వేర్ లో హాట్ అందాలతో హీటేక్కిస్తున్న రాశి ఖన్నా..

అయితే, ఈ ముఠా మొత్తానికి ఎస్ఐ సుజన్ పక్కా ప్లాన్ చేసి దాన్ని అమలు చేసేలా చూశాడు అని మాదాపుర్ డీసీపీ తెలిపారు. డబ్బుల కోసమే ఎస్ఐ సుజన్ ఈ కిడ్నాప్ కేసులో కీలకపాత్ర పోషించాడన్నారు. కంపెనీ మేనేజ్‌మెంట్ కిడ్నాప్ చేసి హోటల్ కి తీసుకెళ్ళారు.. ఆ హోటల్ ల్లోనే పది లక్షల రూపాయలు ట్రాన్సఫర్‌ చేయించుకున్నారు.. ఏజీఏ యాడ్స్ గత కొన్నేళ్ళుగా ఉద్యోగాలను ఇప్పిస్తుంది.. ఏజీఏ యాడ్స్ కు చెందిన దర్శన్, హరిప్రసాద్ లను హోటల్ కు నకిలీ సీఐడీ టీమ్ తీసుకెళ్ళింది. డబ్బులు తీసుకున్న తరువాత ముగ్గురిని సదరు టీమ్ వదిలేసింది. ఫేక్ సీఐడీ అధికారుల మంటూ చెప్పిన నిందితుల దగ్గర నుంచి బయట పడిన తర్వాత దర్శన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.