Liquor Scam: ఛత్తీస్గఢ్లో రూ.2వేల కోట్ల మద్యం కుంభకోణం.. ఐఏఎస్ అధికారిదే కీలక పాత్ర!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor Scam: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీగా లిక్కర్ అక్రమాలు జరిగాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకటింది. ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణంలో భారీ అవినీతి బట్టబయలైనట్టు ఈడీ ఆరోపణలు చేసింది. ఏకంగా రూ.2వేల కోట్ల అవినీతిని గుర్తించినట్టు వెల్లడించింది. ఈ అవినీతి సొమ్మును ఎన్నికలకు మళ్లిస్తున్నట్లు ఆరోపణలు చేసింది. లిక్కర్ స్కాంలో కాంగ్రెస్ నేత, రాయ్పూర్ మేయర్ ఐజాజ్ ధేబర్ సోదరుడు అన్వర్ ధేబర్ను ఈడీ మే 6న అరెస్టు చేసింది. ఈ సందర్భంగా మనీ లాండరింగ్కు సంబంధించిన ఆధారాలను కనుగొన్నట్టు తెలిపింది. రాష్ట్రంలో విక్రయించే ప్రతి మద్యం సీసాపై అక్రమ లాభార్జన ధ్యేయంగా భారీగా జరిగిన అవకతవకల్లో ఉన్నత స్థాయి రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు ఉన్నట్లు ఈడీ తెలిపింది. 2019-2022 మధ్యకాలంలో రూ.2వేల కోట్ల మేర భారీ అవినీతి చోటుచేసుకున్నట్టు ఈడీ వెల్లడించింది. ఐఏఎస్ అధికారి అనిల్ టుటేజా ఇందులో కీలక పాత్ర పోషించారని, రాయ్పుర్ మేయర్ సోదరుడైన అన్వర్ ధేబర్ హస్తం కూడా ఇందులో ఉన్నట్లు పేర్కొంది.
Read Also: Gold Mine Fire: బంగారు గనిలో అగ్ని ప్రమాదం.. 27 మంది మృతి
Also Read
- Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
తాము జరిపిన విచారణలో రాష్ట్రంలో జరిగిన మద్యం విక్రయాల్లో 30-40 శాతం అక్రమంగానే సాగినట్లు ఈడీ పేర్కొంది. రాయ్పుర్లోని ప్రత్యేక న్యాయస్థానంలో శనివారం ఫిర్యాదు దాఖలు చేసిన ఈడీ.. మద్యం వ్యాపారి అన్వర్ ధేబర్ రిమాండ్కు ఆదేశించాలని కోర్టును కోరింది. శనివారం రాయ్పుర్లోని ఓ హోటల్లో అన్వర్ ధేబర్ను ఈడీ అరెస్ట్ చేసింది. హవాలా ప్రత్యేక కోర్టు ఆయనను నాలుగు రోజుల ఈడీ కస్టడీకి ఆదేశించింది. ఏడుసార్లు సమన్లు జారీ చేసినా విచారణకు హాజరు కాకుండా బినామీ సిమ్కార్డులు మారుస్తూ తప్పించుకొంటున్నందున అన్వర్ను అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఈ కుంభకోణంలో ఐఏఎస్ కీలక పాత్ర పోషించినట్లు ఈడీ పేర్కొంది. 2003 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అనిల్ టుటేజా ప్రస్తుతం రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య విభాగం సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు.
తాజావార్తలు
-
Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
-
Yadhu Vamsi: ‘నా కొడుకు సాధించాడు’.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
-
IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
-
OPPO K14x 5G: ఒప్పో K14x 5G.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!