Fraud : హబ్సిగూడకు చెందిన ఓ వృద్ధురాలు అశ్రద్ధగా నమ్మిన పరిచయం ఆమె జీవిత savingsనే గుబ్బుచేసింది. 2022లో ఆమెకు నాగేశ్వర శర్మ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఆస్తుల విభాగంలో మేనేజర్గా పనిచేస్తున్నానని చెప్పిన అతను, బ్యాంక్ వేలంలో బంగారం, ఫ్లాట్లు, కార్లు తక్కువ ధరకే లభిస్తాయని వృద్ధురాలిని నమ్మబలికాడు. వృద్ధురాలి నమ్మకాన్ని పూర్తిగా పొందిన నాగేశ్వర శర్మ, ఆమెకు నాలుగు ఫ్లాట్లు, నాలుగు ప్లాట్లు, రెండు కార్లు వేలం ద్వారా ఇప్పించగలనని వాగ్దానం చేశాడు. దీనిపై నకిలీ డాక్యుమెంట్లు కూడా చూపించాడు.
Nagachithanya : నాగచైతన్య-శోభితపై ఆ రూమర్లు.. అంతా ఫేకేనా..?
ఈ నమ్మకంతో వృద్ధురాలు పలు దఫాల్లో మొత్తం రూ.5.71 కోట్ల రూపాయలు అతని ఖాతాలో జమ చేసింది. నెలలు గడుస్తున్నా రిజిస్ట్రేషన్ జరగకపోవడంతో అనుమానపడిన ఆమె, అతన్ని నిలదీసింది. అయితే అక్కడే అసలు రూపం బయటపడింది – వృద్ధురాలిని చంపేస్తానని బెదిరింపులకు దిగాడు నాగేశ్వర శర్మ. ఈ ఘటనతో తీవ్ర మానసిక క్షోభకు లోనైన వృద్ధురాలు చివరికి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మోసగాడిని పట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.
Gold Rates: అక్షయ తృతీయ వేళ కనికరించిన పసిడి ధరలు.. ఎంత తగ్గిందంటే?