Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Enumamula Market Turns Empty As Cotton Purchases Halt Farmers In Deep Distress

Enumamula Market: బోసిపోయిన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్.. అష్టకష్టాలు పడుతున్న అన్నదాతలు!

Published Date :November 17, 2025 , 7:14 pm
By Sampath Kumar
  • బోసిపోయిన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్
  • బంద్‌కు పిలుపునిచ్చిన జిన్నింగ్ మిల్ వ్యాపారులు
  • బోసిపోయిన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్
Enumamula Market: బోసిపోయిన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్.. అష్టకష్టాలు పడుతున్న అన్నదాతలు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

పత్తి కొనుగోళ్ల విషయంలో సీసీఐ తీరుకు నిరసనగా జిన్నింగ్ మిల్ వ్యాపారులు బంద్‌కు పిలుపునిచ్చారు. నేటి నుంచి పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నమని వ్యాపారులు ప్రకటించడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పత్తి క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. దాంతో తెలంగాణలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అయిన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు క్రయవిక్రయాలు లేక బోసిపోయింది.

తెలంగాణలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అయిన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు క్రయవిక్రయాలు లేక బోసిపోయింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ తీరుతో రైతులు, జిన్నింగ్ మిల్లర్లు నష్టపోతున్నారంటూ కొన్ని రోజులుగా ఆందోళన బాటపట్టారు . సీసీఐ కొత్త నిబంధనలు కొర్రీలతో రైతులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిన్నింగ్ మిల్ వ్యాపారులు 17 సోమవారం నుంచి పత్తి కొనుగోళ్ల బంద్‌ చేస్తున్నామని పిలుపునిచ్చారు. జిన్నింగ్ మిల్లుల వ్యాపారులు బంద్ పిలుపు నేపథ్యంలో రైతులు పత్తిని మార్కెట్‌కు తీసుకురాని పరిస్థితి నెలకొంది. దీంతో ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ బోసిపోయింది.

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ప్రతిరోజు సుమారు 15 వేల బస్తాల పత్తి అమ్మకాలు జరుగుతాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 23 జిన్నింగ్ మిల్ యాజమాన్యాలు పత్తి కొనుగోలు నిర్వహిస్తారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు క్రయవిక్రయాలు కొనసాగుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రతి కొనుగోళ్లపై జిన్నింగ్ మిల్ యాజమాన్యాలు బందుకు పిలుపునివ్వడంతో.. రైతులెవరు పత్తిని మార్కెట్కి తీసుకురాలేదు. దీంతో వరంగల్ ఎనుమాముల మార్కెట్లో పత్తి యార్డ్ మొత్తం బోసిపోయింది. సీసీఐ వివరిస్తున్న తీరుకు రైతులకు జరుగుతున్న నష్టంతో పాటు మిల్లర్లకు జరుగుతున్న నష్టాన్ని రైతులకు తెలిసేలా చేయడం వల్లనే రైతులెవరు పత్తి యార్డుకి పత్తిని తీసుకు రాలేదని, దీంతో కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకొని సీసీఐ పెట్టిన నిబంధనలను తొలగించాల్సిన అవసరం ఉందని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Telangana Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌కు ముహూర్తం ఖరారు!

పత్తి రైతుల బాధలపై బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు స్పందిస్తూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతుంటే ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఏం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి వినయ్ భాస్కర్ లు ప్రశ్నించారు. మద్ధతు ధర రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే… మంత్రులు, ఎమ్మెల్యేలు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారని ఫైర్ అయ్యారు. రైతులకు మద్దతు ధర కోసం బీఆర్ఎస్ నిరసనకు దిగుతుందని వెల్లడించారు. ఈ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని వ్యాఖ్యలు చేశారు. ఈరోజు సాయంత్రం వరకు పత్తి కొనుగోలు ప్రక్రియ పై సరైన నిర్ణయం తీసుకోకుంటే మంగళవారం నుంచి బిఆర్ఎస్ రైతుల పక్షాన ఆందోళన బాట పడుతుందని హెచ్చరించారు.

సీసీఐ వ్యవహారశైలి, మరోవైపు పత్తి వ్యాపారుల ఒత్తిడి నేపథ్యంలో పత్తి కొనుగోళ్లపై ఉమ్మడి వరంగల్ జిల్లా రైతుల్లో ఆందోళన నెలకొంది. చేనులో నుంచి తీసిన పత్తిని అమ్ముకోలేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే అకాల వర్షాలు, చీడపీడలతో దిగుబడి రాక పెట్టుబడి అష్ట కష్టాలు పడుతున్న రైతులకు మరో సమస్య వచ్చి పడింది. ఆరుకాలం కష్టం చేసి తీసిన పత్తిని అమ్ముకోలేకపోయే దుస్థితిలో రైతులు ఉన్నారు. చేతికొచ్చిన పత్తి అమ్మితే కనీసం వేరే ఖర్చులు అయినా వెల్లుతాయని భావిస్తున్న అన్నదాతలు.. వ్యాపారులు, సీసీఐ మధ్య నలిగిపోతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CCI
  • Cotton Purchase
  • Cotton Purchase halt Telangana
  • enumamula market
  • Enumamula Market News

తాజావార్తలు

  • Father Property: తండ్రి ఆస్తులు అన్నీ కొడుకువి కావు.. సంచలన తీర్పు ఇచ్చి హైకోర్టు..

  • Devara 2: దేవర 2.. అప్పటి వరకు ఆగాల్సిందే!

  • Ustaad Bhagat Singh: అఫీషియల్.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ వెన్యూ ఫిక్స్!

  • Milk Purity: మీరు తాగే పాలు అసలైనవేనా? కల్తీ పాలను గుర్తించే 5 సింపుల్ పద్ధతులు ఇవే!

  • Hyderabad: పాతబస్తీలో అదృశ్యమైన యువకుడు.. బావిలో కుళ్లిపోయి ఇలా.. ఏం జరిగిందంటే..

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions