తెలంగాణలో వివిధ పార్టీ్లలో చేరికలు బాగా ఊపందుకున్నాయి. మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ బీజేపీకి బై చెప్పి టీఆర్ఎస్ లో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేనేత కార్మికుల పట్ల సమగ్ర అవగాహన రాపోలు ఆనంద్ భాస్కర్ కు ఉందన్నారు కేటీఆర్. వ్యవసాయం తరువాత అంతటి స్థాయి, పరిపుష్టి ఉన్న రంగం చేనేత రంగం. మోడీ నాయకత్వంలో చేనేత రంగానికి కనీసం ఒక పాలసీ లేదు. దుస్తుల తయారీలో బంగ్లాదేశ్, శ్రీలంక కంటే వెనుకబడి ఇండియా ఉంది.
Read ALso: Wuhan Lockdown: కొవిడ్ పుట్టినిల్లు వూహాన్లో మళ్లీ లాక్డౌన్.. మళ్లీ పెరిగిన కేసులు
చేనేత అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం ఎంతో చూసాం. చేనేత కళాకారులకు కేంద్రం ప్రోత్సాహకాలు అందడం లేదు. చేనేతలో పరుగులు పెడుతున్న రాష్ట్రాలకు సహకరించాలని ఎన్నోసార్లు కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు. చేనేత అభివృద్ధి కోసం కేంద్రానికి డీపీఆర్ ఇచ్చామన్నారు. చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, చేనేత లక్ష్మీ, పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నేతన్నకు అదుకుంటుంది. కోవిడ్ టైంలో 100 కోట్లు చేనేత రంగానికి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది. వ్యవసాయం తరువాత చేనేత రంగాన్ని గౌరవించిన ప్రభుత్వం కేసీఆర్ దే అన్నారు.
నేతన్నకు బీమా పేరుతో ఇన్సూరెన్స్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అన్నారు మంత్రి కేటీఆర్. వర్కర్ ను యజమానిగా, శ్రామికుడిని పారిశ్రామిక వేత్తగా తీర్చిదుద్దుతున్న ప్రభుత్వం టీఆర్ఎస్. చేనేతకు చేయూతను ఇవ్వాల్సిన కేంద్రం చావుదెబ్బ కొడుతోంది.రాష్ట్రానికి కేంద్రం ఒక్క పని ఇవ్వలేదు…కానీ ఉన్నవి మాత్రం రద్దు చేసుకుంటూ పోతోంది కేంద్రం. 8 ఏళ్ల మోడీ పాలనలో 8 సంస్థలను రద్దు చేసిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు.
Read Also: 18 Pages: మాస్ మహరాజాను ఢీ కొట్టబోతున్న నిఖిల్!