సీఎం అయితే మాకేంటి..? అక్రమాల వల్లే అరెస్ట్.. ఈడీ కౌంటర్ అఫిడవిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi liquor case: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంతో ముడిపడిన మనీల్యాండరింగ్ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. కేజ్రీవాల్ పెద్ద ఎత్తున సాక్ష్యాధారాల ట్యాంపరింగ్కు పాల్పడ్డారని ఆరోపించింది. కుంభకోణం జరిగిన టైంలో ఏకంగా 173 సెల్ ఫోన్స్ ధ్వంసం చేయడంతో పాటు ఆధారాలను ధ్వంసం చేశారని కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది. కేజ్రీవాల్ కు ఏకంగా తొమ్మిది సార్లు నోటీసులు పంపినప్పటికీ ఆయన విచారణకు రాలేదని ఈడీ పేర్కొనింది. సమన్లను పదేపదే దాట వేశారు.. ఇదే సమయంలో అరెస్ట్ నుంచి రక్షణను ఇవ్వలేమని ఢిల్లీ హైకోర్టు కూడా తేల్చిచెప్పడంతో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశామని ఈడీ తెలిపింది.
Read Also: Ileana D’Cruz :అలసిపోయాను.. ఇక నా వల్ల కాదు
Also Read
- KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
- Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
కాగా, ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ నుంచి కేజ్రీవాల్కు రిలీఫ్ దొరకలేదు అందుకే అతడి ఇంట్లో సోదాలు నిర్వహించిన తర్వాత అరెస్ట్ చేశామని కౌంటర్ అఫిడవిట్లో ఈడీ వివరించింది. లోక్సభ ఎన్నికల సమయంలో అరెస్ట్ చేశారనే ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ… నిందితుడి స్థాయితో తమకు సంబంధం లేదు, సాక్ష్యాలను ఆధారంగా మాత్రమే చర్యలు తీసుకున్నామని వెల్లడించింది. నేరారోపణలు ఉన్న రాజకీయ నాయకులకు అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తే ఎన్నికల ప్రక్రియ సమగ్రతను దెబ్బ తీసినట్టేనని ఈడీ కామెంట్స్ చేసింది. ఆధారాలను బట్టి ఒక వ్యక్తిని అరెస్టు చేయడం స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల భావనను ఉల్లంఘించినట్టు కాదని చెప్పింది. కేజ్రీవాల్ వాదనతో ఏకీభవిస్తే నేరస్థులైన రాజకీయ నాయకులకు అరెస్టుల నుంచి మినహాయింపు లభిస్తుందని అనే భావన వస్తుందని ఈడీ చెప్పుకొచ్చింది.
Read Also: APL lockout: ఏపీ పేపర్ మిల్లు ఆకస్మిక లాకౌట్.. ఉన్నట్టుండి ఎందుకు..?
అయితే, ఈడీ కౌంటర్ అఫిడవిట్లోని అంశాలను ఆమ్ ఆద్మీ పార్టీ తిరస్కరించింది. దర్యాప్తు సంస్థ అన్నీ అబద్ధాలే చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అరవింద్ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని.. బీజేపీ రాజకీయ విభాగంగా ఈడీ మారిపోయి.. అబద్ధాలు చెప్పే యంత్రంగా ఈడీ తయారయ్యిందని ఆప్ విమర్శలు చేసింది.
తాజావార్తలు
-
Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
-
KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?