ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది.. అదే ట్రెండ్ నడుస్తుంది.. పెట్రోల్ కు సంబందించిన వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఈవీ వాహనాలు మార్కెట్ లోకి వస్తున్నాయి.. ఇక ప్రభుత్వాలు కూడా అదే విధంగా ఇందన వాహనాలకు చెక్ పెట్టేలా చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు.. ప్రపంచంలో ఈవీ వాహనాల మార్కెట్లో అమెరికా, చైనా తర్వాత స్థానంలో భారతదేశం ఉందంటే దేశంలో ఈవీ వాహనాలను జనాలు ఎంతగా వాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ముఖ్యంగా ఫోర్ వీలర్స్తో పోల్చుకుంటే ద్విచక్ర వాహనాల్లో ఈవీ వాహనాల వృద్ధి అధికంగా ఉంది.
అయితే ద్విచక్ర వాహనాల్లో కూడా స్కూటర్లు ఎక్కువగా ప్రజలు ఆకర్షిస్తున్నాయి. దీంతో ప్రముఖ స్కూటర్ తయారీదారుల నుంచి స్టార్టప్ కంపెనీల వరకూ ఈవీ వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి.. పెట్రోల్ లో కొన్ని ప్రముఖ కంపెనీలు కూడా ఈవీ వాహనాల రిలీజ్ చేయడంలో వెనుకంజలో ఉన్నాయి… ఈ క్రమంలో ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ వెస్పా ఈవీ వెర్షన్లో అందుబాటులోకి వస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వెస్పా ఈవీ వెర్షన్ గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
త్వరలో పియాజియో 1 ప్లస్ పేరుతో ఈవీ వాహనాల మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తుంఆది. ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్తో, పియాజియో ఈ స్కూటర్ని ఆధునిక ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రూపొందించింది. విశేషమైన శ్రేణి, అసాధారణమైన ఫీచర్ల శ్రేణిని అందిస్తుంది. పియాజియో 1 ప్లస్ ఒక్కసారి ఛార్జింగ్తో 100 కిమీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ ప్రతనిధులు చెబుతున్నారు..
ఈ బైకు ఫీచర్స్..
పియాజియో 1 ప్లస్ సాధారణ, ఫాస్ట్ ఛార్జింగ్ ఎంపికలను కలిగి ఉన్న బహుముఖ ఛార్జింగ్ సిస్టమ్తో వస్తుంది. అంటే ఈ స్కూటర్ను తక్కువ సమయంలో సౌకర్యవంతంగా ఛార్జ్ చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రిమోట్ యాక్సెస్, ఎల్ఈడీ లైట్లు, స్టార్ట్ బటన్, డిజిటల్ స్పీడోమీటర్, డిజిటల్ ఓడోమీటర్, యూఎస్బీ పోర్ట్, మల్టిపుల్ రైడింగ్ మోడ్లు వంటి అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది..
ధరలు..
పియాజియో వన్ ప్ల ధర సుమారు రూ.1.5 లక్షలుగా ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నాయి. అంతేకాకుండా వినియోగదారులను ఆకర్షించే విధంగా సులభమైన ఈఎంఐ ప్లాన్లు కూడా ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు..
