C-390 Aircraft: విదేశీ కంపెనీ సాయంతో త్వరలో విమానాలను తయారు చేయనున్న మహీంద్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
C-390 Aircraft: భారత వైమానిక దళం మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ (MTA) అవసరమని భావించింది. దీన్ని అర్థం చేసుకున్న ఆటో సెగ్మెంట్ దిగ్గజం మహీంద్రా గ్రూప్ బ్రెజిలియన్ కంపెనీ ఎంబ్రేయర్తో కలిసి సి 390 మిలీనియం విమానాలను తయారు చేయనున్నట్లు ప్రకటించింది. ఎయిర్ ఫోర్స్ అవసరాలకు అనుగుణంగా దీన్ని సిద్ధం చేసేందుకు ఇరు సంస్థలు అంగీకరించాయి. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఈ ఒప్పందాన్ని ప్రకటించారు.
Read Also:Childrens Kidnap: రాష్ట్రంలో పిల్లల కిడ్నాప్ ముఠాలు.. అంతా అవాస్తవమన్న పోలీసులు
Also Read
- Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
- IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. తుది జట్టులో దక్కని స్థానం.. కారణం ఇదే..
- Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
- Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
వైమానిక దళం 18 నుండి 30 టన్నుల బరువును ఎత్తగలిగే ఎంటీఏ కోసం వెతుకుతోంది. ఎంబ్రేయర్ ఫిబ్రవరిలో బెంగళూరులో ఈ C-390 మిలీనియం మల్టీ మిషన్ టాక్టికల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ను ప్రదర్శించింది. ఈ విమానానికి సంబంధించి మహీంద్రా, టాటా గ్రూప్తో ఎంబ్రేయర్ చర్చలు జరుపుతోంది. కానీ, శుక్రవారం మహీంద్రా ముందంజ వేసి డీల్ను ప్రకటించింది. రెండు కంపెనీల మధ్య ఎంవోయూ కుదిరింది. ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ప్యాసింజర్ జెట్ తయారీ సంస్థ ఎంబ్రేయర్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ,మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్ ఈ ఒప్పందంపై కలిసి పని చేస్తాయి. ఈ ఒప్పందం పట్ల ఆనంద్ మహీంద్రా చాలా సంతోషంగా ఉన్నారని ట్విట్టర్లో ట్వీట్ చేశారు. దాని సహాయంతో మేము ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అవసరాలను తీర్చగలుగుతాము. ఎయిర్ ఫోర్స్ త్వరలో ఎంటీఏ కోసం టెండర్ జారీ చేయబోతోంది. ఇందులో మా జాయింట్ వెంచర్ కూడా పాల్గొంటుంది.
ఇటీవల, టాటా గ్రూప్ H125 సింగిల్ ఇంజన్ హెలికాప్టర్ను తయారు చేయడానికి విమానాల తయారీ కంపెనీ ఎయిర్బస్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం, వడోదరలో ఉన్న అసెంబ్లీ లైన్లో 40 C295 రవాణా విమానాలను కూడా తయారు చేస్తారు. ఇక్కడ తయారైన హెచ్125 హెలికాప్టర్లను కూడా ఎగుమతి చేస్తామని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. ప్రస్తుతం, భారతదేశంలో ఇటువంటి 800 వరకు హెలికాప్టర్లకు తక్షణ డిమాండ్ ఉంది. C-390 బ్రెజిలియన్ వైమానిక దళం ఉపయోగిస్తుంది. దీని తరువాత, దీనిని పోర్చుగల్, హంగరీ, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్, దక్షిణ కొరియా సైన్యాలు కూడా కొనుగోలు చేశాయి. ఎంబ్రేయర్ ఇంతకుముందు DRDO, BSF, భారత ప్రభుత్వానికి అనేక రకాల విమానాలను అందించింది.
తాజావార్తలు
-
NBK 112: కొరటాల సినిమా కోసం రూల్స్ బ్రేక్ చేసిన బాలయ్య
-
Laundry Tips: వర్షాకాలంలో బట్టలు వాసన వస్తున్నాయా? సింపుల్గా ఇలా చేసేయండి!
-
Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. తుది జట్టులో దక్కని స్థానం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?