Hemant Soren: జార్ఖండ్ సీఎం నివాసానికి ఈడీ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hemant Soren: భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం సోమవారం జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధికారిక నివాసానికి చేరుకుంది. ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసానికి ఈడీ అధికారులు చేరుకోగా.. ఆయన తన ఇంట్లో లేరని, ఎక్కడికో వెళ్లారని ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈడీ బృందం ఉదయం 7 గంటలకు హేమంత్ సోరెన్ ఇంటికి చేరుకుంది. ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. భూ కుంభకోణంలో తాజా ఇన్పుట్ల ఆధారంగా ఢిల్లీలోని ఆయన ఇంట్లో సోదాలు జరిగాయని ఈడీ పేర్కొంది. భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ నెల 27న ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. జనవరి 29 లేదా 31 తేదీల్లో అందుబాటులో ఉండాలని కోరుతూ స్పందని తెలియజేయాలని ఈడీ పేర్కొంది. జనవరి 29 లేదా జనవరి 31న సోరెన్ విచారణకు రాకుంటే మళ్లీ ఈడీ ఆయన కోసం వస్తుందని తెలిపింది.
Read Also: Impeachment Motion: మాల్దీవుల అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానానికి సిద్ధమైన ప్రతిపక్షం
Also Read
జనవరి 27 నుంచి 31 లోపు ఏదైనా ఒకరోజు హేమంత్ సోరెన్ విచారణకు హాజరయ్యేలా ఈడీ అవకాశం కల్పించింది. ఈ నోటీసులపై సీఎం సోరెన్ ఇంతవరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు సోరెన్ నివాసానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. అప్పటికే హేమంత్ సోరెన్ ఇంటి నుంచి వేరే ప్రదేశానికి వెళ్లిపోయినట్లు సమాచారం. ఎక్కడ ఉన్నారో గుర్తించేందుకు యత్నిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. భూ కుంభకోణంలో తాజా ఇన్పుట్ల ఆధారంగా ఢిల్లీలోని ఆయన ఇంట్లో సోదాలు జరిగాయని ఈడీ పేర్కొంది. ప్రక్రియ ప్రకారం, సోదాలు జరుగుతున్నప్పుడు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేయబడుతుంది. సోరెన్ హాజరు కానందున, ఈడీ ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేయలేకపోయింది. ఆ తర్వాత ఏడుగురు ఈడీ అధికారుల బృందం జార్ఖండ్ భవన్కు చేరుకుని సోరెన్ ఆచూకీ గురించి ఆరా తీసింది. ముఖ్యమంత్రి అక్కడే ఉంటున్నారా అని జార్ఖండ్ భవన్ సిబ్బందిని ప్రశ్నించగా.. లేదంటూ సమాధానమిచ్చారు.
Read Also: Allahabad High Court: కూలి పని చేసైనా భార్యకు భరణం చెల్లించాల్సిందే..
జనవరి 20న రాంచీలోని సోరెన్ అధికారిక నివాసానికి దర్యాప్తు అధికారులు వెళ్లిన తర్వాత ఈడీ సోరెన్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. దాదాపు ఏడు గంటలపాటు దర్యాప్తు అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) కింద స్టేట్మెంట్ను నమోదు చేశారు. ఆ రోజు విచారణ పూర్తికాకపోవడంతో తాజాగా సమన్లు జారీ చేసినట్లు తెలిసింది. ఇప్పటివరకు ఈడీ ఆయనకు తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేసింది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!