C-390 Aircraft: విదేశీ కంపెనీ సాయంతో త్వరలో విమానాలను తయారు చేయనున్న మహీంద్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
C-390 Aircraft: భారత వైమానిక దళం మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ (MTA) అవసరమని భావించింది. దీన్ని అర్థం చేసుకున్న ఆటో సెగ్మెంట్ దిగ్గజం మహీంద్రా గ్రూప్ బ్రెజిలియన్ కంపెనీ ఎంబ్రేయర్తో కలిసి సి 390 మిలీనియం విమానాలను తయారు చేయనున్నట్లు ప్రకటించింది. ఎయిర్ ఫోర్స్ అవసరాలకు అనుగుణంగా దీన్ని సిద్ధం చేసేందుకు ఇరు సంస్థలు అంగీకరించాయి. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఈ ఒప్పందాన్ని ప్రకటించారు.
Read Also:Childrens Kidnap: రాష్ట్రంలో పిల్లల కిడ్నాప్ ముఠాలు.. అంతా అవాస్తవమన్న పోలీసులు
Also Read
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
వైమానిక దళం 18 నుండి 30 టన్నుల బరువును ఎత్తగలిగే ఎంటీఏ కోసం వెతుకుతోంది. ఎంబ్రేయర్ ఫిబ్రవరిలో బెంగళూరులో ఈ C-390 మిలీనియం మల్టీ మిషన్ టాక్టికల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ను ప్రదర్శించింది. ఈ విమానానికి సంబంధించి మహీంద్రా, టాటా గ్రూప్తో ఎంబ్రేయర్ చర్చలు జరుపుతోంది. కానీ, శుక్రవారం మహీంద్రా ముందంజ వేసి డీల్ను ప్రకటించింది. రెండు కంపెనీల మధ్య ఎంవోయూ కుదిరింది. ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ప్యాసింజర్ జెట్ తయారీ సంస్థ ఎంబ్రేయర్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ,మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్ ఈ ఒప్పందంపై కలిసి పని చేస్తాయి. ఈ ఒప్పందం పట్ల ఆనంద్ మహీంద్రా చాలా సంతోషంగా ఉన్నారని ట్విట్టర్లో ట్వీట్ చేశారు. దాని సహాయంతో మేము ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అవసరాలను తీర్చగలుగుతాము. ఎయిర్ ఫోర్స్ త్వరలో ఎంటీఏ కోసం టెండర్ జారీ చేయబోతోంది. ఇందులో మా జాయింట్ వెంచర్ కూడా పాల్గొంటుంది.
ఇటీవల, టాటా గ్రూప్ H125 సింగిల్ ఇంజన్ హెలికాప్టర్ను తయారు చేయడానికి విమానాల తయారీ కంపెనీ ఎయిర్బస్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం, వడోదరలో ఉన్న అసెంబ్లీ లైన్లో 40 C295 రవాణా విమానాలను కూడా తయారు చేస్తారు. ఇక్కడ తయారైన హెచ్125 హెలికాప్టర్లను కూడా ఎగుమతి చేస్తామని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. ప్రస్తుతం, భారతదేశంలో ఇటువంటి 800 వరకు హెలికాప్టర్లకు తక్షణ డిమాండ్ ఉంది. C-390 బ్రెజిలియన్ వైమానిక దళం ఉపయోగిస్తుంది. దీని తరువాత, దీనిని పోర్చుగల్, హంగరీ, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్, దక్షిణ కొరియా సైన్యాలు కూడా కొనుగోలు చేశాయి. ఎంబ్రేయర్ ఇంతకుముందు DRDO, BSF, భారత ప్రభుత్వానికి అనేక రకాల విమానాలను అందించింది.
తాజావార్తలు
-
Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!