NTV Telugu Site icon

Errabelli Dayakar Rao : గవర్నర్ తమిళిసై పై మంత్రి ఎర్రబెల్లి ఫైర్

Errabelli Dayakar

Errabelli Dayakar

గవర్నర్ తమిళసై పై మంత్రి ఎర్రబెల్లి ఫైర్ అయ్యారు. గవర్నర్ ఈ వ్యవస్థను కించపరిచేలా వ్యవహరిస్తు‌న్నారు మంత్రి ఎర్రబెల్లి మండిపడ్డారు. నేను 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే ఇలాంటి గవర్నర్ ను ఇప్పటివరకు చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ఏజెంట్‌గా పనిచేస్తున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి ఆమెకు కనిపించట్లేదా అని ఆయన ప్రశ్నించారు. అంతపెద్ద సెక్రెటరియేట్ నిర్మాణం కనిపించడం లేదా.. అది అభివృద్ధి కాదా అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంత అభివృద్ధి జరుగుతోందా అని ఆయన అన్నారు. రైతు సంక్షేమ రాష్ట్రంలో గవర్నర్ కు ఆత్మహత్యలు కనిపిస్తున్నాయా? అని ఆయన మండిపడ్డారు.

Also Read : Prabhas: సింగిల్ కింగులం నుంచి నువ్వెప్పుడూ బయటపడతావ్ డార్లింగ్

ఇదిలా ఉంటే.. గణతంత్ర వేడుకల సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు లోని స్కూల్ ఆవరణ, స్థానిక మసీదులో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ విగ్రహానికి, అంబేద్కర్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్య్రం, తెలంగాణ సాధనలో ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను మరచిపోవద్దని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు.

Also Read : Revanth Reddy : కొడంగల్‌లో హాత్ సే హాత్ జోడో అభియాన్ ప్రారంభం