సీఎం అయితే మాకేంటి..? అక్రమాల వల్లే అరెస్ట్.. ఈడీ కౌంటర్ అఫిడవిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi liquor case: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంతో ముడిపడిన మనీల్యాండరింగ్ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. కేజ్రీవాల్ పెద్ద ఎత్తున సాక్ష్యాధారాల ట్యాంపరింగ్కు పాల్పడ్డారని ఆరోపించింది. కుంభకోణం జరిగిన టైంలో ఏకంగా 173 సెల్ ఫోన్స్ ధ్వంసం చేయడంతో పాటు ఆధారాలను ధ్వంసం చేశారని కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది. కేజ్రీవాల్ కు ఏకంగా తొమ్మిది సార్లు నోటీసులు పంపినప్పటికీ ఆయన విచారణకు రాలేదని ఈడీ పేర్కొనింది. సమన్లను పదేపదే దాట వేశారు.. ఇదే సమయంలో అరెస్ట్ నుంచి రక్షణను ఇవ్వలేమని ఢిల్లీ హైకోర్టు కూడా తేల్చిచెప్పడంతో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశామని ఈడీ తెలిపింది.
Read Also: Ileana D’Cruz :అలసిపోయాను.. ఇక నా వల్ల కాదు
Also Read
- Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
- Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
- India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
కాగా, ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ నుంచి కేజ్రీవాల్కు రిలీఫ్ దొరకలేదు అందుకే అతడి ఇంట్లో సోదాలు నిర్వహించిన తర్వాత అరెస్ట్ చేశామని కౌంటర్ అఫిడవిట్లో ఈడీ వివరించింది. లోక్సభ ఎన్నికల సమయంలో అరెస్ట్ చేశారనే ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ… నిందితుడి స్థాయితో తమకు సంబంధం లేదు, సాక్ష్యాలను ఆధారంగా మాత్రమే చర్యలు తీసుకున్నామని వెల్లడించింది. నేరారోపణలు ఉన్న రాజకీయ నాయకులకు అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తే ఎన్నికల ప్రక్రియ సమగ్రతను దెబ్బ తీసినట్టేనని ఈడీ కామెంట్స్ చేసింది. ఆధారాలను బట్టి ఒక వ్యక్తిని అరెస్టు చేయడం స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల భావనను ఉల్లంఘించినట్టు కాదని చెప్పింది. కేజ్రీవాల్ వాదనతో ఏకీభవిస్తే నేరస్థులైన రాజకీయ నాయకులకు అరెస్టుల నుంచి మినహాయింపు లభిస్తుందని అనే భావన వస్తుందని ఈడీ చెప్పుకొచ్చింది.
Read Also: APL lockout: ఏపీ పేపర్ మిల్లు ఆకస్మిక లాకౌట్.. ఉన్నట్టుండి ఎందుకు..?
అయితే, ఈడీ కౌంటర్ అఫిడవిట్లోని అంశాలను ఆమ్ ఆద్మీ పార్టీ తిరస్కరించింది. దర్యాప్తు సంస్థ అన్నీ అబద్ధాలే చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అరవింద్ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని.. బీజేపీ రాజకీయ విభాగంగా ఈడీ మారిపోయి.. అబద్ధాలు చెప్పే యంత్రంగా ఈడీ తయారయ్యిందని ఆప్ విమర్శలు చేసింది.
తాజావార్తలు
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
-
Jananayagan : కళ్లు చెదిరే రేటుకు ‘జననాయగన్’ తెలుగు రైట్స్?
-
Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
-
India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
-
CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో ‘బుల్లెట్ మోటార్ సైకిల్’ ప్రాజెక్టు ఏర్పాటు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!