Elon Musk: అందరికీ తెలిస్తే ఆయన ఎలాన్ మస్క్ ఎలా అవుతారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేతగా ఎలాన్ మస్క్ ప్రపంచంలో చాలా కొద్ది మందికే పరిచయం. ఎప్పుడైతే ట్విటర్ కొనుగోలు చేశాడో సోషల్ మీడియా పుణ్యమాని ప్రపంచంలోని చివరి మనిషి వరకు ఆయన పేరు ప్రస్తుతం మార్మోగిపోతుంది. ట్విటర్ పగ్గాలు చేపట్టిన తొలి రోజే ఆయన ఆ కంపెనీ సీఈవో పరాగ్ అగర్వాల్ ను తొలగించారు. ఇప్పటి వరకు కొత్త సీఈవోను ప్రకటించలేదు. సీఈవోతో పాటు పలువురు కంపెనీ ప్రముఖులను తొలగిచడం సంచలనంగా మారింది. అంతే కాకుండా కంపెనీ ఖర్చు తగ్గించుకోవాలని సూచించినట్లు సమాచారం. ఆ క్రమంలోనే పనితీరు బాగోలేని ఉద్యోగులను తొలగించాలని.. అందుకు కొందరి పేర్లు సూచించాలని మేనేజర్లకు ఆదేశాలు సైతం జారీ చేశారు. దీంతో ట్విట్టర్ ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు.
Read Also: Satyadev Kancharana: సత్యదేవ్ పారితోషికం రెట్టింపు
Also Read
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
మరోవైపు ట్విట్టర్ మస్క్ మార్క్ భారీ మార్పులు చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయన ఆలోచనలు ఎవరికీ అర్థం కావడం లేదంటూ అనుకుంటున్నారు. ట్విట్టర్ కొత్త సీఈవో ఎవరో ప్రస్తుతానికి తనకు కూడా తెలియదని ఎలాన్ మస్క్ చెబుతున్నారు. కానీ, పరాగ్ అగర్వాల్ తదితరులను తొలగిస్తూ ఆయన సైన్ చేసిన ఎస్ ఈసీ పత్రం మాత్రం వేరే కథ వెల్లడిస్తుంది. అది ఎలాన్ మస్క్ను ట్విట్టర్ కొత్త సీఈవోగా చూపిస్తోంది.
Read Also: Hardeep Singh Puri: రష్యా నుంచి ఆయిల్ కొంటాం.. పాశ్చాత్య మీడియాకు కేంద్రమంత్రి దిమ్మతిరిగే సమాధానం
కంపెనీ పగ్గాల చేపట్టిన మస్క్.. పరాగ్, లీగల్ హెడ్ విజయ గద్దె, సీఎఫ్ఓ నెల్ సెగల్ పై వేటు వేశారు. ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్లను తొలగించిన తర్వాత మస్క్ ట్విట్టర్ బోర్డును రద్దు చేసి, కంపెనీకి ఏకైక డైరెక్టర్ అయ్యారు. అయితే, ఈ మార్పులు తాత్కాలికమే అని ఎలాన్ మస్క్ అంటున్నారు. ఈ లెక్కన ఆయన ట్విట్టర్ డైరెక్టర్ గా కూడా ఉండబోరని తెలుస్తోంది. అలాగే, సంస్థకు త్వరలోనే బోర్డును కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ట్విట్టర్ లో ప్రస్తుతం 7500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. మస్క్ 75 శాతం సిబ్బందిని తొలగిస్తారన్న వార్తలను మస్క్ ఖండించారు.
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!