Hemant Soren: జార్ఖండ్ సీఎం నివాసానికి ఈడీ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hemant Soren: భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం సోమవారం జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధికారిక నివాసానికి చేరుకుంది. ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసానికి ఈడీ అధికారులు చేరుకోగా.. ఆయన తన ఇంట్లో లేరని, ఎక్కడికో వెళ్లారని ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈడీ బృందం ఉదయం 7 గంటలకు హేమంత్ సోరెన్ ఇంటికి చేరుకుంది. ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. భూ కుంభకోణంలో తాజా ఇన్పుట్ల ఆధారంగా ఢిల్లీలోని ఆయన ఇంట్లో సోదాలు జరిగాయని ఈడీ పేర్కొంది. భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ నెల 27న ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. జనవరి 29 లేదా 31 తేదీల్లో అందుబాటులో ఉండాలని కోరుతూ స్పందని తెలియజేయాలని ఈడీ పేర్కొంది. జనవరి 29 లేదా జనవరి 31న సోరెన్ విచారణకు రాకుంటే మళ్లీ ఈడీ ఆయన కోసం వస్తుందని తెలిపింది.
Read Also: Impeachment Motion: మాల్దీవుల అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానానికి సిద్ధమైన ప్రతిపక్షం
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
జనవరి 27 నుంచి 31 లోపు ఏదైనా ఒకరోజు హేమంత్ సోరెన్ విచారణకు హాజరయ్యేలా ఈడీ అవకాశం కల్పించింది. ఈ నోటీసులపై సీఎం సోరెన్ ఇంతవరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు సోరెన్ నివాసానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. అప్పటికే హేమంత్ సోరెన్ ఇంటి నుంచి వేరే ప్రదేశానికి వెళ్లిపోయినట్లు సమాచారం. ఎక్కడ ఉన్నారో గుర్తించేందుకు యత్నిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. భూ కుంభకోణంలో తాజా ఇన్పుట్ల ఆధారంగా ఢిల్లీలోని ఆయన ఇంట్లో సోదాలు జరిగాయని ఈడీ పేర్కొంది. ప్రక్రియ ప్రకారం, సోదాలు జరుగుతున్నప్పుడు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేయబడుతుంది. సోరెన్ హాజరు కానందున, ఈడీ ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేయలేకపోయింది. ఆ తర్వాత ఏడుగురు ఈడీ అధికారుల బృందం జార్ఖండ్ భవన్కు చేరుకుని సోరెన్ ఆచూకీ గురించి ఆరా తీసింది. ముఖ్యమంత్రి అక్కడే ఉంటున్నారా అని జార్ఖండ్ భవన్ సిబ్బందిని ప్రశ్నించగా.. లేదంటూ సమాధానమిచ్చారు.
Read Also: Allahabad High Court: కూలి పని చేసైనా భార్యకు భరణం చెల్లించాల్సిందే..
జనవరి 20న రాంచీలోని సోరెన్ అధికారిక నివాసానికి దర్యాప్తు అధికారులు వెళ్లిన తర్వాత ఈడీ సోరెన్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. దాదాపు ఏడు గంటలపాటు దర్యాప్తు అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) కింద స్టేట్మెంట్ను నమోదు చేశారు. ఆ రోజు విచారణ పూర్తికాకపోవడంతో తాజాగా సమన్లు జారీ చేసినట్లు తెలిసింది. ఇప్పటివరకు ఈడీ ఆయనకు తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేసింది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?