Hemant Soren: జార్ఖండ్ సీఎం నివాసానికి ఈడీ అధికారులు
Hemant Soren: భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం సోమవారం జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధికారిక నివాసానికి చేరుకుంది. ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసానికి ఈడీ అధికారులు చేరుకోగా.. ఆయన తన ఇంట్లో లేరని, ఎక్కడికో వెళ్లారని ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈడీ బృందం ఉదయం 7 గంటలకు హేమంత్ సోరెన్ ఇంటికి చేరుకుంది. ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. భూ కుంభకోణంలో తాజా ఇన్పుట్ల ఆధారంగా ఢిల్లీలోని ఆయన ఇంట్లో సోదాలు జరిగాయని ఈడీ పేర్కొంది. భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ నెల 27న ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. జనవరి 29 లేదా 31 తేదీల్లో అందుబాటులో ఉండాలని కోరుతూ స్పందని తెలియజేయాలని ఈడీ పేర్కొంది. జనవరి 29 లేదా జనవరి 31న సోరెన్ విచారణకు రాకుంటే మళ్లీ ఈడీ ఆయన కోసం వస్తుందని తెలిపింది.
Read Also: Impeachment Motion: మాల్దీవుల అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానానికి సిద్ధమైన ప్రతిపక్షం
Also Read
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
- Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్
- Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
- Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
జనవరి 27 నుంచి 31 లోపు ఏదైనా ఒకరోజు హేమంత్ సోరెన్ విచారణకు హాజరయ్యేలా ఈడీ అవకాశం కల్పించింది. ఈ నోటీసులపై సీఎం సోరెన్ ఇంతవరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు సోరెన్ నివాసానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. అప్పటికే హేమంత్ సోరెన్ ఇంటి నుంచి వేరే ప్రదేశానికి వెళ్లిపోయినట్లు సమాచారం. ఎక్కడ ఉన్నారో గుర్తించేందుకు యత్నిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. భూ కుంభకోణంలో తాజా ఇన్పుట్ల ఆధారంగా ఢిల్లీలోని ఆయన ఇంట్లో సోదాలు జరిగాయని ఈడీ పేర్కొంది. ప్రక్రియ ప్రకారం, సోదాలు జరుగుతున్నప్పుడు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేయబడుతుంది. సోరెన్ హాజరు కానందున, ఈడీ ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేయలేకపోయింది. ఆ తర్వాత ఏడుగురు ఈడీ అధికారుల బృందం జార్ఖండ్ భవన్కు చేరుకుని సోరెన్ ఆచూకీ గురించి ఆరా తీసింది. ముఖ్యమంత్రి అక్కడే ఉంటున్నారా అని జార్ఖండ్ భవన్ సిబ్బందిని ప్రశ్నించగా.. లేదంటూ సమాధానమిచ్చారు.
Read Also: Allahabad High Court: కూలి పని చేసైనా భార్యకు భరణం చెల్లించాల్సిందే..
జనవరి 20న రాంచీలోని సోరెన్ అధికారిక నివాసానికి దర్యాప్తు అధికారులు వెళ్లిన తర్వాత ఈడీ సోరెన్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. దాదాపు ఏడు గంటలపాటు దర్యాప్తు అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) కింద స్టేట్మెంట్ను నమోదు చేశారు. ఆ రోజు విచారణ పూర్తికాకపోవడంతో తాజాగా సమన్లు జారీ చేసినట్లు తెలిసింది. ఇప్పటివరకు ఈడీ ఆయనకు తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేసింది.
తాజావార్తలు
-
Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. “ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0” ప్రారంభం.!
-
IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
-
Realme C100x: రియల్మీ C100x భారత్లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్ప్రైజ్!
-
Buchi Babu: ఫ్యాన్స్ అరుపుల మధ్య అదిరిపోయే అప్డేట్… ‘పెద్ది’ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన బుచ్చిబాబు.. మెగా ఫ్యాన్స్కు పండగే!
-
Ashu Reddy Case : నటి అషు రెడ్డి కేసులో కీలక అంశాలు.. విస్తుపోయే నిజాలు.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!