CMD Raghuma Reddy : గణేష్ మండపాల వద్ద విద్యుత్ భద్రతా చర్యలు పాటించండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా, భద్రతా పరంగా విద్యుత్ శాఖ చేపట్టిన పనులను చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రఘుమా రెడ్డి సమీక్షించారు. సెప్టెంబర్ 18 నుండి ప్రారంభమయ్యే గణేష్ పండుగ ఉత్సవాలు 11 రోజుల పాటు నిర్వహిస్తారు. మండపాలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా మరియు భద్రతా కోసం తమ సంస్థ తగు ఏర్పాట్లు చేసిందన్నారు. సామాన్య ప్రజలు, భక్తులు మరియు మండప నిర్వాహకులు మండపాల వద్ద విద్యుత్ భద్రతా చర్యలు పాటించాలని కోరారు.
గణేష్ మండపాల వద్ద పాటించాల్సిన విద్యుత్ భద్రతా జాగ్రత్తలు:
Also Read
- ICC: క్రికెట్ ప్రపంచంలో ఐసీసీకి ఊహించని షాక్.. తిరగబడ్డ రెండు దేశాలు..
- KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
- Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
1. మండపాలకు విద్యుత్ సరఫరా కనెక్షన్ కోసం సామాన్యులు స్తంభాలు ఎక్కరాదు. సంస్థ సిబ్బంది ద్వారానే విద్యుత్ కనెక్షన్ పొందగలరు.
2. ISI మార్క్ కలిగిన ప్రామాణిక విద్యుత్ వైర్లను మాత్రమే వాడాలి. ఎలాంటి జాయింట్ వైర్లు వాడరాదు.
3. తగినంత కెపాసిటీ కలిగిన MCB తప్పనిసరిగా వాడాలి. ఇది విద్యుత్ ప్రమాదాల నుండి రక్షణ ఇస్తుంది.
4. మండపాల్లో విద్యుత్ సంబంధిత పనులు చేసేటప్పుడు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. విద్యుత్ వైర్ల/ పోల్స్, ఇతర ప్రమాదకర విద్యుత్ పరికరాల నుండి పిల్లల్ని దూరంగా ఉంచండి.
5. ఒక వేళ ఎవరికైనా విద్యుత్ షాక్ తగిలితే వారికి వెంటనే వైద్య సహాయం అందించి, ఆ ప్రమాదం గురించి దగ్గరలోని విద్యుత్ సిబ్బందికి తెలియజేయగలరు.
6. విద్యుత్ వైరింగ్ లో ఎక్కడైనా లీకేజ్ ఉంటే, వర్షాలు కురిసినప్పుడు తేమ వలన షాక్ కలిగే అవకాశమున్నది. కనుక మండప నిర్వాహకులు ప్రతి రోజు తప్పనిసరిగా వైరింగ్ ను క్షుణ్ణంగా పరిశీలించాలి.
7. విద్యుత్ లైన్స్ ఎక్కడైనా తెగి పడ్డా, మరియు ఇతర అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు వెంటనే 1912 / 100 / సమీప ఫ్యుజ్ ఆఫ్ కాల్ కు కాల్ చేసి విద్యుత్ సిబ్బందికి తెలియజేయగలరు.
విద్యుత్ వినియోగదారులకు, సామాన్య ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ రఘుమా రెడ్డి, స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ పండుగను సుఖసంతోషాలతో సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
తాజావార్తలు
-
ICC: క్రికెట్ ప్రపంచంలో ఐసీసీకి ఊహించని షాక్.. తిరగబడ్డ రెండు దేశాలు..
-
Lal Darwaza Rangam : లాల్ దర్వాజా రంగంలో భవిష్యవాణి.. ‘భయపడొద్దు’ అన్న మహంకాళి..!
-
RGV నుంచి సంచలన సినిమా.. T-Series నిర్మాణంలో ‘పోలీస్ కంపెనీ’!
-
Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
-
CRS Portal : హైదరాబాద్లో గుడ్న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!