Shocking : మహారాష్ట్రలో దారుణం.. నదిలో గుట్టలుగా చిన్నారుల శవాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking : మహారాష్ట్రలో దారుణం వెలుగులోకి వచ్చింది. ముక్కు పచ్చలారని చిన్నారులు నదిలో శవాలై కనిపించారు. మహారాష్ట్రలోని వాన్ నదిలో భారీగా శిశువుల మృతదేహాలు కనిపించిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. అభం శుభం తెలియని చిన్నారులను గుర్తు తెలియని వారు నదిలో వేశారు. బుల్దానా జిల్లా సంగ్రామ్పూర్ తాలూకా కొలాడ్ గ్రామంలో ఈ షాకింగ్ ఘటన రాష్ట్రంలో విస్మయానికి గురి చేస్తోంది. తమ్గావ్ పోలీసులు సమాచారం అందుకుని విచారణ చేపట్టగా వారికి నమ్మలేనటువంటి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెద్ద ఎత్తున అక్రమ అబార్షన్ రాకెట్ గుర్తించినట్లు వారు తెలిపారు. ఈ స్థానికంగా వ్యాప్తి చెందగానే నది వద్దకు భారీగా గ్రామస్థులు చేరుకున్నారు. గిరిజనుల ప్రాబల్య ప్రాంతాల్లో బోగార్ వైద్యులు పెద్ద ఎత్తున పనిచేస్తున్నారని స్థానికులు తరచూ ఫిర్యాదు చేస్తున్నారు.
Read Also: Shivani Rajashekar: ఆ విషయంతో పోలిస్తే నాది చిన్నదే అంటున్న శివాని రాజశేఖర్
Also Read
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్లోనే అత్యధికం..!
- RK Roja: మంత్రి లోకేష్పై రోజా సంచలన ఆరోపణలు..
- CM Revanth: భవనాలు నిర్మించడం సులభమే.. కానీ, కలలకు పునాదులు వేయాలంటే సంకల్పం ఉండాలి..!
ఇలాంటి వైద్యులు ఎక్కువగా అక్రమ అబార్షన్ రాకెట్ను నడుపుతున్నారని, అలా చేసి మరణించిన శిశువులను నదిలో పడేస్తున్నారని చెబుతున్నారు. ఈ విషయమై తమ్గావ్ పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ప్రాథమిక విచారణలో అక్రమ అబార్షన్ రాకెట్ సాగుతున్నట్లు పోలీసులు అంగీకరించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. బుల్దానాలోని సంగ్రామ్పూర్ తాలూకా కోలాడ్ లోని వాన్ నదిలో చాలా మృతదేహాలు కనిపించాయి. వీటి వయసు నాలుగు నుంచి ఆరు నెలల వరకు ఉండవచ్చు. ఈ ఘటన గ్రామం మొత్తం భయాందోళనకు గురి చేసింది. దీంతో గ్రామస్థులు సమీపంలోని తమ్గావ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సెక్షన్ 318 కింద కేసు నమోదు చేశారు. నిందితులను త్వరగా అరెస్టు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దీంతో తమ్గావ్ పోలీసులు ఈ ప్రాంతంలో అబార్షన్ రాకెట్ చట్టవిరుద్ధంగా పనిచేస్తోందని ప్రాథమిక విచారణలో గుర్తించారు. త్వరలో వాటిని కఠినతరం చేస్తామని గ్రామస్థులకు నచ్చ జెప్పారు. దీంతో వారు ఆందోళన విరమించారు.
తాజావార్తలు
-
RC17: రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్.. సుకుమార్ పక్కా స్కెచ్!
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
-
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
-
SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్లోనే అత్యధికం..!
-
RK Roja: మంత్రి లోకేష్పై రోజా సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..