Hemant Soren: జార్ఖండ్ సీఎం నివాసానికి ఈడీ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hemant Soren: భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం సోమవారం జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధికారిక నివాసానికి చేరుకుంది. ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసానికి ఈడీ అధికారులు చేరుకోగా.. ఆయన తన ఇంట్లో లేరని, ఎక్కడికో వెళ్లారని ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈడీ బృందం ఉదయం 7 గంటలకు హేమంత్ సోరెన్ ఇంటికి చేరుకుంది. ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. భూ కుంభకోణంలో తాజా ఇన్పుట్ల ఆధారంగా ఢిల్లీలోని ఆయన ఇంట్లో సోదాలు జరిగాయని ఈడీ పేర్కొంది. భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ నెల 27న ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. జనవరి 29 లేదా 31 తేదీల్లో అందుబాటులో ఉండాలని కోరుతూ స్పందని తెలియజేయాలని ఈడీ పేర్కొంది. జనవరి 29 లేదా జనవరి 31న సోరెన్ విచారణకు రాకుంటే మళ్లీ ఈడీ ఆయన కోసం వస్తుందని తెలిపింది.
Read Also: Impeachment Motion: మాల్దీవుల అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానానికి సిద్ధమైన ప్రతిపక్షం
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
జనవరి 27 నుంచి 31 లోపు ఏదైనా ఒకరోజు హేమంత్ సోరెన్ విచారణకు హాజరయ్యేలా ఈడీ అవకాశం కల్పించింది. ఈ నోటీసులపై సీఎం సోరెన్ ఇంతవరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు సోరెన్ నివాసానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. అప్పటికే హేమంత్ సోరెన్ ఇంటి నుంచి వేరే ప్రదేశానికి వెళ్లిపోయినట్లు సమాచారం. ఎక్కడ ఉన్నారో గుర్తించేందుకు యత్నిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. భూ కుంభకోణంలో తాజా ఇన్పుట్ల ఆధారంగా ఢిల్లీలోని ఆయన ఇంట్లో సోదాలు జరిగాయని ఈడీ పేర్కొంది. ప్రక్రియ ప్రకారం, సోదాలు జరుగుతున్నప్పుడు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేయబడుతుంది. సోరెన్ హాజరు కానందున, ఈడీ ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేయలేకపోయింది. ఆ తర్వాత ఏడుగురు ఈడీ అధికారుల బృందం జార్ఖండ్ భవన్కు చేరుకుని సోరెన్ ఆచూకీ గురించి ఆరా తీసింది. ముఖ్యమంత్రి అక్కడే ఉంటున్నారా అని జార్ఖండ్ భవన్ సిబ్బందిని ప్రశ్నించగా.. లేదంటూ సమాధానమిచ్చారు.
Read Also: Allahabad High Court: కూలి పని చేసైనా భార్యకు భరణం చెల్లించాల్సిందే..
జనవరి 20న రాంచీలోని సోరెన్ అధికారిక నివాసానికి దర్యాప్తు అధికారులు వెళ్లిన తర్వాత ఈడీ సోరెన్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. దాదాపు ఏడు గంటలపాటు దర్యాప్తు అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) కింద స్టేట్మెంట్ను నమోదు చేశారు. ఆ రోజు విచారణ పూర్తికాకపోవడంతో తాజాగా సమన్లు జారీ చేసినట్లు తెలిసింది. ఇప్పటివరకు ఈడీ ఆయనకు తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేసింది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!