ECI Slams Rahul Gandhi: లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఇండియన్ బ్లాక్కి చెందిన నేతలు ఓటు చోరీ అనే పదాన్ని పదే పదే ఉపయోగించడంపై భారత ఎన్నికల కమిషన్ (ECI) గురువారం స్పందించింది. దొంగ ఓటు అనే పదాన్ని చెత్త పదంగా అభివర్ణించింది. ఇది కోట్లాది మంది భారతీయ ఓటర్లపై ప్రత్యక్ష దాడిగా, లక్షలాది మంది ఎన్నికల సిబ్బంది సమగ్రతపై దాడిగా ఎన్నికల సంఘం అభివర్ణించింది. 1951-52లో భారతదేశంలో జరిగిన మొదటి ఎన్నికల నుంచి “ఒక వ్యక్తి, ఒక ఓటు” చట్టం అమలులో ఉందని ఈసీఐ నొక్కి చెప్పింది. ఒక వ్యక్తి రెండుసార్లు ఓటు వేసినట్లు రుజువు ఉంటే.. ప్రమాణ స్వీకారం చేసిన అఫిడవిట్తో కమిషన్కు సమర్పించాలని పోల్ బాడీ పేర్కొంది. ఓటర్లను ఆధారాలు లేకుండా “దొంగలు” అని ముద్ర వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.
దేశంలో ఓటర్ల జాబితాకు సంబంధించి రాహుల్ గురువారం ప్రజెంటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘ఓట్ల చోరీ విధానం’ దేశవ్యాప్తంగా లోక్సభ, శాసనసభ ఎన్నికల సందర్భంగా అనేక నియోజకవర్గాల్లో కొనసాగిందని ఆయన ఆరోపించారు. దీనికి ‘మహాదేవపుర’ ఓటర్ల జాబితాయే నిదర్శనమన్నారు. ఈ ఒక్క నియోజకవర్గంలోనే లక్షకు పైగా ఓట్లు చోరీకి గురైనట్లు తేలిందన్నారు. ఈ వ్యవహారంలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం అడిగినట్లుగా అఫిడవిట్ దాఖలు చేయడానికి నిరాకరించారు. తాను లేవనెత్తిన అంశాలు ఎన్నికల సంఘం స్వంత వెబ్సైట్లోని డేటా నుంచే వచ్చాయని.. సాక్ష్యాలు అడగడం ఈ విషయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నమే అని ఆయన బదులిచ్చారు.
READ MORE: No Plastic In AP Secretariat: ఏపీ సెక్రటేరియట్లో నో ప్లాస్టిక్.. ఈ నెల 18 నుంచి అమలు..