India-US: ఉగ్రవాది కేసులో భారత్ కు అమెరికా సమన్లు.. స్పందించిన విదేశాంగ శాఖ
- భారత్ పై ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను ఆరోపణలు
- యూఎస్ కోర్టులో దావా
- భారత ప్రభుత్వానికి సమన్లు జారీ చేసిన అమెరికా కోర్టు
- ఘాటుగా స్పందించిన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను ఆరోపణలపై అమెరికా కోర్టు భారత ప్రభుత్వానికి సమన్లు పంపింది. సివిల్ కేసులో హత్యకు కుట్ర పన్నారని పన్నూ ఆరోపిస్తూ.. పన్ను దావా వేశాడు. ఈ సమన్లు పూర్తిగా సరికాదని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. న్యూయార్క్లోని సదరన్ డిస్ట్రిక్ట్లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈ సమన్లు జారీ చేసింది. ఇందులో భారత ప్రభుత్వం, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రా మాజీ చీఫ్ సమంత్ గోయల్, రా ఏజెంట్ విక్రమ్ యాదవ్, భారతీయ వ్యాపారవేత్త నిఖిల్ గుప్తా పేర్లు ఉన్నాయి. దీనిపై 21 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని కోర్టు కోరింది.
READ MORE: CM Revanth Reddy : మంచి విజన్ ఉన్న నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి… ఆనంద్ మహీంద్ర ప్రశంసలు
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..
- Naturally Lizard Removal Tips: వేసవిలో ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైందా..? ఈ సింపుల్ స్ప్రే చాలు.. వెంటనే పారిపోతాయి..!
- Sorakaya Uttappam Recipe: సొరకాయతో సూపర్ టేస్ట్.. మెత్తటి ‘సొరకాయ ఉత్తప్పం’ రెసిపీ..
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
స్పందించిన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ..
పన్ను అంశంపై తాజాగా భారత్ స్పందించింది. పన్నూ ఒక ఉగ్రవాది అని, అతడి కేసులో తమను ప్రశ్నించడమేంటని ఘాటుగా సమాధానమిచ్చింది. ఇది పూర్తిగా అసమంజసమని పేర్కొంది. తాజాగా విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మీడియాతో ఈ విషయంపై ప్రసంగించారు. ‘‘ఇంతకుముందు చెప్పినట్టుగానే..ఇవన్నీ అసమంజసమైన, తప్పుడు ఆరోపణలు అని మరోసారి స్పష్టం చేస్తున్నాం. ఈ అంశాన్ని ఉన్నత స్థాయి కమిటీ పరిశీలిస్తోంది. పన్ను నేపథ్యం గురించి అందరికీ తెలుసు. అతను అక్రమ సంస్థతో సంబంధం కలిగి ఉన్నాడు. ఈ కేసు వెనక ఉన్న వ్యక్తి ప్రాతినిధ్యం వహించే సంస్థ చట్టవిరుద్ధమైనదనే వాస్తవం మీకు తెలుసు’’ అని స్పష్టంచేశారు.
READ MORE: Amaravati: ఆపరేషన్ బుడమేరుకు రంగం సిద్ధం.. ఆక్రమణలను గుర్తించే పనిలో యంత్రాంగం
ఇదిలా ఉండగా.. సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) అనే వేర్పాటువాద సంస్థను భారత్ 2019లోనే నిషేధించింది. 2007లో ఈ సంస్థను స్థాపించగా.. వ్యవస్థాపకుల్లో గురుపత్వంత్ కూడా ఒకడు. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (UAPA) కింద భారత ప్రభుత్వం అతడిని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించొద్దని, దాడులు చేస్తామంటూ పలుమార్లు అతడు పలుమార్లు బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే.
READ MORE: Bihar: బీహార్లో ఐపీఎస్ల రాజీనామా .. ప్రశాంత్ కిషోర్ హస్తం ఉందా?
పన్నూకు అమెరికా – కెనడా ద్వంద్వ పౌరసత్వం
పన్నూ సిక్ ఫర్ జస్టిస్ అనే ఛాందసవాద సంస్థకు అధిపతి. అతను భారతీయ నాయకులు మరియు సంస్థలపై రెచ్చగొట్టే ప్రసంగాలు, బెదిరింపులు చేస్తున్నాడు. 2020లో అతడిని ఉగ్రవాదిగా భారత్ ప్రకటించింది. నవంబర్లో, బ్రిటీష్ వార్తాపత్రిక ఫైనాన్షియల్ టైమ్స్, పన్నూని చంపడానికి యూఎస్ పన్నాగం విఫలమైందని నివేదించింది. పన్నూకు అమెరికా మరియు కెనడా ద్వంద్వ పౌరసత్వం ఉంది. బిడెన్ పరిపాలన అధికారులు కూడా ఈ విషయాన్ని తర్వాత ధృవీకరించారు.
READ MORE: CM Relief Fund: సీఎం రిలీఫ్ ఫండ్కు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం..
ఇది భారత్-అమెరికా సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపదు.
ఈ ఏడాది మేలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ అంశంపై భారత్ దర్యాప్తు చేస్తోందని చెప్పారు. అయితే ఈ అంశం భారత్-అమెరికా సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపదని ఆయన స్పష్టం చేశారు. జైశంకర్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “యునైటెడ్ స్టేట్స్ చిత్తశుద్ధితో కొంత సమాచారాన్ని మా దృష్టికి తీసుకువచ్చింది. ఎందుకంటే వాటిలో కొన్ని మన స్వంత వ్యవస్థపై ప్రభావం చూపుతాయని మేము నమ్ముతున్నాం. దీనిపై విచారణ జరుపుతున్నాం.” అని చెప్పారు. ఈ విషయం భారత్-అమెరికా సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపదని భారత్లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ కూడా చెప్పారు.
తాజావార్తలు
-
Tollywood : చదువుకోవడం కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్
-
Stock Market Crash: స్టాక్ మార్కెట్ కొంప ముంచిన ట్రంప్ ప్రకటన.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్లు డౌన్!
-
Donald Trump: త్వరగా నిర్ణయం తీసుకోండి, లేకపోతే మీకు ఏమీ మిగలదు.. ఇరాన్ను మళ్లీ హెచ్చరించిన ట్రంప్
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..
-
Veera Bhadrudu : ‘వీర భద్రుడు’కు అసలు పరీక్ష ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..