Chicken Shops Closed: మాంస ప్రియులకు బిగ్ షాక్.. చికెన్ షాపులు బంద్.. ఎప్పటినంచంటే..
- ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్..
- పిలుపునిచ్చిన రాష్ట్ర చికెన్ షాపుల యజమానుల సంఘం..
- ధర్నాలు చేపడతామని హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోని మాంసం ప్రియులకు షాక్ ఇచ్చేలా రాష్ట్ర చికెన్ షాపుల యజమానుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పౌల్ట్రీ కంపెనీల తీరుకు నిరసనగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ విక్రయాలను నిలిపివేస్తూ బంద్ పాటించాలని నిర్ణయించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చికెన్ వ్యాపారులు పౌల్ట్రీ కంపెనీల విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తమకు ఇచ్చే కమీషన్ (మార్జిన్) విషయంలో కంపెనీలు అనుసరిస్తున్న తీరు వల్ల చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని ‘తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్’ ఆరోపిస్తోంది. గతంలో ఇచ్చే కమీషన్ కంటే ప్రస్తుతం కిలోకు రూ. 20 వరకు తగ్గించడం తమకు పెను భారంగా మారిందని వారు పేర్కొంటున్నారు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ప్రస్తుతం మార్కెట్లో కిలో చికెన్ ధర రూ. 360 నుంచి రూ. 370 వరకు పలుకుతోంది. సాధారణంగా ధరలు పెరిగినప్పుడు వ్యాపారులకు వచ్చే లాభం కూడా పెరగాలి.. కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. ఒకవైపు వినియోగదారులపై భారం పెరుగుతున్నా, మరోవైపు కంపెనీలు తమ మార్జిన్ను తగ్గించడంతో షాపుల నిర్వహణ కష్టతరమవుతోందని విక్రయదారులు వాపోతున్నారు. వేసవి కాలం కావడంతో కోళ్ల ఉత్పత్తి వ్యయం పెరిగిందని, ఆ భారాన్ని అంతా తమపైనే వేస్తున్నారని వారు మండిపడుతున్నారు.
Also Read:Jr NTR : ఎన్టీఆర్ గ్రాండ్ పార్టీ.. డ్రాగన్కు స్పెషల్ ట్రీట్!
ఈ సమస్యపై ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఏప్రిల్ 1 నుంచి దుకాణాలు మూసివేయడమే కాకుండా, పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని అసోసియేషన్ హెచ్చరించింది. మార్జిన్ పెంచే వరకు తమ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేసింది. చికెన్ షాపులు నిరవధికంగా బంద్ అయితే సామాన్య ప్రజలకు మాంసం దొరకడం కష్టమవుతుంది. ఇది పరోక్షంగా ఇతర మాంసాహార ఉత్పత్తుల ధరలు పెరగడానికి దారితీయవచ్చు. ప్రభుత్వం , పౌల్ట్రీ కంపెనీలు వెంటనే స్పందించి ఈ గొడవను పరిష్కరించాలని సామాన్యులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!