Elon Musk: షాకింగ్ నిర్ణయం తీసుకున్న ఎలాన్ మస్క్.. ట్విట్టర్ ఇక ఫ్రీ కాదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk: సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ను సొంతం చేసుకున్న తర్వాత టెస్లా చీఫ్, ప్రముఖ వ్యాపార్త వేత్త ఎలాన్ మస్క్.. ట్విట్టర్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు.. ట్విట్టర్ను కాస్తా ఎక్స్ గా మార్చి.. పిట్టె స్థానంలో ఎక్స్ సింబల్ ఏర్పాటు చేశారు.. ఆ తర్వాత బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ ప్రవేశపెట్టబడింది. అంతకు ముందు వెరిఫైడ్ అకౌంట్లను పొందే బ్లూ టిక్ను పెయిడ్ సర్వీస్గా మార్చారు. ప్రకటనలపై వచ్చే రాబడి ధృవీకరించబడిన ఖాతాలకు జమ చేయబడుతుంది. అయితే, తాజాగా మరో కీలక మార్పు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఎక్స్ని ఉపయోగించే ప్రతి ఒక్కరూ నెలవారీ రుసుము చెల్లించవలసి ఉంటుందని మస్క్ పేర్కనడం ఇప్పుడు సంచలనంగా మారింది.. బాట్లు, ఫేక్ అకౌంట్ల సమస్యను అధిగమించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫీజు ఎంత? ఫీజు చెల్లించిన వారికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనేది దానిపై క్లారిటీ ఇవ్వలేదు మస్క్.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో చర్చల సందర్భంగా మస్క్.. ఎక్స్ వివరాలను వెల్లడించారు. ఎక్స్ ఇప్పుడు 550 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉంది, ప్రతిరోజూ 100 మరియు 200 మిలియన్ల మంది పోస్టింగ్ చేస్తున్నారని పేర్కొన్నాడు. అయితే ఈ వినియోగదారులలో ఎంత మంది నిజమైన వినియోగదారులు ఉన్నారు? మస్క్ ఎన్ని బోట్ ఖాతాలు ఉన్నాయో పేర్కొనలేదు. కృత్రిమ మేధస్సు, అధునాతన సాంకేతికత వల్ల కలిగే ప్రమాదాలు మరియు వాటి నివారణపై నెతన్యాహుతో మస్క్ చర్చించారు.
Also Read
- Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
- Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
- 204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
ఇక, ట్విట్టర్ను 44 బిలియన్ డార్లకు ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత.. ఆ ప్లాట్ఫారమ్లో గణనీయమైన మార్పులు చేశాడు. గతంలో నిషేధించబడిన ఖాతాలను తిరిగి రావడానికి అతను అనుమతించాడు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వంటి ఖాతాలు పునరుద్ధరించబడ్డాయి. ప్రముఖ వ్యక్తుల ఖాతాలను గుర్తించే బ్లూ టిక్ తొలగించబడింది. ప్రస్తుతం ఎవరైనా సబ్స్క్రయిబ్ చేసుకుంటే వారి పేరు పక్కన నీలిరంగు బ్యాడ్జ్ ఉంటుంది. వారి పోస్ట్లు ఎక్కువ మందికి కనిపిస్తాయి. సబ్స్క్రిప్షన్ తీసుకోని వారి పోస్టుల రీచ్ తక్కువగా ఉంటుంది. ఈ మార్పులు ఎక్స్ ప్లాట్ఫారమ్లో బాట్ల వినియోగాన్ని తగ్గిస్తాయని మస్క్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఎక్స్ యునైటెడ్ స్టేట్స్లో మనీ ట్రాన్స్మిటర్ కావడానికి లైసెన్స్ల కోసం దరఖాస్తు చేసింది. పబ్లిక్ రికార్డుల ప్రకారం ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాల్లో అనుమతులు జారీ చేయబడ్డాయి. అయితే, ఇప్పటి వరకూ ట్వీట్ డెక్ సర్వీసులు ఉచితంగా లభిస్తుండగా.. వాటిని పెయిడ్ సర్వీసులుగా మారుస్తున్నట్లు ఎలాన్ మస్క్ పేర్కొనడం సంచలనంగా మారింది.. ఇప్పటికే ఎక్స్కు పోటీగా కొన్ని ప్లాట్ఫారమ్లో అందుబాటులోకి రాగా.. మస్క్ నిర్ణయంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
-
Maharashtra: 200 ఏళ్ల తర్వాత కుటుంబంలో ఆడబిడ్డ జననం.. అంబరాన్నంటిన సంబరాలు
-
Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!