Ponnam Prabhakar: నా క్యాంపు కార్యాలయాన్ని సంప్రదించండి.. విత్తనాలు ఫ్రీగా ఇస్తా!
- పొలం దున్నే కార్యక్రమంలో మంత్రి పొన్నం
- నాగలితో దుక్కి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి
- విత్తనాల కోసం నా క్యాంపు కార్యాలయాన్ని సంప్రదించండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విత్తనాలు వేసుకునే శక్తి లేని వారు తన క్యాంపు కార్యాలయాన్ని సంప్రదించండని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తాము విత్తనాలు అందిస్తాం అని, రైతులు ఖాళీ జాగా లేకుండా పంటలు వేయాలని కోరారు. రైతులకు ప్రభుత్వం తరఫున ఉచిత విద్యుత్, సాగునీరు, పెట్టుబడి సహాయం, మద్దతు ధర అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది మంచి వర్షాలు, పాడి పంటలతో తెలంగాణ దేశంలో అత్యధిక ఉత్పత్తులు ఎగుమతి చేసే రాష్ట్రంగా ఎదగాలని మంత్రి పొన్నం ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్లలో ‘ఏరువాక పౌర్ణమి’ సందర్భంగా పొలం దున్నే కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఎడ్ల నాగలితో దుక్కి దున్ని విత్తనాలు చల్లారు.
Also Read: WTC Final 2025: టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్! 27 ఏళ్ల కల నెరవేరేనా?
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
పొలం దున్నే కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… ‘రైతులందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. రైతులు ఒక్క గుంట కూడా బీడు లేకుండా.. వరి, మొక్కజొన్న, ఆయిల్ ఫాం ఇతర ఏదైనా పంటలు వేయాలి. రైతులు ఎక్కడ ఖాళీ జాగా, బీడు లేకుండా చూడాలి. రైతులకు ప్రభుత్వం తరఫున ఉచిత విద్యుత్, సాగునీరు, పెట్టుబడి సహాయం, మద్దతు ధర అందిస్తున్నాం. రైతులకు ఏ ఇబ్బంది లేకుండా రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉండే ప్రభుత్వం మాది. ఈసారి దేశంలో అధిక ఉత్పత్తులు ఎగుమతి చేసే రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలని ఆకాంక్షిస్తున్నా. విత్తనాలు వేసుకునే శక్తి లేని వారు నా క్యాంపు కార్యాలయాన్ని సంప్రదించండి. మేము విత్తనాలు అందిస్తాం, మీరు ఖాళీ జాగా లేకుండా పంటలు వేయాలి. మొన్ననే హుస్నాబాదులో మూడు రోజుల పాటు రైతు మహోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ ప్రాంత రైతాంగానికి నూతన వ్యవసాయ విధానాలు, పద్ధతులపై మూడు రోజుల కాన్ఫరెన్స్ జరిగింది. పంటలు, యాంత్రీకరణ తదితర అంశాలపై రైతులు అవగాహన చేసుకున్నారు’ అని చెప్పారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?