Supreme Court: జైళ్లలో కుల వివక్షను అరికట్టాలని పిల్.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు
- జైళ్లలో కుల వివక్షను అరికట్టాలని దాఖలైన పిల్
- సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు
- జైలు మాన్యువల్లోని నిబంధనలను మార్చాలని రాష్ట్రాలు..యూటీలకు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: జైళ్లలో కుల వివక్షను అరికట్టాలని దాఖలైన పిల్పై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. కుల ప్రాతిపదికన పనిని విభజించడం ద్వారా జైలు మాన్యువల్ నేరుగా వివక్ష చూపుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. కింది కులాల ఖైదీలకు మాత్రమే శుభ్రపరిచే పని, అగ్రవర్ణ ఖైదీలకు వంట పనులు ఇవ్వడం ఆర్టికల్ 15ను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. జైళ్లలో కుల వివక్షను ప్రోత్సహించే జైలు మాన్యువల్లోని నిబంధనలను మార్చాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.
Read Also: Hassan Nasrallah: నస్రల్లా ముందే కాల్పుల విరమణకు అంగీకరించాడు.. లెబనాన్ మంత్రి కీలక వ్యాఖ్యలు
Also Read
- Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు..
- Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
- Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
- Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం
కుల ప్రాతిపదికన జైళ్లలో పనులు పంచడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. కులం ఆధారంగా పని అప్పగించకూడదు. జైలు నిబంధనలలో స్పష్టమైన వివక్ష ఉందని కోర్టు పేర్కొంది. షెడ్యూల్డ్ కులాల ఖైదీలకే క్లీనింగ్ పనులు అప్పగించడం విస్మయం కలిగిస్తోంది. అదేవిధంగా ఇతర కులాల ఖైదీలకు ఆహారం వండుకునే పని కల్పించారని మండిపడింది. జైలు మాన్యువల్లోని ఖైదీల కులానికి సంబంధించిన వివరాల వంటి సూచనలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. దీనితో పాటు, శిక్ష పడిన లేదా అండర్ ట్రయల్ ఖైదీల రిజిస్టర్ నుండి కుల కాలమ్ను తొలగించాలి. జైళ్లలో కుల వివక్షపై సుప్రీం కోర్టు స్వయంగా విచారణ చేపట్టింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా నివేదికలు సమర్పించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.
జైలులో క్లీనింగ్ పనులు కేవలం కింది కులాల ఖైదీలకు మాత్రమే అప్పగించవద్దని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. ఇది ఆర్టికల్ 15 ఉల్లంఘన అంటూ వ్యాఖ్యానించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వెంటనే జైలు మాన్యువల్లో మార్పులు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం అమలుకు సంబంధించిన నివేదికను కూడా కోర్టులో సమర్పించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది దేశ సర్వోన్నత న్యాయస్థానం.
తాజావార్తలు
-
Anantha Sriram: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టార్గెట్గా అనంత శ్రీరామ్ కామెంట్స్? కర్ణుడు – అర్జునుడి పాత్రలను అలా చూపిస్తారా!
-
Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
-
Mumbai Muharram Plot: మొహర్రం ఊరేగింపులో విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ! రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు..
-
Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు..
-
Nellore: కోడూరు బీచ్లో విషాదం.. ముగ్గురు గల్లంతు.. బాలుడి మృతి
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!