APL lockout: ఏపీ పేపర్ మిల్లు ఆకస్మిక లాకౌట్.. ఉన్నట్టుండి ఎందుకు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APL lockout: ఉన్నట్టుండి ఆకస్మాత్తుగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని ఏపీ పేపర్ మిల్కు లాకౌట్ ప్రకటించింది యాజమాన్యం.. గత 23 రోజులుగా సమ్మెలో ఉన్నారు పేపర్ మిల్ కార్మికులు.. బీ-షిప్ట్ నుంచి కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు నోటీసు బోర్డులో ఓ లేఖ పెట్టారు.. ఈ నేపథ్యంలో కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పేపరు మిల్లు వద్దకు చేరుకుంటున్నారు.. దీంతో, అప్రమత్తమైన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, వేతన ఒప్పందం చేయాలని ఈ నెల 2వ తేదీ నుంచి పేపరు మిల్లులోని 11 కార్మిక సంఘాలు శాంతియుతంగా సమ్మెను కొనసాగిస్తున్నాయి.. కొత్త వేతన ఒప్పందం కోసం సుమారు 2,800 మంది కార్మికులు సమ్మె చేస్తున్నారు. అయితే, ఉన్నట్టుండి లాకౌట్ ప్రకటించింది యాజమాన్యం.. అర్థంతరంగా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించడంపై కార్మికులు, కార్మిక సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Read Also: Rishabh Pant: అతడిపై నమ్మకం ఉంచాం.. ప్లాన్ వర్కౌట్ అయింది: పంత్
Also Read
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
ఇటీవల బస్సు యాత్రలో పేపర్ మిల్లు మీదుగా వెళ్తున్న సీఎం వైఎస్ జగన్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు కార్మికులు.. కానీ, కొన్ని రోజుల వ్యవధిలోనే లాకౌట్ ప్రకటించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్మికులు.. మరోవైపు.. కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఈ నెల 12న సమావేశానికి పిలిచినప్పటికీ యాజమాన్యం.. ఆ సమావేశానికి హాజరుకాలేదు.. అయితే, ఏపీ పేపర్ మిల్లు యాజమాన్యం 2017లో చివరిసారిగా వేతన ఒప్పందం చేసిందని.. ఈ నెల 20న నో వర్క్- నో పేను యాజమాన్యం ప్రకటించగా.. ఇప్పుడు లాకౌట్ను ప్రకటించింది.
Read Also: Delhi: ఇండియా గేట్ వద్ద ఐస్ క్రీం విక్రేత దారుణ హత్య.. నిందితుడు అరెస్ట్
ఆంధ్రా పేపర్ లిమిటెడ్ (ఏపీఎల్) యాజమాన్యం ఏప్రిల్ 2 నుండి కొనసాగుతున్న సమ్మె ప్రభావాన్ని చూపుతూ ఏప్రిల్ 24 (బుధవారం) తన రాజమహేంద్రవరం యూనిట్కు ‘లాకౌట్’ ప్రకటించింది. ఏపీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖేష్ జైన్ జారీ చేసిన అధికారిక లేఖ ప్రకారం, కార్మికులు తమ డిమాండ్లపై నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఫలితంగా మిల్లులో ఆపరేషన్ మరియు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చిన లాకౌట్పై ఏపీఎల్ యాజమాన్యం తూర్పుగోదావరి కలెక్టర్ కె.మాధవి లతకు సమాచారం అందించింది. కొత్త వేతన విధాన ఒప్పందంపై యాజమాన్యం సంతకం చేయాలని, గుర్తింపు పొందిన కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ దాదాపు 2,800 మంది కార్మికులు ఆందోళనకు దిగారు. దాదాపు 800 మంది పర్మినెంట్ కార్మికులు, 1,200 మంది తాత్కాలిక కార్మికులు మరియు 800 మంది దినసరి కూలీలు లాకౌట్ వల్ల ప్రభావితమవుతారు.
తాజావార్తలు
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!