B. R. Gavai: “ఇది మా నాన్న కల.. కానీ చూడటానికి ఆయన లేరు..” కంటతడి పెట్టిన సీజేఐ..!
- నాగ్పూర్ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సీజేఐ
- సీజేఐ గవాయ్ను ఘనంగా సత్కరించిన బార్ అసోసియోషన్ సభ్యులు
- తల్లిదండ్రుల కృషి, పోరాట కథను వివరించిన ప్రధాన న్యాయమూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) భూషణ్ రామకృష్ణ గవాయ్ శుక్రవారం (జూన్ 27) జరిగిన ఓ కార్యక్రమంలో తన భావాలను పంచుకున్నారు. నాగ్పూర్ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశంలో అత్యున్నత న్యాయ పదవిని చేరుకున్నందుకు సీజేఐ గవాయ్ను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన తల్లిదండ్రుల కృషి, పోరాట కథను వివరించారు. ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కళ్లు చెమ్మగిల్లాయి. గొంతు మూగబోయింది. భావోద్వేగపూరిత మాటలు విని, అక్కడ ఉన్నవాళ్లు కూడా విచారంగా మారారు. తాను చిన్నతనంలో ఆర్కిటెక్ట్ కావాలని కోరుకున్నానని తెలిపారు. కానీ తన తండ్రి న్యాయవాది కావాలని కోరుకున్నట్లు తెలిపారు. ‘నా తండ్రి న్యాయవాది కావాలని కోరుకున్నారు. కానీ స్వాతంత్ర్య పోరాటంలో అరెస్టు కావడంతో ఆయన తన కలను నెరవేర్చుకోలేకపోయారని వెల్లడించారు.
READ MORE: Gautam Adani: పూరీ జగన్నాథుడి రథయాత్రలో అదానీ కుటుంబం..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
తన కుటుంబం పడుతున్న ఇబ్బందులను గుర్తుచేసుకున్నారు. “మాది ఉమ్మడి కుటుంబం.. చాలా మంది పిల్లలు ఉండే వారు. బాధ్యత అంతా నా తల్లి, అత్త భుజాలపై ఉండేది. నా తండ్రి కలను నెరవేర్చడానికి.. ఆర్కిటెక్ట్ కావాలనే నా ఉద్దేశ్యాన్ని వదులుకుని, న్యాయవాద మార్గాన్ని ఎంచుకున్నాను. హైకోర్టు న్యాయమూర్తిగా నన్ను నియమించినప్పుడు.. ‘నువ్వు న్యాయవాదిగా కొనసాగితే, డబ్బు వెంట మాత్రమే పరిగెత్తుతారు. కానీ న్యాయమూర్తిగా మారితే.. అంబేద్కర్ చూపిన మార్గాన్ని అనుసరిస్తావు. సమాజానికి మంచి పని చేస్తావు’ అని నా తండ్రి చెప్పారు. నేను ఏదో ఒక రోజు భారత ప్రధాన న్యాయమూర్తి అవుతానని నా తండ్రి నమ్మాడు. అయితే, ఆయన 2015లో మరణించారు. ఈ రోజు ఆయన కల నెరవేరింది. కానీ ఇది చూసేందుకు ఆయన లేరు. నా తల్లి మాత్రం నా ఎదుగుదలను చూస్తున్నందుకు సంతోషిస్తున్నాను.” అని సీజేఐ భావోద్వేగానికి గురయ్యారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!