Kiran Kumar Reddy: సీఈసీ పర్యవేక్షణలో పుంగనూరు ఎన్నికలు జరపాలి.. మాజీ సీఎం కిరణ్ ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiran Kumar Reddy: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)కి మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి లేఖరాయడం చర్చగా మారింది.. సీఈసీ పర్యవేక్షణలో పుంగనూరు ఎన్నికలు జరపాలంటూ ఆయన ఫిర్యాదు చేశారు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలతో ఓటర్లు భయపడుతున్నారంటూ ఈసీ దృష్టికి తీసుకెళ్లారు రాజంపేట లోక్సభ నియోజకవర్గం బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.. మంత్రి పెద్దిరెడ్డి వ్యవహారాలు ఎన్నికల కమిషన్ ను సవాలు చేసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వారి కుటుంబీకులు తీవ్రస్థాయిలో హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు.. పుంగనూరు నియోజక వర్గాన్ని పూర్తిగా కేంద్ర ఎన్నికల కమిషన్ తన ఆధీనంలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు..
Read Also: Saudi Arab : సౌదీలో పోలీసుల కఠిన చర్యలు.. ఎవరైనా నేరం చేయాలంటే 10సార్లు ఆలోచించాల్సిందే
Also Read
- Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
- రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
- MP: ‘సారీ అమ్మా, నాన్న.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు’.. కన్నీరు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ నోట్
- SL vs WI: కెప్టెన్గా కుసాల్ మెండిస్ బోణి.. వెస్టిండీస్పై శ్రీలంక ఘన విజయం.!
ఈ ఎన్నికల్లో పుంగనూరులో హింసాత్మక ఘటనలు లేకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని ఆకాక్షించిన కిరణ్కుమార్.. అందుకు కేంద్ర ఎన్నికల సంఘం స్వీయ పర్యవేక్షణలో పుంగనూరు ఎన్నికలు నిర్వహించాలని కోరారు.. గత నెల 14, 15 తేదీల్లో కూడా తాను ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.. ఇక, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండటం మూలంగా.. మంత్రి పెద్దిరెడ్డి తమకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వ, పోలీస్ అధికారులను ఎన్నికల కంటే ముందుగా నియమించుకున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.. వారు ఇప్పుడు వైసీపీకి మద్దతుగా నిలుస్తూ.. విపక్షాలపై దాడులు చేస్తున్నారని.. విపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని తన లేఖలో పేర్కొన్నారు.. ఇక, నియోజకవర్గం ఓటర్లలో విశ్వాసం పెరగడానికి, స్వేచ్ఛగా ఓటు వేయడానికి, ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి, పుంగనూరు నియోజకవర్గాన్ని పూర్తిగా ఎన్నికల కమిషన్ తన ఆధీనంలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.. ఎన్నికల కోసం కేంద్ర పరిశీలకులను ప్రత్యేకంగా నియమించాలి. అన్ని సమస్యాత్మక, కీలకమైన పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు అమర్చాలి. కేంద్ర పారా మిలిటరీ బలగాలను వెంటనే మోహరించాలని తన లేఖ ద్వారా సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు రాజంపేట లోక్సభ నియోజకవర్గం బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి..
తాజావార్తలు
-
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
-
IRCTC: నకిలీ బుకింగ్లపై పట్టు బిగించిన ఐఆర్ సీటీసీ.. 3.03 కోట్ల అనుమానాస్పద ఐడీలు డీయాక్టివేట్
-
India T20 Captain: సూర్యకుమార్కు షాక్.. టీమిండియా కెప్టెన్గా శ్రేయాస్ అయ్యర్.. తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు..!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
MP: ‘సారీ అమ్మా, నాన్న.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు’.. కన్నీరు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ నోట్
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!