Elon Musk: ఎలాన్ మస్క్ దాతృత్వం.. భారత సంతతి డాక్టర్కు భారీ సాయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోవిడ్ మనుషుల ప్రాణాలతో ఎలా చెలగాటం ఆడిందో అందరికీ తెలిసిందే. దాని బారిన పడిన వాళ్లు ఎందురో మృత్యువాతపడ్డారు. అనేక కుటుంబాల్లో విషాదాలు నింపింది. ఇక కరోనా కాలంలో ప్రభుత్వాలు లాక్డౌన్లు విధించడంతో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో ఇప్పటికీ మరిచిపోలేని ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక ఆయా సంస్థల్లో పని చేసిన ఉద్యోగులు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక వైద్యులైతే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు చూశాం. అలా మాట్లాడిన వారు చిక్కుల్లో కూడా పడ్డారు. కెనడాలో భారత సంతతికి చెందిన ఓ వైద్యురాలు కూడా ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు గుప్పించి న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఇది కూడా చదవండి: Arvind Kejriwal Arrest: భారత్ హెచ్చరికతో మారిన జర్మనీ స్వరం..
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
కరోనా మహమ్మారి విజృంభణతో ప్రపంచమంతా స్తంభించిపోయింది. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి కష్టాలను చూసిన కెనడాలోని ఓ వైద్యురాలు అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేశారు. దీంతో ఆమె ఇబ్బందులు పాలయ్యారు. వైద్యవర్గాలు సైతం ఆమెను తప్పుబట్టాయి. కోర్టులో దావా వేశాయి. ఫలితంగా మహిళా వైద్యురాలు ఆ ఫీజులు భరించలేక నిధులను సమీకరించాల్సిన దుస్థితి తలెత్తింది. దీంతో వైద్యురాలకు బిలియనీర్ ఎలాన్ మస్క్ అండగా నిలిచారు. తన వంతుగా సాయం చేసేందుకు ముందుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Ram Charan: డల్లాస్ మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు
కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా కెనడా ప్రభుత్వం 2020లో లాక్డౌన్లు విధించింది. అనంతరం వ్యాక్సినేషన్ను తప్పనిసరి చేసింది. దీంతో సామాన్యులు ఇబ్బంది పడటంతో భారత సంతతి వైద్యురాలు కుల్విందర్ కౌర్ గిల్ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించారు. దీంతో వైద్యవర్గాలు, మీడియా ఆమెపై కోర్టుకు వెళ్లాయి. దీన్ని సవాల్ చేసిన కుల్విందర్.. తనపై కావాలనే కుట్రపూరితంగా బురద జల్లుతున్నారని న్యాయస్థానంతో దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆమెను తప్పుబట్టింది. వారి లీగల్ ఖర్చులన్నీ కలిపి మూడు లక్షల కెనడా డాలర్లు (సుమారు రూ.1.85 కోట్లు) చెల్లించాలని ఆమెకు ఆదేశించింది. దీనికి ఈ మార్చి 31 గడువుగా విధించింది. న్యాయస్థానం ఆదేశాలతో ఆమె ఖంగుతింది. ఇప్పటి వరకు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవడానికే తాను సంపాదించిందంతా ఖర్చయిపోయిందని కుల్విందర్ వాపోయారు. పైగా అప్పులు కూడా చేయాల్సి వచ్చిందని తెలిపారు.
ఇది కూడా చదవండి: Mahabubnagar: ముగిసిన మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్
కోర్టు విధించిన జరిమానా చెల్లించడానికి ఆన్లైన్ వేదికగా నిధుల సమీకరణను ఆమె ప్రారంభించారు. దీంతో ఆమెకు దాతలు మద్దతుగా నిలిచారు. ఇప్పటి వరకు రెండు లక్షల కెనడా డాలర్లకు పైగా సమకూర్చారు. ఈ విషయం ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ దృష్టికి వెళ్లింది. వాక్ స్వాతంత్ర్యాన్ని రక్షించడంలో భాగంగా ఆమెకు సాయం చేస్తానని ముందుకొచ్చారు. మిగిలిన మొత్తాన్ని తాను అందజేస్తానని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!