Hemant Soren: జార్ఖండ్ సీఎం నివాసానికి ఈడీ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hemant Soren: భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం సోమవారం జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధికారిక నివాసానికి చేరుకుంది. ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసానికి ఈడీ అధికారులు చేరుకోగా.. ఆయన తన ఇంట్లో లేరని, ఎక్కడికో వెళ్లారని ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈడీ బృందం ఉదయం 7 గంటలకు హేమంత్ సోరెన్ ఇంటికి చేరుకుంది. ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. భూ కుంభకోణంలో తాజా ఇన్పుట్ల ఆధారంగా ఢిల్లీలోని ఆయన ఇంట్లో సోదాలు జరిగాయని ఈడీ పేర్కొంది. భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ నెల 27న ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. జనవరి 29 లేదా 31 తేదీల్లో అందుబాటులో ఉండాలని కోరుతూ స్పందని తెలియజేయాలని ఈడీ పేర్కొంది. జనవరి 29 లేదా జనవరి 31న సోరెన్ విచారణకు రాకుంటే మళ్లీ ఈడీ ఆయన కోసం వస్తుందని తెలిపింది.
Read Also: Impeachment Motion: మాల్దీవుల అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానానికి సిద్ధమైన ప్రతిపక్షం
Also Read
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
- Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
జనవరి 27 నుంచి 31 లోపు ఏదైనా ఒకరోజు హేమంత్ సోరెన్ విచారణకు హాజరయ్యేలా ఈడీ అవకాశం కల్పించింది. ఈ నోటీసులపై సీఎం సోరెన్ ఇంతవరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు సోరెన్ నివాసానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. అప్పటికే హేమంత్ సోరెన్ ఇంటి నుంచి వేరే ప్రదేశానికి వెళ్లిపోయినట్లు సమాచారం. ఎక్కడ ఉన్నారో గుర్తించేందుకు యత్నిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. భూ కుంభకోణంలో తాజా ఇన్పుట్ల ఆధారంగా ఢిల్లీలోని ఆయన ఇంట్లో సోదాలు జరిగాయని ఈడీ పేర్కొంది. ప్రక్రియ ప్రకారం, సోదాలు జరుగుతున్నప్పుడు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేయబడుతుంది. సోరెన్ హాజరు కానందున, ఈడీ ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేయలేకపోయింది. ఆ తర్వాత ఏడుగురు ఈడీ అధికారుల బృందం జార్ఖండ్ భవన్కు చేరుకుని సోరెన్ ఆచూకీ గురించి ఆరా తీసింది. ముఖ్యమంత్రి అక్కడే ఉంటున్నారా అని జార్ఖండ్ భవన్ సిబ్బందిని ప్రశ్నించగా.. లేదంటూ సమాధానమిచ్చారు.
Read Also: Allahabad High Court: కూలి పని చేసైనా భార్యకు భరణం చెల్లించాల్సిందే..
జనవరి 20న రాంచీలోని సోరెన్ అధికారిక నివాసానికి దర్యాప్తు అధికారులు వెళ్లిన తర్వాత ఈడీ సోరెన్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. దాదాపు ఏడు గంటలపాటు దర్యాప్తు అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) కింద స్టేట్మెంట్ను నమోదు చేశారు. ఆ రోజు విచారణ పూర్తికాకపోవడంతో తాజాగా సమన్లు జారీ చేసినట్లు తెలిసింది. ఇప్పటివరకు ఈడీ ఆయనకు తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేసింది.
తాజావార్తలు
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?