Andhra Pradesh: నా పెళ్లి ఆపండి.. ఫేస్బుక్లో కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బాలిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: కాలం మారింది.. పిల్లలను చదివించాలి.. వాళ్ల కాలపై వాళ్లు నిలబడాలి అని ఆలోచించేవారి సంఖ్య పెరుగుతుంది.. కానీ, అక్కడక్కడా ఇంకా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి.. చిన్న వయస్సులోనే గుట్టుచప్పుడు కాకుండా పెళ్లిళ్లు చేసేవారు కొందరైతే.. ఇక చదివింది చాలు.. పెళ్లి చేసుకోవాలంటూ బలవంతంగా చిన్న వయస్సులోనే చిన్నారులకు పెళ్లిళ్లు చేస్తున్నారు.. అయితే, చదువుపై మమకారం ఉన్న ఓ బాలిక.. ఎలాగైనా తన పెళ్లి ఆపాలనుకుంది.. మరింత చదువుకోవాలని అనుకుంది.. సోషల్ మీడియా వేదికగా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసింది.. దీంతో.. తన పెళ్లి ఆగిపోవడమే కాదు.. ఆ బాలిక చదువుకోవడానికి చర్యలు చేపట్టారు అధికారులు.
Read Also: Jyotiraditya Scindia: రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చారా..? రాహుల్పై విమర్శనాస్త్రాలు
Also Read
ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తన వివాహాన్ని అడ్డుకుని, చదువుకునే అవకాశాన్ని కల్పించాలని ఏలూరు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసింది ఓ బాలిక.. ఫేస్బుక్ ద్వారా కలెక్టర్కు ఫిర్యాదు పంపించింది ఏలూరు చెంచుల కాలనీకి చెందిన బాలిక.. దీంతో.. వెంటనే స్పందించి, బాలిక చదువుకునేందుకు చర్యలు చేపట్టారు ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్నవెంకటేష్.. తల్లిదండ్రులు లేని ఆ బాలికకు వివాహాం చేసేందుకు నిశ్చియించిన నానమ్మతాతయ్యలకు కౌన్సిలింగ్ ఇచ్చారు అధికారులు.. ఆ చిన్నారికి కావాల్సిన పాఠ్యపుస్తకాలు, బ్యాగ్, స్కూల్కి వెళ్లడానికి ఓ సైకిల్ను కూడా అధికారులు సమకూర్చినట్టు తెలుస్తోంది. అమ్మానాన్న లేని ఆ చిన్నారికి పెళ్లి చేసి తమ బాధ్యత తీర్చుకోవాలని నానమ్మతాతయ్య ప్రయత్నం చేశారు.. కానీ, ఆ చిన్నారి జీవితం ప్రమాదంలో పడుతుంది గ్రహించలేకపోయారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!