Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
- ఎర్రవల్లి భూములపై క్షేత్రస్థాయి విచారణ షురూ
- సర్వే నంబర్ 325లో అసైన్డ్ భూములపై పరిశీలన
- 385 ఎకరాల్లో ఆక్రమణలపై అధికారుల ఆరా
- సమగ్ర నివేదిక సిద్ధం చేయనున్న రెవెన్యూ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దిపేట జిల్లా పరిధిలోని ఎర్రవల్లి భూముల వివాదంపై ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనను అధికారికంగా ప్రారంభించారు. ఎర్రవల్లి, దాని శివారు గ్రామాలైన వెంకటపూర్ , వరదరాజుపూర్ సరిహద్దుల్లోని సర్వే నంబర్ 325 పరిధిలో ఉన్న అసైన్డ్ భూములను అధికారులు శోధించి, పరిశీలిస్తున్నారు.
ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో సమగ్ర తనిఖీలు
ఏడీ సుదర్శన్, గజ్వేల్ ఆర్డీఓ చంద్రకళ, , మర్కూక్ ఎమ్మార్వోల నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఈ క్షేత్రస్థాయి విచారణను చేపడుతున్నాయి. సర్వే నంబర్ 325 పరిధిలోని అసైన్డ్ భూములు ప్రస్తుతం ఎవరి స్వాధీనంలో ఉన్నాయి, ఎవరు కబ్జా చేశారనే విషయాలపై అధికారులు సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఎర్రవల్లి, వెంకటపూర్ రెవెన్యూ గ్రామాల పరిధిలోని పలు కీలక సర్వే నంబర్లలో భూముల కొలతలు , పరిశీలన ప్రక్రియ పూర్తయింది.
Also Read
- TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
- Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
- Warangal Cyber Crime : రూ.8 వేల కోసం ఖాతాలు అమ్మేశారు.. 185 సైబర్ కేసుల్లో లింకులు
- Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
385 ఎకరాల అసైన్డ్ భూముల్లో కబ్జాల గుర్తింపు
ఏ సర్వే నంబర్లో ఎంత మేర భూమి విస్తరించి ఉంది, అందులో ప్రభుత్వ భూమి ఎంత, ప్రైవేట్ పట్టా భూమి ఎంత అనే కీలక వివరాల సేకరణలో రెవెన్యూ సిబ్బంది నిమగ్నమయ్యారు. మొత్తం 385 ఎకరాల అసైన్డ్ భూమి పరిధిలో ఎంత మేర ఆక్రమణలు లేదా కబ్జాలకు గురయ్యిందనే విషయాన్ని తేల్చేందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా సర్వే నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల అనంతరం సమగ్ర నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేయనున్నారు.
తాజావార్తలు
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
-
Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్పింగ్ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
-
Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!